India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2025-26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయలో ఆరో తరగతి అడ్మిషన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదిలాబాద్ DEO ప్రణీత పేర్కొన్నారు. ఎంపిక పరీక్ష ద్వారా ప్రవేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 16 లోపు www.navodaya.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 2025 జనవరి 18న పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కావున జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT
జైనూర్లో జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని కోరారు. జైనూరు ఘటనలో పోలీసు యంత్రాంగం కేసులను నమోదు చేసిందని, దర్యాప్తు కొనసాగుతుందని, కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు. వదంతులను ప్రచారం చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన రక్షిత కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను అభినందించారు.
పేపర్ బాయ్ టు MLA వరకు ఎదిగిన ఖానాపూర్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు జీవిత ప్రస్థానం అందరికీ ఆదర్శనీయం. నేడు పేపర్ బాయ్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఆయన చిన్నతనంలో చదువుతోపాటు పేపర్ బాయ్గా, కాలేజీ రోజుల్లో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మరోవైపు విలేకరిగా పనిచేశారు. అనంతరం ITDA పైసా చట్టం ఛైర్మన్గా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి MLAగా గెలుపొందారు.
కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. SI సురేశ్ వివరాలు.. పాల్వంచకు చెందిన రాధ(28), చెన్నూర్కి చెందిన రాముతో 9ఏళ్ల క్రితం వివాహమైంది. కొద్దిరోజుల నుంచే భార్యను రాము వేధించడంతో తమ్ముడు ప్రసాద్ ఇంటికి వెళ్లింది. ఈ నెల 1న ఆమెను తీసుకెళ్లడానికి వచ్చిన రాము ఆమెతో గొడవపడి ముఖంపై దిండుతో అదిమి చంపేశాడు. ‘మీ అక్కకు వేరే వ్యక్తితో సంబంధం ఉంది. అందుకే చంపేశా’ అని రాము ఆమె తమ్ముడికి చెప్పి పారిపోయాడు.
DOST ద్వారా DEGREE కళాశాలలో స్పెషల్ ఫేజ్ ద్వారా ప్రవేశాలు పొందేందుకు మరొక సువర్ణ అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సంగీత పేర్కొన్నారు. SEP 9లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని SEP 4 నుంచి 9 వరకు వెబ్ అప్షన్లు పెట్టుకోవాలన్నారు. SEP 11న సీట్ల కేటాయింపు ఉంటుందని SEP 11 నుంచి 13 వరకు ఆన్ లైన్ పేమెంట్ పూర్తి చేయాలని, SEP 12 నుంచి 13లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలని వెల్లడించారు.
సిర్పూర్ (టి)మండలంలోని వెంకట్రావు పేట్ గ్రామానికి చెందిన గంగోత్రి (16) డెంగ్యూతో మృతి చెందింది. సోమవారం బాలికను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. డెంగ్యూ జ్వరాలపై వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చిన్న విషయాలకు సైతం మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. 2023, 2024 సంవత్సరాల్లో 1,789 మంది ఆత్మహ్యత చేసుకున్నారు. ఆదిలాబాద్-453, నిర్మల్-452, మంచిర్యాల-611, కొమురం భీం-273 మంది సూసైడ్ చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు నేడు (ఈనెల 3)న సెలవును ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. అన్ని విద్యాసంస్థలు సెలవు పాటించాలని సూచించారు. భారీ వర్షాలతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.