Adilabad

News April 8, 2025

ADB: కత్తిని చూపిస్తూ బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు

image

ఆదిలాబాద్ చించర్‌వాడకు చెందిన తోట విగ్నేష్ రామనవమి శోభాయాత్రలో కత్తిని చూపిస్తూ చంపేస్తానంటూ బెదిరించినందున కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. భారీ ర్యాలీలో నిందితుడు కత్తితో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. కత్తులను చూపిస్తూ బెదిరించి చంపేస్తామంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఎలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 8, 2025

ADB: ఎమ్మెల్యేను కలిసిన జనార్దన్ రాథోడ్

image

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిని సోమవారం ఆదిలాబాద్ మాజీ జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలతో కలిసి చర్చించారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే మహాసభను విజయవంతం చేయాలనీ ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో నార్నూర్ PACS ఛైర్మన్ సురేష్ ఆడే, మాజీ సర్పంచి రామేశ్వర్ తదితరులున్నారు.

News April 7, 2025

ఆదిలాబాద్: ‘సమగ్ర సర్వే నిధులు విడుదల చేయాలి’

image

సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఎనిమిరేటర్ సూపర్వైజర్ కంప్యూటర్ ఆపరేటర్లకు తక్షణమే నిధులు వారి అకౌంట్లో జమా చేయాలని టీజీటీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ జాధవ్ కోరారు. ఈ విషయమై సోమవారం సీపీఓ ను కలిసి నిధులు విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు. సర్వే చేసి నేటికీ ఆరు నెలలు గడుస్తున్న ప్రభుత్వం నేటికీ నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. ఈ నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

News April 7, 2025

ఆదిలాబాద్ పాలిటెక్నిక్‌లో 12న పూర్వ సమ్మేళనం

image

ఈనెల 12న ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల చరిత్రలలో మొదటిసారిగా 1980 నుంచి అన్ని బ్యాచులకు పూర్వ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కళాశాలలో సమ్మేళనానికి సంబంధించి సమావేశాన్ని ప్రిన్సిపాల్ రాంబాబు అధ్యక్షతన నిర్వహించగా అందుబాటులో ఉన్న అల్యూమ్ని మెంబర్స్ పాల్గొన్నారు. కార్యక్రమం జరిపించడానికి కార్యాచరణ జరిపి అడహాక్ కమిటీని ఎన్నుకోగా సమ్మేళనం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News April 7, 2025

బెట్టింగ్.. నలుగురి అరెస్ట్: ADB SP

image

ADBలో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న రియాజ్, పిట్టలవాడకు గంథాడే సోహన్ IPL బెట్టింగ్ నిర్వహిస్తుండగా వారిని పట్టుకొని కేసు నమోదు చేశారు. వన్ టౌన్ పరిధిలో సుల్తాన్, ఒక మైనర్ సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్ పాల్పడగా వారిపై కేసు నమోదు చేశారు. నగదు స్వాధీనం చేసుకున్నారు.

News April 7, 2025

ADB: మహిళల బంగారు పుస్తెల తాళ్లు చోరీ: CI

image

పండుగ సందర్భంగా గుడికి వెళ్లిన మహిళల మెడల్లో నుంచి పుస్తెల తాళ్లు చోరీ అయిన ఘటన ADBలో చోటుచేసుకుంది. వన్ టౌన్ సీఐ సునీల్ వివరాల మేరకు.. తిర్పల్లికు చెందిన ఠాకూర్ పద్మజ, మావలకు చెందిన సుమ బ్రాహ్మణ సమాజ్ రామమందిర్‌లో పూజకు వెళ్లారు. క్యూలైన్లో నిలబడి భోజనాలు చేశారు. అనంతరం చూసుకుంటే పద్మజ, సుమ మెడలోని బంగారు పుస్తెల తాళ్లు కనబడలేదు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News April 7, 2025

ADB: వారంలో 8 సైబర్ మోసాలు: SP

image

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ ఫ్రాడ్, మొబైల్ హ్యాకింగ్ లాంటి సైబర్ నేరాలకు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గత వారంలో జిల్లాలో 8 సైబర్ ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ఎటువంటి గుర్తు తెలియని స్కాం నంబర్లు, లింక్లు ఓపెన్ చేయొద్దన్నారు. సైబర్ క్రైమ్‌కు గురైతే 1930కు కాల్ చేయాలని పేర్కొన్నారు.

News April 7, 2025

బెట్టింగ్.. నలుగురి అరెస్ట్ : SP

image

ADBలో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న రియాజ్, పిట్టలవాడకు గంథాడే సోహన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా వారిని పట్టుకొని కేసు నమోదు చేశారు. వన్ టౌన్ పరిధిలో సుల్తాన్, ఒక మైనర్ సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్ పాల్పడగా వారిపై కేసు నమోదు చేశారు. నగదు స్వాధీనం చేసుకున్నారు.

News April 7, 2025

ADB: ‘గంజాయి విక్రేత ARREST.. నలుగురికి నోటీసులు’

image

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించినట్లు ADB వన్ టౌన్ CI సునిల్ కుమార్ తెలిపారు. ఖానాపూర్ చెరువు కట్ట వద్ద షేక్ కలీం గంజాయి విక్రయించగా అతని వద్ద కొనుగోలు చేసి తాగుతున్న అనంద్, అజహర్, ఫారూఖ్, రోషన్‌లను SI అశోక్ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రేత కలీంను రిమాండ్ తరలించి మిగిలిన నలుగురికి నోటీసులు ఇచ్చారు.

News April 7, 2025

ADB: ఎప్పటికప్పుడు ఎస్పీ శాంతి భద్రతల పర్యవేక్షణ

image

ఆదిలాబాద్ శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న భారీ శోభాయాత్రలో శాంతిభద్రతలను ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా పరిశీలించారు. శోభాయాత్ర ముందర మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎస్పీ సీసీ కెమెరాల ద్వారా నిఘాను పర్యవేక్షించారు. శాంతి భద్రతలపై ఎప్పటికప్పుడు పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు.

error: Content is protected !!