India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై BJP సెటైర్లు వేసింది. గ్యారంటీలు అమలు చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేసిందని ట్వీట్ చేసింది. గ్యారంటీలకు డబ్బు సమకూర్చేందుకే ధరలు పెంచుతోందని పలు వార్తా కథనాలను పంచుకుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, స్కాలర్షిప్స్ కోత, వికాలంగుల నిధులను సైతం ప్రభుత్వం ఎగ్గొట్టిందని పేర్కొంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ‘5 గ్యారంటీలు’ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ATF) ధరను చమురు సంస్థలు నెల క్రితమే కిలోలీటర్కు రూ.2941 పెంచగా, దాన్ని తాజాగా మరో రూ.1318 పెంచాయి. దీంతో ప్రస్తుతం ఏటీఎఫ్ కిలోలీటర్ ధరలు ఢిల్లీలో రూ.91,856గా, కోల్కతాలో రూ.94,551గా, ముంబైలో రూ.85,861గా, చెన్నైలో రూ.95,231గా ఉన్నాయి. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లైట్ టిక్కెట్ల ధర కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పాలసీదారులు చెల్లించే జీవిత బీమా ప్రీమియంలపై GST రద్దు సహా, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెంచకూడదనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీని కోసం All India Life Insurance Employees Federation ఉద్యమబాట పట్టింది. తమ డిమాండ్లను పార్లమెంటులో లేవనెత్తేలా అన్ని పార్టీల ఎంపీలతో సంఘం ప్రతినిధులు త్వరలో సమావేశం కానున్నారు. అలాగే న్యూ లేబర్ కోడ్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ XI జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 43.2 ఓవర్లలో 240 రన్స్ చేసింది. ఛేదనలో భారత ఓపెనర్ జైస్వాల్ (45), గిల్(50), నితీశ్ రెడ్డి(42), జడేజా(27) రాణించడంతో 42.5 ఓవర్లలోనే 244/4 రన్స్ చేసి 6 వికెట్ల తేడాతో గెలిచింది. రోహిత్(3) నిరాశపర్చారు. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో గెలిచినా ఇంకా ఆట కొనసాగిస్తున్నారు.

TG: నెహ్రూ నుంచి నేటివరకు రైతులే కాంగ్రెస్ పార్టీ తొలి ప్రాధాన్యమని CM రేవంత్ వెల్లడించారు. తమ ప్రభుత్వం రైతుల కోసమే ఉందని, రైతును రాజును చేయడమే తమ లక్ష్యమన్నారు. ‘KCR బకాయి పెట్టిన రూ.7,625 కోట్ల రైతుబంధును మేం చెల్లించాం. ఆగస్టు 15 నాటికి 22.22 లక్షల మందికి రుణమాఫీ చేశాం. నిన్న కూడా 3.14 లక్షల మంది రైతులకు రూ.2747కోట్ల రుణమాఫీ చేశాం. BRS రుణమాఫీ విషయంలో పదేళ్ల పాటు మోసగించింది’ అని ఆరోపించారు.

AP: ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఢిల్లీ వాతావరణం సభ్యుల పనితీరును ప్రభావితం చేస్తోందని వివరించారు. దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తే జాతీయ సమగ్రత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో సమావేశాలు పెడితే బాగుంటుందో కామెంట్ చేయండి.

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతుభరోసా(రైతుబంధు) కార్యక్రమాన్ని అమలు చేస్తామని, సంక్రాంతి పండుగ తర్వాత పథకం నిధులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు. విధివిధానాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయిస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పే తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని సీఎం కోరారు.

TG: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2వేల పెన్షన్ను రూ.4వేలు చేస్తామని హామీ ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఇవ్వాల్సిన రూ.2వేల పెన్షన్ కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. రూ.4వేల పెన్షన్, ఆటో డ్రైవర్లకు రూ.12వేలు ఎప్పుడిస్తావని CM రేవంత్ను ప్రశ్నించారు. హామీలు నెరవేర్చే స్థితిలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లేదని ఆయన HYDలో అన్నారు.

రైళ్లలో ప్రయాణికులకు అందించే దుప్పట్లను నెలకు కనీసం ఒకసారి ఉతికిస్తున్నామని కేంద్ర మంత్రి ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రజల నుంచి వ్యతిరేక వ్యక్తం కావడంతో నెలకు రెండుసార్లు దుప్పట్లను ఉతికిస్తామని ఉత్తర రైల్వే ప్రకటించింది. UV రోబోటిక్ శానిటైజేషన్ ద్వారా వాటిని శుభ్రం చేయిస్తామని తెలిపింది. 2010కి ముందు 2-3 నెలలకొకసారి బ్లాంకెట్స్ ఉతికేవారని రైల్వే ప్రతినిధులు ఒకరు అన్నారు.

దేశవ్యాప్తంగా పుష్ప-2కి క్రేజ్ మామూలుగా లేదు. హిందీ రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ భారీగా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో మాత్రం ‘బాయ్కాట్ పుష్ప-2’ ట్రెండ్ అవుతోంది. టిక్కెట్ రేట్లను భారీగా పెంచడమే దీనిక్కారణం. మల్టీఫ్లెక్స్లలో రూ.500 నుంచి రూ.1000 మధ్యలో, సింగిల్ స్క్రీన్లలో సుమారు రూ.400 వరకు రేట్లున్నాయి. సినిమాకు ఇంత ఖర్చుపెట్టలేం అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.