Adilabad

News October 5, 2025

ఆదిలాబాద్: సోమవారం ప్రజావాణి రద్దు

image

గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రానున్న రెండో ఆర్డినరీ గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉందన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాటి ప్రజావాణి రద్దు చేశామని ప్రజలు ఎవరు కలెక్టరేట్‌కు రాకుడదని సూచించారు.

News October 4, 2025

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ సన్నాహక సమావేశం

image

ఎన్నికల్లో అన్ని స్థానాల‌ను కాంగ్రెస్ పార్టీ కైవ‌సం చేసుకుంటుద‌ని అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీ‌నివాస రెడ్డి ధీమా వ్య‌క్తం చేసారు. శ‌నివారం ఆయన క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో విడివిడిగా స‌మావేశ‌మ‌య్యారు. బేల, భోర‌జ్, జైన‌థ్ మండ‌ల నాయ‌కులతో భేటీ అయ్యి ప‌లు అంశాల‌పై చర్చించారు. పోటీకి సిద్ధంగా ఉండే ఆశావ‌హులు, వారి బ‌లాబ‌లాల‌పై సమీక్షించారు.

News October 4, 2025

వారంలో 15 సైబర్ క్రైమ్ కేసులు: ADB SP

image

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి సంప్రదించాలన్నారు. గతవారంలో 15 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. ప్రతివారం జిల్లా సైబర్ క్రైమ్ బృందం వారు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వివరించారు.

News October 4, 2025

ADB: కాంగ్రెస్ కసరత్తు షురూ..!

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సరికొత్త ఎత్తుగడతో ముందుకువెళ్తోంది. జడ్పీ ఛైర్మన్ పదవులు కైవసం చేసుకునేలా పావులు కదుపుతోంది. ఒక్కో జడ్పీటీసీ స్థానానికి నలుగురు చొప్పున ఎంపిక చేయాలని డీసీసీలకు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు ప్రక్రియను పరిశీలిస్తున్నారు. బేల, భీంపూర్ మండలాల్లో ఇప్పటికే పలువురి దరఖాస్తులు తీసుకున్నారు. 6వ తేదీలోపు ప్రక్రియ పూర్తిచేస్తారని సమాచారం.

News October 4, 2025

ADB: ఆకతాయిల భరతం పట్టిన షీ టీమ్స్

image

దుర్గా నవరాత్రుల సందర్భంగా షీ టీమ్స్ కృషిని SP అఖిల్ మహాజన్ అభినందించారు. 119 హాట్‌స్పాట్‌ల్లో తనిఖీలు, 24 పెట్టీ కేసులు, 31 అత్యవసర కాల్స్‌కు స్పందించామని తెలిపారు. 20 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దస్నాపూర్‌లో వేధింపులకు పాల్పడిన 9 మంది యువకులపై మావల PSలో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మహిళలు ధైర్యంగా షీ టీంను ఆశ్రయించాలన్నారు.

News October 3, 2025

కరాటే గిన్నిస్ రికార్డ్ పోటీలో పాల్గొననున్న జిల్లా మాస్టర్స్

image

ది వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 5న చెన్నైలోని సెల్వన్ కాలేజీ మైదానంలో కరాటే గిన్నిస్ రికార్డ్ ఈవెంట్ జరగనుంది. ప్రపంచ కరాటే మాస్టర్‌లు పాల్గొనే ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన మాస్టర్ మిట్టు దత్తు గెస్ట్‌గా, మాస్టర్ గాజుల జగన్నాథ ఋషి పార్టిసిపెంట్‌గా హాజరుకానున్నారు. ఆత్మరక్షణ ప్రదర్శనలో ప్రతిభ చూపిన వారికి మూడు వారాల్లో గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకొనున్నారు.

News October 3, 2025

ADB: గాంధీ పార్కులో ‘వేస్ట్ టు వండర్’ ప్రారంభం

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో గురువారం నాడు ‘వేస్ట్ టు వండర్’ పార్కును జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ట్రైనీ కలెక్టర్ సలోని, మున్సిపల్ కమిషనర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినియోగంలో లేని వస్తువులతో ఆకర్షణీయమైన ఉపకరణాలు తయారు చేయడం అభినందనీయమని కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పార్క్ సిబ్బంది పాల్గొన్నారు.

News October 2, 2025

ఆయుధపూజలో ఆదిలాబాద్ SP

image

విజయదశమి వేడుకలను జిల్లావ్యాప్తంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. ఉదయం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని ఆయుధ భాండాగార మందిరంలో ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. వేద పండితుల శాస్త్రోక్తాల మధ్య దుర్గామాత సన్నిధిలో సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

News October 2, 2025

ADB: బార్డర్లపై ఫోకస్ పెడితే బెటర్ బాస్

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారులంతా మహారాష్ట్ర బార్డర్లపై దృష్టిసారించాల్సిన అవసరముంది. ఎందుకంటే అక్కడి నుంచే అక్రమ మద్యం ADBలోకి తీసుకొచ్చే ఆస్కారముంది. అక్కడ అక్కడ తక్కువ ధరకు దొరికే దేశీదారును అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంచే అవకాశముంది. తలమడుగు, తాంసి, బేల, భీంపూర్, భైంసా, కుబీర్, జైనథ్, చింతలమానేపల్లి ఇలా సరిహద్దుల్లోని మండలాల్లో చెక్పోస్టు తనిఖీలు పెంచాలి.

News October 2, 2025

ప్రింటింగ్ ప్రెస్, ఫ్లెక్సీ యజమానులతో కలెక్టర్ సమావేశం

image

జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీలకు సంబంధించిన రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఈ క్రమంలో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.​అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్తో కలిసి కలెక్టర్, ప్రింటింగ్ ప్రెస్, ఫ్లెక్సీ యజమానులతో మాట్లాడారు. సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి సహకారం అందించాలని కోరారు.