India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితంపై వెబ్ సిరీస్ తీయనున్నట్లు నోయిడాకు చెందిన వ్యాపారవేత్త అమిత్ జానీ ప్రకటించారు. దానికి ‘లారెన్స్-ఎ గ్యాంగ్స్టర్ స్టోరీ’ అని టైటిల్ పెట్టినట్లు తెలిపారు. దీనికి భారత చలనచిత్ర సంఘం నుంచి అనుమతి కూడా తీసుకున్నామని, ఫైర్ ఫాక్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్పై తెరకెక్కిస్తామని పేర్కొన్నారు. దీపావళి అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు.
బిగ్ బాస్-8 కంటెస్టెంట్, ఆర్జే శేఖర్ బాషాను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ హర్షసాయి బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆయనను 3 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. శేఖర్ బాషా తనపై నిరాధార ఆరోపణలు చేశారని బాధితురాలు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
AP: రీచ్ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం, స్థానిక అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లవచ్చని పేర్కొంది. గతంలో రీచ్ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్లబండ్లకు మాత్రమే అనుమతి ఉండగా, తాజాగా ట్రాక్టర్లకూ వర్తింపచేసింది. పలుచోట్ల ట్రాక్టర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తుండటంతో ప్రభుత్వం తాజాగా GO ఇచ్చింది.
AP: ఈ నెల 26వ తేదీ నుంచి TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. గతంలో మాదిరి రూ.100 కట్టినవారికి సాధారణ సభ్యత్వం కల్పిస్తామని, ₹లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తామని వెల్లడించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ₹5లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని, చనిపోయిన కార్యకర్తకు మట్టి ఖర్చుల కింద అదనంగా ₹10వేలు ఇస్తామని ఆ పార్టీ MLA, MP, MLCలతో జరిగిన భేటీలో వెల్లడించారు.
సావర్కర్, ఎంఎస్ గోల్వాల్కర్ ఇద్దరూ రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాష్ట్ర పీసీసీ కార్యాలయంలో వ్యాఖ్యానించారు. ‘రాజ్యాంగాన్ని గౌరవించకుండా గోల్వాల్కర్ 3 దశాబ్దాల పాటు ఆర్ఎస్ఎస్ను నడిపారు. మహాత్మాగాంధీ హత్య కేసు నిందితుల్లో సావర్కర్ కూడా ఒకరు. వీరిద్దరూ రాజ్యాంగంలోని ప్రతి పేజీని తీవ్రంగా వ్యతిరేకించారు. వారి గురించి అందరూ తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు.
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, తూ.గో, ప.గో, ఏలూరు, NTR, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వాన కురవొచ్చని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని వెల్లడించింది.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ధరించే బ్రాస్లెట్ చాలా ఫేమస్. ఆయన ఫ్యాన్స్ దాన్ని పోలిన బ్రాస్లెట్లను ధరిస్తుంటారు. అలాంటి బ్రాస్లెట్ను తన తండ్రి ధరిస్తుండేవారని ఓ ఇంటర్వ్యూలో సల్లూభాయ్ తెలిపారు. ‘దీనిలోని నీలం రంగు రాయిని ఫెరోజా లేదా టర్కోయిస్ అని పిలుస్తారు. దీన్ని జీవం ఉన్న రాయిగా చెబుతారు. నాపై నెగటివిటీని అడ్డుకుని పగిలిపోతుంది. ఇలా ఇప్పటికి ఏడుసార్లు మార్చాను’ అని వివరించారు.
AP: సమస్యల వలయాలుగా మారిన స్కూళ్ల నిర్వహణ కోసం రూ.100 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2024-25 సంవత్సరానికి 855 పీఎంశ్రీ స్కూళ్లకు ₹8.63cr KGBVలకు ₹35.16cr, మండల రిసోర్స్ కేంద్రాలకు ₹8.82cr, మిగతా స్కూళ్లకు ₹51.90cr ఇచ్చారు. సుద్దముక్కలు, డస్టర్స్, చార్టులు, విద్యా సామాగ్రి, రిజిస్టర్లు, రికార్డులు, క్రీడా సామాగ్రి, ఇంటర్నెట్, తాగునీటి కోసం ఈ నిధులు వాడాలన్నారు లోకేశ్.
టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బాత్ టబ్లో వైట్ కలర్ బికినీ ధరించిన ఆమె ఫొటోలకు ఫోజులిచ్చారు. కానీ ఆ ఫొటోలు డీప్ ఫేక్ అని తాజాగా తేలింది. ఆ చిత్రాలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రితుపర్ణ బసక్విగా నిర్ధారణ అయింది. ఆమె ఇన్స్టాలో షేర్ చేసిన ఫొటోలను AI ద్వారా మృణాల్ ఫేస్గా ఎడిట్ చేశారు. దీంతో టెక్నాలజీని మిస్ యూజ్ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
రిలేషన్షిప్పై నియంత్రణకు కొందరు చేసే భావోద్వేగ మోసాల్నే లవ్ బాంబింగ్ అంటారు. నిజానికిదో మానసిక వ్యాధి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రొమాంటిక్ పార్ట్నర్స్లో ఎవరికైనా ఇది ఉండొచ్చు. ఊరికే గిఫ్టులివ్వడం, వారిపై ఎక్కువ ఆధారపడేలా చేయడం, నిత్యం అటెన్షన్ చూపడం, అతిగా పొగడటం, పిచ్చిగా ప్రేమ చూపడం దీని లక్షణాలు. వీటితో ఒంటరై, అవతలి వాళ్లు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారంటే మీరూ లవ్ బాంబింగ్ బాధితులే అన్నమాట!
Sorry, no posts matched your criteria.