news

News March 26, 2024

BIG BREAKING: ఎమ్మెల్సీ కవితకు జుడీషియల్ కస్టడీ

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో BRS MLC కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను పోలీసులు తిహార్ జైలుకు తరలించనున్నారు. 10 రోజుల ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1న విచారణ చేస్తామని న్యాయమూర్తి తెలిపారు.

News March 26, 2024

మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమం: పురందీశ్వరి

image

AP: అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి చెప్పారు. మూడు పార్టీల కలయిక చారిత్రక అవసరమని, ఇదొక త్రివేణి సంగమమని అభివర్ణించారు. వైసీపీ నేతలు అన్ని రంగాల్లో అవినీతి చేశారని ఆరోపించారు. ‘నా ఎస్సీ, ఎస్టీ, బీసీలని చెప్పే సీఎం జగన్.. ఆయా వర్గాల నిధులను దారి మళ్లించారు’ అని మండిపడ్డారు.

News March 26, 2024

ఉప్పల్‌లో మ్యాచ్.. ఫ్యాన్స్‌కు సజ్జనార్ విజ్ఞప్తి

image

TG: రేపు ఉప్పల్‌లో SRH-ముంబై మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో RTC ఎండీ సజ్జనార్ క్రికెట్ అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకుల కోసం నగరంలోని పలు ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ బస్సులు ప్రారంభమవుతాయన్నారు. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు. ఫ్యాన్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News March 26, 2024

వాలంటీర్లపై బొజ్జల వ్యాఖ్యలు వ్యక్తిగతం: అచ్చెన్నాయుడు

image

AP: వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతూ శ్రీకాళహస్తి TDP అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి చేసిన <<12923028>>వ్యాఖ్యలు<<>> ఆయన వ్యక్తిగతమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ‘మేం అధికారంలోకి రాగానే వాలంటీర్లను కొనసాగించడంతోపాటు మెరుగైన సదుపాయాలు, జీతభత్యాలను కల్పిస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అయితే వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారిని మేం సమర్థించం’ అని చెప్పారు.

News March 26, 2024

ఇండిపెండెంట్‌గా మాజీ సీఎం.. బీజేపీ మద్దతు

image

తమిళనాడు మాజీ CM, అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం ఉనికి కోసం పోరాడుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రామనాథపురం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. BJP సైతం వ్యూహాత్మకంగా ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టకుండా పన్నీర్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో ఈ స్థానం తమిళనాట హాట్‌టాపిక్‌గా మారింది. BJP మద్దతుతో పాటు, అన్నాడీఎంకేలోని చీలిక వర్గం మద్దతుతో సులువుగా గెలుస్తానని పన్నీర్ ధీమాగా ఉన్నారు.

News March 26, 2024

అదానీ గ్రూప్ చేతుల్లోకి మరో పోర్ట్!

image

దేశంలోని తూర్పు, పశ్చిమ తీరాల్లో ఇప్పటికే పలు పోర్టులను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ తాజాగా మరో పోర్టును దక్కించుకోనుంది. రూ.3,080 కోట్లతో ఒడిశాలోని గోపాల్‌పుర్ పోర్టు (GPL) కొనుగోలుకు సిద్ధమైంది. GPLలో ఎస్‌పీ గ్రూప్‌కు ఉన్న 56%, ఒడిశా స్టీవ్‌డోర్స్ లిమిటెడ్‌కు చెందిన 39% వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. కాగా ప్రస్తుతం పశ్చిమ తీరంలో 7, తూర్పు తీరంలో ఏడు పోర్టులు అదానీ పరిధిలో ఉన్నాయి.

News March 26, 2024

ఫోన్ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు: ఎర్రబెల్లి

image

TG: ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదని, ప్రణీత్ రావు ఎవరో తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ విషయాన్ని ప్రణీత్ రావు కూడా చెప్పారని పేర్కొన్నారు. ఏం జరిగిందో విచారణలో తేలుతుందని చెప్పారు. ఇతర పార్టీలో చేరాలని ఆఫర్లు వస్తున్నా.. తనకు ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

News March 26, 2024

ఒక కేజీ కజ్జికాయల ధర రూ.56 వేలు!

image

హోలీ పండుగ సందర్భంగా UPలోని ఓ స్వీట్ షాపులో తయారు చేసిన కజ్జికాయలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. లక్నోలోని ఓ వ్యాపారి 24 క్యారెట్ల బంగారు పూతతో వీటిని తయారు చేశారు. వీటిలో 6 దేశాలకు చెందిన డ్రై ఫ్రూట్స్‌ని వినియోగించారట. ఒక KGని రూ.56 వేలకు విక్రయించారు. కాగా శ్రీకృష్ణుడికి ఇష్టమైన వంటకంగా చెప్పుకునే దీనిని చాలా రాష్ట్రాల్లో హోలీ రోజున తప్పక తింటారు. ఉత్తర భారతంలో దీన్ని గుఝియా అని పిలుస్తారు

News March 26, 2024

BREAKING: కుమారుడికి ఎగ్జామ్స్.. బెయిల్ కోరిన కవిత

image

MLC కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు చెప్పారు. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని ఈడీ కోరింది. ఇరువైపులా వాదనలు విన్న రౌస్ అవెన్యూ న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

News March 26, 2024

హైకోర్టు నిర్మాణానికి రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన?

image

TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి రేపు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ భూమి చదును కార్యక్రమాలను అధికారులు వేగవంతం చేశారు. కాగా హార్టికల్చర్ వర్సిటీకి చెందిన 100 ఎకరాలను హైకోర్టుకు కేటాయించడంపై విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే.