India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* TG: సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ
* రాజీవ్ విగ్రహాన్ని తొలగించేదెవడ్రా.. రండి: CM రేవంత్ రెడ్డి
* తెలంగాణ తల్లిని అవమానిస్తారా?: KTR
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ
* AP: ఐటీలో ప్రతి నలుగురిలో ఒకరు తెలుగువారే: CBN
* రాజధాని రైతుల ఖాతాల్లో కౌలు డబ్బులు జమ
* చంద్రబాబు పేదల వ్యతిరేకి: జగన్
* కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై అత్యాచార కేసు
భారత్, గాజా, మయన్మార్ వంటి దేశాల్లో ముస్లింల పరిస్థితిని ఉద్దేశించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఆయన వ్యాఖ్యలను స్వీకరించబోమని విదేశాంగ శాఖ Xలో ట్వీట్ చేసింది. మైనార్టీలను ఉద్దేశించి మాట్లాడే దేశాలు తమ దేశంలోని పరిస్థితులను ముందుగా పరిశీలించుకోవాలని చురకలు అంటించింది.
ఢిల్లీలో కొత్తగా ద్వారక అంతర్జాతీయ స్టేడియం నిర్మించనున్నారు. దీనిని క్రికెట్ కమ్ ఫుట్బాల్ స్టేడియంగా DDA (ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ) రూపొందించనుంది. రూ.1,500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ స్టేడియంలో స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, టీటీ వంటి ఆటలు ఆడేందుకు సౌకర్యాలు ఉంటాయి. 30 వేల మంది కెపాసిటీతో దీనిని నిర్మిస్తారు. ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభించి 2027 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తారు.
జానీ మాస్టర్పై అత్యాచార ఆరోపణల కేసులో అతని భార్య వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో మాస్టర్ భార్య కూడా తనను వేధించినట్లు బాధితురాలు పేర్కొంది. అతని కోరిక తీర్చకపోతే బలవంతంగా దాడికి తెగబడేవాడని ఆమె తెలిపింది. వేధింపులు భరించలేక బయటకు వెళ్లి వేరే పని చేసుకుంటుంటే జానీ మాస్టర్, ఆయన భార్య తన ఇంటికి వచ్చి దాడి చేశారని బాధితురాలు వెల్లడించింది.
అర్ధరాత్రి వరకూ మెలకువగా ఉండటం మంచి అలవాటు కాదని యశోదా ఆస్పత్రి వైద్యుడు దిలీప్ గూడె హెచ్చరిస్తున్నారు. ‘ప్రకృతిసిద్ధంగా మన శరీరం రాత్రుళ్లు నిద్రపోయి పగలు పనిచేయాలి. ఒంట్లో సమస్యల్ని శరీరం నిద్రలోనే రిపేర్ చేసుకుంటుంది. అర్ధరాత్రి దాటినా మెలకువగా ఉంటే నాణ్యమైన నిద్ర ఉండదు. దీని వలన బాడీ అలసిపోవడమే కాక రోగ నిరోధక శక్తి తగ్గి దీర్ఘకాలికంగా పలు రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది’ అని వివరించారు.
ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో Move to iOS యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మీ ఐఫోన్లో యాప్స్ అండ్ డేటాలో Move Data from Android సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడు వచ్చే కోడ్ను ఆండ్రాయిడ్ ఫోన్లో ఎంటర్ చేయాలి. తద్వారా ఐఫోన్ టెంపరరీ వైఫై నెట్వర్క్ను క్రియేట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఈ నెట్వర్క్లో జాయిన్ అవ్వాలి. అనంతరం డేటా టైప్ సెలక్ట్ చేసుకొని ఐఫోన్లోకి బదిలీ చేసుకోవచ్చు.
TG: గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన రాష్ట్ర కార్మికుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2023 డిసెంబర్ 7 తర్వాత గల్ఫ్లో మరణించిన వారి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ‘ప్రవాసీ ప్రజావాణి’ పేరుతో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది.
ప్రభుత్వంలో కుమ్ములాటలు, MLAల ఫిరాయింపులు, కోర్టు కేసుల వల్ల ఇటీవల పదవిలో ఉన్న CMలు రాజీనామాలు చేస్తున్న ఒరవడి కొనసాగుతోంది. గతంలో MHలో ఉద్ధవ్ ఠాక్రే, MPలో కమలనాథ్, ఝార్ఖండ్లో హేమంత్ సోరెన్, హరియాణలో మనోహర్ లాల్, KAలో యడియూరప్ప, గుజరాత్లో విజయ్ రూపాని, ఉత్తరాఖండ్లో త్రివేంద్ర సింగ్ పదవిలో ఉండగా రాజీనామా చేశారు. తాజాగా ఢిల్లీ CM కేజ్రీవాల్ ఈ జాబితాలో చేరనున్నారు.
విండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్తో తన తల్లికి ఉన్న సంబంధం వల్ల 7వ తరగతిలోనే వేధింపులకు గురైనట్టు నేనా గుప్తా కుమార్తె మసాబా గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి గర్భం దాల్చినప్పుడు తనది అక్రమ సంతానంగా భావిస్తూ నేనా గుప్తా తల్లిదండ్రులు ఎవరూ చూట్టూ లేరని, తన తండ్రి రిచర్డ్స్ కూడా లేరన్నారు. తాను శారీరకంగా ఎలా ఉన్నది, లేదా ఎందుకలా ఉన్నది కూడా చాలా మందికి అర్థం కాలేదన్నారు.
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు మోస్తరు వర్షం కురవనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.