India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. 40.1 శాతం దేశ సంపద, 22.6 శాతం ఆదాయం ఒక శాతం మంది వద్దే ఉందని వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. 2000 సంవత్సరం నుంచే అసమానతలు పెరుగుతున్నప్పటికీ.. 2014-15 నుంచి 2022-23 మధ్య అధికమైనట్లు పేర్కొంది. అత్యంత సంపద కలిగిన కుటుంబాలకు 2 శాతం సూపర్ ట్యాక్స్ విధిస్తే.. దేశానికి 0.5 శాతం అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేసింది.

పరీక్షల సమయం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. అటు కోడ్ కారణంగా శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భక్తులకు టీటీడీ అరుదైన అవకాశాన్ని కల్పించింది. కంపార్ట్మెంట్లలో ఉంచకుండా నేరుగా దర్శనానికి పంపిస్తోంది. ఇక నిన్న స్వామివారిని 69072 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 26,239 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి రూ.3.51 కోట్ల ఆదాయం లభించింది.

AP: రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2023-24లో ఐదో క్లాస్ చదివినవారు అర్హులు. వచ్చే నెల 21న పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి సీబీఎస్ఈ, ఇంగ్లిష్ మీడియంలో ఉచితంగా బోధన ఉంటుంది. జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
పూర్తి వివరాలకు: <

లిక్కర్ స్కామ్ కేసులో తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో ఈ పిటిషన్పై విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేయగా, ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని, రక్షణ కల్పిస్తే కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు.

సద్గురు జగ్గీ వాసుదేవ్ని ICU బెడ్పై చూసి ఆందోళన చెందినట్లు నటి కంగన రనౌత్ పేర్కొన్నారు. ‘ICU బెడ్పై పడుకున్న సద్గురుని చూసి.. ఆయన కూడా మనలాగే ఎముకలు, రక్తమాంసాలున్న మనిషేనని అనుకున్నా. ఇది వరకూ ఆయన ఓ దేవుడిలా కనిపించేవారు. ఆ దేవుడే కుప్పకూలిపోయినట్లు భావించా. ఈ వాస్తవాన్ని నేను అర్థం చేసుకోలేను. ఎంతోమందిలా నేను కూడా నా బాధను మీతో పంచుకోవాలనుకున్నా. ఆయన బాగుండాలి’ అని ట్వీట్లో పేర్కొన్నారు.

✒ ఫస్ట్ సీజన్- 2008
✒ మొదటి మ్యాచ్- RCBvsKKR(ఏప్రిల్ 18)
✒ ఫస్ట్ విజయం- KKR
✒ మొదటి బాల్ వేసింది- ప్రవీణ్ కుమార్
✒ ఫస్ట్ బాల్ ఎదుర్కొన్నది- గంగూలీ
✒ మొదటి రన్, ఫోర్, సిక్స్ కొట్టింది.. ఫిఫ్టీ, సెంచరీ చేసింది- బ్రెండన్ మెక్కల్లమ్
✒ ఫస్ట్ వికెట్ తీసింది- జహీర్ ఖాన్
✒ మొదటి క్యాచ్ పట్టింది- జాక్వెస్ కల్లిస్
✒ ఫస్ట్ స్టంపింగ్- మార్క్ బౌచర్

AP: రాష్ట్రంలో 6100 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే DSC పరీక్షల నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించిన తర్వాతే పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. అనుమతి వచ్చే వరకు టెట్ పరీక్షల ఫలితాలను ప్రకటించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించామన్నారు. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30 నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

సద్గురుకు జరిగిన ఆపరేషన్పై వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ‘తలనొప్పిగా ఉందని సద్గురు ఈనెల 15న ఆస్పత్రిని సంప్రదించారు. MRIలో పుర్రె (ఎముక), మెదడు మధ్య రక్తస్రావమవుతోందని తెలిసింది. 17వ తేదీన తలనొప్పి తీవ్రమై వాంతులు చేసుకున్నారు. దీంతో వెంటనే అత్యవసర ICU బృందం ఆయనకు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసింది. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఎప్పటిలా ఆయన జోక్స్ వేస్తూ నవ్వులు పూయిస్తున్నారు’ అని తెలిపారు.

మథురలోని షాహీ ఈద్గా మసీదులో కృష్ణకూప్ వద్ద ప్రార్థనలు చేసేందుకు హిందువులు అలహాబాద్ హైకోర్టును అనుమతి కోరిన సంగతి తెలిసిందే. దీనిపై ముస్లిం వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో మరో విజ్ఞప్తిని తీసుకోరాదని వాదించింది. తదుపరి విచారణను కోర్టు వచ్చే 1వ తేదీకి వాయిదా వేసింది. కాత్రా కేశవ్ దేవ్ ఆలయంపై మసీదును కట్టారనేది హిందువుల వాదన.

2026కల్లా రష్యా నుంచి భారత్కు రావాల్సిన మిగిలిన రెండు ఎస్-400 స్క్వాడ్రన్ల డెలివరీ పూర్తికానుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 5 స్క్వాడ్రన్లను ఈ ఏడాదికల్లా న్యూఢిల్లీకి క్రెమ్లిన్ ఇవ్వాల్సి ఉండగా.. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం కారణంగా అవి ఆలస్యమయ్యాయని వివరించాయి. భారత్ వద్ద ప్రస్తుతం 3 ఎస్-400 స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఈ గగనతల రక్షణ వ్యవస్థల్ని చైనా, పాక్ సరిహద్దుల్లో భారత్ మోహరించింది.
Sorry, no posts matched your criteria.