India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 14న జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైనా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారంగా స్టైపెండ్ను శిక్షణ కాలంలో నేరుగా అభ్యర్థుల ఖాతాలకు జమ చేస్తాయన్నారు.
ఆదిలాబాద్లో భారీ ఎత్తున జరిగిన హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం జరిగిన శోభాయాత్రలో బందోబస్తు ప్రక్రియను డ్రోన్ ద్వారా, మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనంలో సీసీ కెమెరాల ద్వారా ఎస్పీ పరిశీలించారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా 300 పోలీసు సిబ్బందితో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
హనుమాన్ శోభాయాత్రకు ADBలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 300మంది సిబ్బందితో బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వీడియో కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో, ప్రత్యేక సీసీ టీవీలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు. ర్యాలీ పూర్తయ్యేంతవరకు హనుమాన్ విగ్రహానికి ఇరువైపులా పోలీసు సిబ్బంది ఉంటారన్నారు. అదేవిధంగా ర్యాలీ జరుగు ప్రదేశాల్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని సూచించారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5, 6వ సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ కట్ల రాజేందర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన టైం టేబుల్ను విడుదల చేశారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని విద్యార్థులకు సూచించారు.
నేరడిగొండ మండలంలో నెల క్రితం పీహెచ్సీ వైద్యుల ఆధ్వర్యంలో టీబీ పరీక్షలు నిర్వహించారు. వారిలో మొత్తం 52 మందికి టీబీ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు శుక్రవారం హెచ్ఈఓ పవార్ రవీందర్ వెల్లడించారు. శుక్రవారం 25 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. టీబీ బాధితులకు 6 నెలల వైద్యంతో పాటు నెలకు రూ.1000, పోషణ న్యూట్రిషన్ కిట్ ఇవ్వనున్నామన్నారు. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్, సంతోష్, తదితరులున్నారు.
భద్రాచలం శ్రీ రాములవారి తలంబ్రాల పంపిణీని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం ప్రణీత్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్లోని ఆర్ఎం కార్యాలయంలో పలువురికి తలంబ్రాలను పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,350 మంది బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. తలంబ్రాల బుకింగ్లో రాష్ట్రంలో ఆదిలాబాద్ రీజియన్ మూడో స్థానంలో నిలిచిందన్నారు. సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
నేరడిగొండ మండలంలో గత నెల క్రితం పీహెచ్సీ వైద్యుల ఆధ్వర్యంలో టీబీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా మొత్తం 52 మందికి టీబీ పాజిటివ్ నిర్దారణ అయినట్లు శుక్రవారం హెచ్ఈఓ పవార్ రవీందర్ సూచించారు. నేడు 25 మందికి పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. టీబీ బాధ్యులుగా ఉన్నవారికి 6 నెలల వైద్యంతో పాటు నెలకు రూ.1000, పోశన్న న్యూట్రిషన్ కిట్ ఇవ్వనున్నామన్నారు. కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్, సంతోష్ తదితరులున్నారు.
జైనథ్ మండలం సాంగ్విలో పెనుగంగ నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం మేరకు గురువారం అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 టిప్పర్లు, ఒక జేసీబీ సీజ్ చేసి చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మొత్తం 12 మందిపై సెక్షన్ 3, పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పీఏ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం ఉన్నారు.
భద్రాచలం శ్రీ రాములవారి తలంబ్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం ప్రణీత్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్లోని ఆర్ఎం కార్యాలయంలో పలువురికి తలంబ్రాలను పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4350 మంది బుక్ చేసుకున్నట్లు తెలిపారు. తలంబ్రాల బుకింగ్లో రాష్ట్రంలో ఆదిలాబాద్ రీజియన్ మూడో స్థానంలో నిలిచిందన్నారు. సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి స్టాఫ్నర్స్ డబ్బులు కాజేసిన ఘటన ADB లో జరిగింది. వన్ టౌన్ CI సునీల్ కథనం ప్రకారం.. రిమ్స్ స్టాఫ్నర్సు సోని ANM శిక్షణ పూర్తి చేసిన మహేశ్వరీకి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.40లక్షలు డిమాండ్ చేసింది. దీంతో ఆమె నమ్మి ఆమె చెప్పిన గజ్జె రాజేందర్ ఖాతాలో డబ్బులను వేసింది. రేపు మాపు అంటూ మాటలు దాటి వేయడంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు వారిద్దరిపై కేసు చేశారు.
Sorry, no posts matched your criteria.