India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం పాలవక్కంలోని తన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. రెండ్రోజులుగా ఫోన్ తీయకపోవడంతో అతని మిత్రుడు ప్రదీప్ ఇంటికి వెళ్లి చూడగా ఆయన చనిపోయిన విషయం తెలిసింది. తలకు బలమైన గాయం తగలడం లేదా గుండెపోటుతో మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విలన్, కమెడియన్గా అలరించిన ప్రదీప్.. టెడ్డీ, ఇరుంబు తిరై, లిఫ్ట్, ఆడై వంటి సినిమాల్లో నటించారు.
AP: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును కలిసేందుకు పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు ప్రయత్నించారు. వీరిలో జగన్ హయాంలో పనిచేసిన శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. అయితే వీరికి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు.
జాతీయ భద్రతా సలహాదారు(NSA)గా వరుసగా మూడోసారి అజిత్ దోవల్ నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ, అంతర్జాతీయ భద్రతా అంశాలపై అపారమైన అనుభవం ఉన్న దోవల్ 2014 నుంచి జాతీయ భద్రతా సలహాదారుగా కొనసాగుతున్నారు.
టెన్నిస్ స్టార్ ప్లేయర్లలో ఒకరైన రోజర్ ఫెదరర్పై డాక్యుమెంటరీని రూపొందించారు. ‘‘ఫెదరర్’ పేరుతో రూపొందిన డాక్యుమెంటరీ ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. దీనికి ‘12 ఫైనల్ డేస్’ అని క్యాప్షన్ చేసింది. తన కెరీర్లో 20 గ్రాండ్ స్లామ్లు గెలిచిన ఫెదరర్ 2022లో ఆటకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
జీవితంలో కచ్చితంగా ఒక తోడు ఉండాలని భావించడం లేదని నటి మమతా మోహన్ దాస్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో రిలేషన్షిప్పై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘లాస్ ఏంజెలెస్లో ఉన్నప్పుడు ఓ వ్యక్తిని ప్రేమించా. కానీ మా బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. రిలేషన్ ఉండాలి కానీ అందులో ప్రెజర్ ఉండకూడదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతం మంచి భాగస్వామి కోసం వెతుకుతున్నా. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకొస్తాయి’ అని చెప్పారు.
AP: అమరావతి రైతులకు వైసీపీ అధినేత జగన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ నెల 17 నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో పాల్గొనే ముందే ఆయన క్షమాపణ కోరాలని అన్నారు. బయటివాళ్లు వదిలినా అసెంబ్లీలో తాను వదలనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఈయన అమరావతి రైతుల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.
మోదీ సర్కారులోని కొత్త కేబినెట్లో 99శాతం మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. 71మందిలో 70మంది కోటీశ్వరులేనని పేర్కొంది. 39శాతంమందిపై క్రిమినల్ కేసులున్నాయని తెలిపింది. 80శాతంమంది గ్రాడ్యుయేషన్ లేదా ఆపై డిగ్రీ కలిగి ఉండగా, 15శాతంమంది 12వ తరగతి వరకే చదువుకున్నారు. మంత్రుల ఆస్తుల సగటు రూ.107.94 కోట్లుగా ఉంది. ఆరుగురు మంత్రుల ఆస్తులు రూ.100 కోట్లకు పైమాటేనని నివేదిక తెలిపింది.
AP: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ఈ డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ – 7,725, ఎస్జీటీ – 6,371, టీజీటీ – 1,781, పీజీటీ – 286, ప్రిన్సిపల్స్ – 52, పీఈటీ – 132 పోస్టులు ఉన్నాయి.
> SHARE
AP: రాష్ట్రంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈమేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేశారు. దీంతో త్వరలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
అరుణాచల్ప్రదేశ్లో పెమా ఖండూ సీఎంగా BJP ప్రభుత్వం కొలువుదీరింది. వరుసగా మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పెమా.. తన కేబినెట్లో ఓ మహిళకు స్థానం కల్పించారు. ఆమె హాయులియాంగ్ అసెంబ్లీ స్థానంలో గెలిచిన దసాంగ్లు పుల్. దీంతో ఆ రాష్ట్ర చరిత్రలో మంత్రి పదవి పొందిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈమె దివంగత మాజీ CM కలిఖో పుల్ సతీమణి. 2016 నుంచి హాయులియాంగ్లో గెలుస్తూ వస్తున్నారు.
Sorry, no posts matched your criteria.