India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రెపో రేట్లో ఎలాంటి మార్పులు చేయట్లేదని RBI ప్రకటించినా అది స్టాక్ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 60 పాయింట్ల స్వల్ప నష్టంతో 74160 వద్ద సెన్సెక్స్.. 24 పాయింట్ల లాస్తో 22,490 వద్ద నిఫ్టీ ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. రియల్టీ రంగం షేర్లు రాణించినా ఇతర ప్రధాన రంగాల షేర్లు మందకొడిగా సాగుతున్నాయి. HDFC బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ లైఫ్, కొటక్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

<<12964536>>కచ్చతీవు<<>> ద్వీపాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లకు ఎలాంటి ఆధారం లేదని శ్రీలంక మంత్రి డగ్లస్ దేవానంద అన్నారు. ‘1974 ఒప్పందం ప్రకారం కచ్చతీవును శ్రీలంకకు అప్పగించారు. 1976లో కుదిరిన మరో ఒప్పందం ప్రకారం కన్యాకుమారికి దిగువన వెస్ట్ బ్యాంకు ప్రాంతం భారత్కు దక్కింది. అది కచ్చతీవు కంటే 80 రెట్లు పెద్దది’ అని తెలిపారు. ఎన్నికల వేళ ఈ ద్వీపం వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామని కాంగ్రెస్ నేత చిదంబరం చెప్పారు. రిజర్వేషన్లపై 50శాతం పరిమితి ఎత్తివేత, రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత, అగ్నివీర్ స్కీం రద్దు, ఇంధన ధరల తగ్గింపు చేస్తామన్నారు. సంపద సృష్టించాలంటే వృద్ధి రేటు పెరగాలని.. మోదీ పాలనలో అలా జరగలేదన్నారు. ఐదేళ్లుగా వేతనాలు పెరగలేదన్నారు. యూపీఏ హయాంలో వృద్ధి రేటు 7.8గా ఉంటే.. ఎన్డీఏ హయాంలో గత పదేళ్లలో 5.8గానే ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. న్యాయ్ యాత్ర పేరుతో 48పేజీల మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో ప్రకటించారు. సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలు ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, కె.సి.వేణుగోపాల్ ఉన్నారు.

ఉమ్మడి కుటుంబ బాధ్యతను మోసే మిడిల్ క్లాస్ యువకుడికి ఎదురయ్యే ఇబ్బందులే ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ కథ. విజయ్ దేవరకొండ, మృణాల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఫస్టాఫ్, కామెడీ, క్లైమాక్స్, కుటుంబ విలువలు తెలిపే సందేశాత్మక సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చుతాయి. బోరింగ్ సీన్లు, రొటీన్ స్టోరీ, సినిమా నిడివి, ట్విస్టులు లేకపోవడం మైనస్. మ్యూజిక్, స్క్రీన్ప్లేపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. RATING: 2.50/5.

AP: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ టీడీపీలో చేరనున్నారు. కాసేపట్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. టీడీపీలో చేరిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా ‘పుష్ప-2’ టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సినిమాలోని ఆమె లుక్ను రివీల్ చేసింది. ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిని గ్లామర్లెస్గా చూపించారని, ‘పుష్ప-2’లో బ్యూటిఫుల్గా చూపించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో వారు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. అప్పుడు మాజీ MLA, ప్రస్తుతం MLAగా ఉన్న ఓ కీలక నేత ఫోన్ను వారు ట్యాప్ చేశారట. దీంతో వారిని HYD తీసుకొచ్చి విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ట్యాపింగ్ కేసుతో లింకై ఉన్న అంశాలన్నింటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

రెపో రేటును 6.5%గా కొనసాగిస్తున్నట్లు RBI తాజాగా ప్రకటించింది. బ్యాంకులు RBI నుంచి తీసుకున్న లోన్లపై విధించే వడ్డీ రేటునే రెపో రేట్ అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెపో రేటును RBI నిర్ణయిస్తుంది. రెపో రేటు తగ్గిస్తే బ్యాంకులు ప్రజలకు తక్కువ వడ్డీ రేట్లకే లోన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.

లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో ఎక్సైజ్ అధికారులు భారీ ఎత్తున అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మైసూరులోని చామరాజనగర్ నియోజకవర్గంలో రూ.98.52 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. పట్టుబడిన మద్యం 1.22 కోట్ల లీటర్ల బీర్ అని పేర్కొంది. దీంతో పాటు ఐటీ SST బృందం రూ.3.53 కోట్లు స్వాధీనం చేసుకుంది.
Sorry, no posts matched your criteria.