news

News March 25, 2024

నేడు బీజేపీలోకి గాలి జనార్దనరెడ్డి రీఎంట్రీ

image

మైనింగ్ వ్యాపారి, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి తిరిగి BJP గూటికి చేరనున్నారు. ఇవాళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. తన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని BJPలో విలీనం చేయనున్నారు. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయన.. మైనింగ్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. తర్వాత సొంతంగా పార్టీని ఏర్పాటుచేసి 2023 ఎన్నికల్లో MLAగా గెలిచారు.

News March 25, 2024

హార్దిక్ పాండ్యపై ఇంత ద్వేషం ఎందుకు?

image

ప్రస్తుతం హార్దిక్ పాండ్యపై ఉన్న ద్వేషం ఏ క్రికెటర్‌పై ఉండి ఉండదు. రోహిత్ శర్మను కాదని ముంబై ఫ్రాంచైజీ పాండ్యకు కెప్టెన్సీ ఇవ్వడంతో వ్యతిరేకత పెరిగింది. పాండ్య సీనియర్లకు గౌరవం ఇవ్వరని, ఓవర్ కాన్ఫిడెన్స్ ప్లేయర్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. గాయాల బెడదతో అంతర్జాతీయ మ్యాచులకు దూరమైనా.. ఐపీఎల్ సమయానికి ఫిట్ అవుతారని చెబుతున్నారు. అయితే హార్దిక్ మ్యాచ్ విన్నర్ అని మరికొందరు గుర్తుచేస్తున్నారు.

News March 25, 2024

హోలీ రోజు తెలుపు దుస్తులు ఎందుకు ధరిస్తారు?

image

హోలీ రోజు రాహువు చాలా కోపంగా ఉంటారట. దీని వల్ల పండుగ రోజు ఇంట్లో వాళ్లతో, బయటి వ్యక్తులతో గొడవలు జరగడం, తెలియకుండానే నోరు జారడం వంటివి జరిగే అవకాశం ఉంటుందట. అందుకే రాహువు కోపం నుంచి తప్పించుకోవడానికి తెలుపు దుస్తులు ధరిస్తారని సనాతన ధర్మం చెబుతోంది. సైన్స్ ప్రకారం పండుగ నాటికి ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి, ఎండ నుంచి రక్షణ కోసం తెలుపు దుస్తుల్ని ధరిస్తారని నిపుణులు చెబుతున్నారు.

News March 25, 2024

విజయనగరం ఎంపీ సీటు TDPకే..

image

AP: విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీయే బరిలోకి దిగనుంది. తొలుత పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు. అయితే తాజాగా కమలం పార్టీ విజయనగరానికి బదులు రాజంపేట ఎంపీ స్థానాన్ని తీసుకుంది. అక్కడి నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఇక విజయనగరం నుంచి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు బరిలోకి దిగే అవకాశముంది.

News March 25, 2024

HOLI: ఇంట్లోనే కలర్స్ చేసుకోండి

image

మార్కెట్లో దొరికే రంగుల్లో రసాయనాలు కలపడంతో చర్మానికి, కళ్లకు హాని కల్గుతుంది. అయితే ఇంట్లోనే కొన్ని వస్తువులతో మీరే కలర్స్ తయారుచేసుకోవచ్చు.
*ఎరుపు: పసుపులో నిమ్మరసం కలపి, ఆరబెట్టండి. లేదా దానిమ్మ తొక్కలను నీటిలో ఉడకబెట్టినా చాలు.
*పింక్: పసుపులో నిమ్మరసం తక్కువ మోతాదులో కలిపితే చాలు.
*ఆకుపచ్చ: గోరింట పిండిని బియ్యప్పిండి లేదా మైదాతో కలపండి.
*బ్రౌన్: కాఫీ పౌడర్ నీటిలో వేసి మరిగించండి.

News March 25, 2024

నేడు భద్రాచలం రామయ్య కల్యాణం టికెట్లు విడుదల

image

TG: ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున జరిగే భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి కల్యాణోత్సవం టికెట్లు నేడు విడుదల కానున్నాయి. ఉభయ దాతల టికెట్ ధర ₹7,500గా ఉంది. దీనిపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. ₹2500, ₹2000, ₹1000, ₹300, ₹150 టికెట్లపై ఒక్కరు వెళ్లవచ్చు. ఈ టికెట్లతో పాటు 18న జరిగే పట్టాభిషేకం, ఇతర పూజా టికెట్లను టెంపుల్ <>వెబ్‌సైట్‌<<>>లో పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.

News March 25, 2024

రఘురామకు బీజేపీ షాక్.. టీడీపీలో చేరతారా?

image

AP: YCP రెబల్ MP రఘురామకృష్ణరాజుకు BJP షాక్ ఇచ్చింది. నరసాపురం టికెట్ కూటమిలోని ఏ పార్టీకి దక్కినా.. తానే పోటీ చేస్తానంటూ పలుమార్లు చెప్పుకున్న ఆయనకు <<12919849>>నిరాశ<<>> ఎదురైంది. ఆ స్థానాన్ని శ్రీనివాసవర్మకు BJP కేటాయించింది. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరి కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తారా? లేక ఇండిపెండెంట్‌గా పోటీలో ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది. విజయనగరం ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది.

News March 25, 2024

హోలీ.. నేడు ఈ సమయం వరకే

image

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. నిన్న రాత్రి హోలికా దహనం (కాముడి దహనం) నిర్వహించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శుక్లపక్షం పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. పౌర్ణమి తిథి నిన్న ఉ.9 గంటలకు ప్రారంభమై.. నేడు మ.12.29 వరకు ఉండనుంది. ఈ సమయంలో హోలీ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. చీకటి పడ్డాక హోలీ చేసుకుంటే దరిద్రం చుట్టుకునే అవకాశం ఉందని చెబుతుంటారు.

News March 25, 2024

IPL 2024: నేడు ఆర్సీబీతో పంజాబ్ ఢీ

image

IPL-2024లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరు వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 31 మ్యాచుల్లో తలపడగా PBKS 17, RCB 14 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈ సీజన్‌ను పంజాబ్ విజయంతో ఆరంభించగా, ఆర్సీబీ ఓటమితో మొదలుపెట్టింది. మరి ఇవాళ్టి మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.

News March 25, 2024

IPL: ముంబై ఓటమి.. రోహిత్ ఫ్యాన్స్ సంబరాలు

image

నిన్న GTపై ముంబై ఓడిపోవడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 5 టైటిల్స్ అందించిన సారథిని పక్కనబెట్టినందుకు ముంబైకి ఇలాగే జరగాలని పోస్టులు చేస్తున్నారు. ‘రోహిత్ శర్మ రన్స్ చేయాలి, ముంబై ఓడిపోవాలి’ అనేదే తమ నినాదం అని చెబుతున్నారు. నిన్నటి మ్యాచులో రోహిత్ 43 రన్స్ చేశారు. మరి రోహిత్ శర్మ ఫ్యాన్స్ అభిప్రాయంపై మీ కామెంట్?