India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: అధికారంలోకి వచ్చాక చేపట్టిన ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలపై ఆయన GHMC ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలను ప్రజలకు తెలిసేలా కృషి చేయాలని ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.

తిరుపతి స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం లభించనుంది. వారికి తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో 500 టోకెన్లు రేపు తెల్లవారుజాము 3-5 గంటల మధ్య జారీ చేస్తారు. టోకెన్ పొందేందుకు, దర్శన సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఓసారి దర్శనమైన స్థానికులకు 90 రోజుల వరకు పునర్దర్శన అవకాశం ఉండదు.

AP: ఫెంగల్ తుఫాను ప్రభావంతో శనివారం మధ్యాహ్నం నుంచి తిరుపతి జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ నిన్న ప్రకటించారు. అయితే ఈరోజు కూడా అక్కడ వర్షాలు పడుతున్నాయి. పైగా రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో సోమవారం సెలవు ఇస్తారా? లేదా? అనే సందేహం నెలకొంది. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఢిల్లీలో ఒంటరి పోరుకు సిద్ధపడి కాంగ్రెస్కు కేజ్రీవాల్ షాక్ ఇచ్చారు. 2020లో 70 సీట్లలో ఒక్కటీ గెలవని కాంగ్రెస్ తిరిగి పుంజుకోవడంపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. లోక్సభ పోల్స్లో ఢిల్లీ, హరియాణాలో కలిసి పోటీ చేసినా పంజాబ్లో ఒంటరిగా బరిలో దిగాయి. హరియాణా అసెంబ్లీ పోల్స్లోనూ పొత్తు కుదరలేదు. ఢిల్లీలోనూ కుదరదని చెప్పిన ఆప్ INDIA కూటమికి దూరమవుతోందని పలువురు విశ్లేషిస్తున్నారు.

ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ XI జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్శర్మ <<14760217>>ప్రయోగం<<>> ఆశించిన ఫలితం ఇవ్వలేదు. రెగ్యులర్ ఓపెనర్ అయిన రోహిత్ ఈ మ్యాచ్లో నం.4లో క్రీజులోకి వచ్చారు. 11 బంతులు ఎదుర్కొని కేవలం 3పరుగులకే అవుట్ అయ్యారు. ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్టుకు దూరమైన రోహిత్ ప్రాక్టీస్ మ్యాచ్ను సరిగా వినియోగించుకోలేకపోయారు. దీంతో హిట్మ్యాన్ ఫామ్పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

తీరం దాటినా ఫెంగల్ తుఫాన్ భూభాగంపైనే కొనసాగుతోందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. 6 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. రేపు కోనసీమ, KKD, NLR, చిత్తూరు, TPTY, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. తీరం వెంబడి గంటకు 40-50KM వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. TPTY, NLR, CTR, YSR జిల్లాల్లో ఆకస్మిక వరదలు వస్తాయంది.

TG: కేంద్రమంత్రి <<14761412>>కిషన్రెడ్డికి<<>> తెలంగాణతో ఏం సంబంధం అని CM రేవంత్ ప్రశ్నించారు. ‘ఆయనకు ఈ రాష్ట్రం గురించి మాట్లాడేందుకు ఏం అర్హత ఉంది? గుజరాత్లో మద్యపాన నిషేదం ఉందని చెబుతున్నారు. బస్సు ఏర్పాటు చేస్తా అక్కడ ఏయే బ్రాండ్లు దొరుకుతున్నాయో చూసి వద్దామా? BJP గడిచిన మూడు పర్యాయాల మేనిఫెస్టోలతో ముందుకు వస్తే మేము కూడా మా మేనిఫెస్టోలతో చర్చకు సిద్ధం’ అని రేవంత్ సవాల్ విసిరారు.

జ్ఞానవాపి మసీదుపై పిటిషన్ విచారణ సందర్భంగా అప్పటి CJI DY చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలే ప్రార్థనా స్థలాలపై వివాదాలకు కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మే 20, 2022న ఈ కేసును విచారిస్తూ ‘ప్రార్థనా స్థలాల ప్రాచీన స్వరూపం ఏంటన్నది నిర్ధారించడాన్ని <<14742769>>Places of Worship Act-1991<<>> అడ్డుకోద’ని మౌఖికంగా అన్నారు. దీని వల్లే ప్రార్థనా స్థలాలపై వివాదాలు అధికమయ్యాయని విపక్షాలు తప్పుబడుతున్నాయి.

కన్నడ పాపులర్ సీరియల్ నటి శోభితా శివన్న(32) హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ప్రస్తుతం హైదరాబాద్కు వస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలోని సక్లేశ్పూర్కు చెందిన శోభిత ‘బ్రహ్మగంటు’ సహా పలు సీరియళ్లతో మంచి గుర్తింపు పొందారు. 2023 వివాహం అనంతరం నటనకు విరామం ఇచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న EPFO 3.0 ఖాతాదారుల అత్యవసరాలను తీర్చనుంది. 2025 జూన్ నుంచి ఉద్యోగులు PF ఖాతా నుంచి నిర్ణీత మొత్తాన్ని EPFO కార్డు (ATM కార్డు మాదిరి)తో డ్రా చేసుకోనే సౌకర్యం ఉంటుందని తెలుస్తోంది. అలాగే రిటైర్మెంట్ తరువాత అధిక ప్రయోజనాలను పొందేందుకు అధిక PF కూడా చెల్లించే అవకాశం అందుబాటులోకి రానుంది. అయితే ఇందులో ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ యథాతథంగా ఉంటుంది.
Sorry, no posts matched your criteria.