India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: యాదవ, గౌడ, మాల, గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ల ఏర్పాటుతోపాటు వాటికి సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కార్పొరేషన్కు 15 మంది చొప్పున 60 మంది సభ్యులను నియమించింది. ప్రతి కార్పొరేషన్లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి అవకాశం కల్పించింది.

రేపటి నుంచి Bank Niftyలో వీక్లీ డెరివేటివ్స్ కనిపించవు. ఈ ఇండెక్స్ Volatilityపై అవగాహన లేని రిటైల్ ట్రేడర్లు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దీంతో ఇక నుంచి ఒక ఇండెక్స్లోనే వీక్లీ డెరివేటివ్లకు అవకాశం ఇవ్వాలని ఎక్స్ఛేంజ్లను SEBI ఆదేశించింది. దీంతో Nifty వీక్లీ F&Oను అలాగే ఉంచి Bank Nifty వీక్లీ ఆప్షన్స్ను తొలగించాలని NSE నిర్ణయించింది. ఈ ఇండెక్స్లో Monthly Derivatives మాత్రమే ఉంటాయి.

ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా 370 రైళ్లకు అదనంగా 1,000 జనరల్ బోగీలను చేర్చనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల రోజుకు అదనంగా లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని తెలిపింది. వచ్చే రెండేళ్లలో 10వేలకు పైగా కొత్త నాన్ ఏసీ జనరల్ కోచ్లను ప్రవేశపెడతామంది. ఇందులో 4వేల స్లీపర్ క్లాస్ కోచ్లు ఉంటాయని పేర్కొంది.

తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం డైరెక్టర్ <<14581839>>ఆర్జీవీ<<>> AP హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా, వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా పోస్టులు పెట్టలేదని తెలిపారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ను త్వరలోనే న్యాయస్థానం విచారించనుంది. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆయన పిటిషన్ దాఖలు చేయగా <<14642033>>కొట్టేసిన<<>> విషయం తెలిసిందే.

AP: జీడి నెల్లూరు నియోజకవర్గం గొడుగుచింతకు చెందిన అయ్యప్ప భక్తులు కేరళ వెళ్తుండగా వాహనానికి ప్రమాదం జరిగింది. అక్కడి పోలీసులు స్టేషన్లో ఉంచగా, తమను ఆదుకోవాలని వారు సోషల్ మీడియాలో మంత్రి లోకేశ్ను కోరారు. సురక్షితంగా తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అక్కడి అధికారులతో లోకేశ్ టీం మాట్లాడగా, వారిని పోలీసులు విడిచిపెట్టారు. దీంతో అయ్యప్ప భక్తులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన RRR ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ 2018, నవంబరు 19న మొదలైన విషయాన్ని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ట్విటర్లో గుర్తుచేసింది. ‘వారిద్దరూ కలిసి ప్రయాణించారు. కలిసి సాధించారు. RRR తొలి అడుగు వేసి నేటికి ఆరేళ్లు’ అని ట్వీట్ చేసింది. 2022, మార్చి 25న విడుదలైన RRR ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రూ.85వేల కోట్ల పెట్టుబడులపై <<14654925>>SIPB భేటీలో<<>> తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అమరావతి పనులకు గతంలో కేటాయించిన టెండర్లు రద్దు చేసి కొత్తవాటిని పిలవడంపై, అలాగే పోలవరం ప్రాజెక్టుపై చర్చించనుంది. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

స్టాక్ మార్కెట్లో మంగళవారం Short-term Buying వల్ల సూచీలు ఉదయం భారీ లాభాల్లో పయనించాయి. అయితే High Volatility, FIIల ఔట్ ఫ్లో, Q2 వీక్ ఎర్నింగ్స్ వల్ల ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు స్పష్టమవుతోంది. $ క్రమంగా బలపడుతుండడం, US ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం వల్ల FIIలు Square Off చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం, RBI వడ్డీ రేట్ల కోత ఆలస్యం మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నాయి.

కోడి ముందా? గుడ్డు ముందా? అనే ప్రశ్నకు ఇప్పటిదాకా సరైన జవాబే దొరకలేదు. శాస్త్రవేత్తలను సైతం ఇబ్బంది పెట్టిన ఈ ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. జెనీవా యూనివర్సిటీలోని జీవరసాయన శాస్త్రవేత్త మెరైన్ ఒలివెట్టా నేతృత్వంలోని బృందం దీనిపై పరిశోధన చేసింది. జంతువుల ఆవిర్భావానికి ముందే పిండం లాంటి నిర్మాణాలుండవచ్చని అంచనా వేశారు. అంటే దీని ప్రకారం కోడి ముందు కాదు. దీనిపై ఇంకా ఇతర పరిశోధనలు జరుగుతున్నాయి.

TG: హనుమకొండ సభలో కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన <<14654336>>వ్యాఖ్యలపై<<>> హరీశ్రావు మండిపడ్డారు. చేతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు రేవంత్ పరిస్థితి ఉందని విమర్శించారు. 11 నెలల పాలనలో చేసిందేమీ లేక పిచ్చి మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుంచి లంబాడీ బిడ్డల దాకా రేవంత్ చేసిన ఘోరాలను ప్రజలు మర్చిపోరని చెప్పారు.
Sorry, no posts matched your criteria.