India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి మేకర్స్ మరో పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మంట అంటుకున్న సింహాసనాన్ని తలకిందులుగా చూపించారు. రేపు డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త అప్డేట్ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ మారుతి తెలిపారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి మేకర్స్ మరో పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మంట అంటుకున్న సింహాసనాన్ని తలకిందులుగా చూపించారు. రేపు డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త అప్డేట్ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ మారుతి తెలిపారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.
వ్యూస్ కోసం కొందరు యూట్యూబర్లు చట్టవ్యతిరేక పనులు చేస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఇర్ఫాన్ అనే వ్యక్తి తన భార్య డెలివరీ జరుగుతుండగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లి బాబు బొడ్డుతాడును కట్ చేశాడు. దీన్ని వీడియో తీసి యూట్యూబ్లో పోస్టు చేయగా వైరలైంది. ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ సీరియస్ అయ్యింది. సదరు వ్యక్తి, డాక్టర్, ప్రైవేట్ ఆస్పత్రిపై కేసు పెట్టింది.
స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్-2026 నుంచి క్రికెట్, హాకీ, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలను నిర్వాహకులు తొలగించారు. ఖర్చును తగ్గించుకునేందుకు కేవలం 10 క్రీడలతో నిర్వహిస్తామని ప్రకటించారు. గతంలో ఈ స్పోర్ట్స్లోనే భారత్ ఎక్కువ మెడల్స్ సాధించింది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం భారత్కు ప్రతికూలంగా మారింది. 2022లో 19 క్రీడల్లో ఈ పోటీలు జరిగాయి.
త్రైమాసిక ఫలితాల్లో కీలక సంస్థల వీక్ ఎర్నింగ్స్, FIIల అమ్మకాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు నష్టపోయి 80,220 వద్ద, నిఫ్టీ 309 పాయింట్లు నష్టపోయి 24,472 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీలో 47 స్టాక్స్ నష్టపోయాయి. BSEలో ICICI, Infy మినహా మిగిలిన 28 స్టాక్స్ రెడ్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
పశ్చిమ హిమాలయాల్లో IND, GER, UKకు చెందిన పరిశోధకుల టీమ్ కొత్త పాముల జాతిని కనుగొంది. దీనికి నటుడు లియోనార్డో డికాప్రియో పేరును పెట్టింది. పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషికిగాను ఆయన్ను ఇలా గౌరవించింది. ‘అంగ్యుక్యులస్ డికాప్రియో/డికాప్రియోస్ హిమాలయన్ స్నేక్’గా పిలిచే ఈ పాముల్ని 2020లో గుర్తించగా, తాజాగా సైంటిఫిక్ రిపోర్ట్స్లో పబ్లిష్ చేశారు. ఇవి బ్రౌన్ కలర్లో ఉంటాయి. 22 ఇంచుల పొడవు పెరుగుతాయి.
MPకి నెలకు రూ.1లక్ష జీతం లభిస్తుంది. వీటితో పాటు ఆయనకు మొబైల్ ఛార్జీల కింద ఏడాదికి రూ.1.5లక్షలు ఇస్తారు. ఏడాదికి 34 ఫ్లైట్ టికెట్స్ ఉచితం. ట్రైన్లో ఫస్ట్ క్లాస్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏడాదికి ఉచితంగా 50వేల యూనిట్స్ విద్యుత్ & 4వేల కిలో లీటర్ల నీరు పొందొచ్చు. ప్రతినెలా రూ.62వేలు ఆఫీస్ అలవెన్స్, రూ.2లక్షలు హౌసింగ్ అలవెన్స్ వస్తాయి. పదవి పూర్తయ్యాక నెలకు రూ.25వేల పెన్షన్ వస్తుంది.
ఆలయాలపై లౌడ్ స్పీకర్ల విషయంలో మధ్యప్రదేశ్ అదనపు కార్యదర్శి శైల్బాలా మార్టిన్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. గుళ్లపై లౌడ్స్పీకర్లు తీవ్ర శబ్ద కాలుష్యాన్ని కలుగజేస్తాయని ఆమె 2 రోజుల క్రితం ట్వీట్ చేశారు. అవి అర్ధరాత్రి వరకూ మోగుతూ అందర్నీ డిస్టర్బ్ చేస్తుంటాయని పేర్కొన్నారు. ఆ ట్వీట్ వైరల్ కావడంతో ఎంపీలో దుమారం రేగుతోంది. అక్కడి హిందూ సంఘాలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పదేళ్ల కెరీర్లో పెద్ద సినిమాల్లో నటించినా తనను ‘టైగర్ ష్రాఫ్ హీరోయిన్’ అనే పిలిచేవారని కృతి సనన్ చెప్పారు. ఆ పేరు పోగొట్టుకోవాలని, సొంత గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో కష్టపడినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినీ నేపథ్యం లేకపోతే ప్రేక్షకులు ఇలాంటి పేర్లు పెట్టేస్తారన్నారు. ఈమె మహేశ్బాబు సరసన ‘1 నేనొక్కడినే’తో సినీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్తో కలిసి బాలీవుడ్లో ‘హీరోపంటీ’ మూవీలో నటించారు.
రాత్రంతా నిద్రపోయినప్పటికీ కొన్నిసార్లు పగటిపూట కూడా నిద్రమత్తులో ఉండటం, ఏ విషయంపైనా దృష్టి సారించలేకపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇదీ ఓ వ్యాధనే విషయం తెలుసా? దీనిని హైపర్సోమ్నియా అని పిలుస్తారు. దీనివల్ల పని జీవితం, సామాజిక జీవితంతో పాటు ఇంటిపనులు చేయడం సవాలుగా మారుతుంది. నాడీ సంబంధిత, స్లీప్ అప్నియా వంటి వైద్య సమస్యల వల్ల హైపర్సోమ్నియా బారిన పడే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.