Adilabad

News August 18, 2025

రాష్ట్రస్థాయి విజేతలుగా HYD, NZB

image

జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అందులోనూ రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని బేస్ బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలు సోమవారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో HYD, రంగారెడ్డి జాయింట్ విన్నర్లుగా, NZB తృతీయ స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో HYD, NZB జాయింట్ విన్నర్లుగా నిలిచాయి.

News August 18, 2025

ADB: పోలీస్ గ్రీవెన్స్‌కు 20 ఫిర్యాదులు

image

ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజల రక్షణ, భద్రతకు 24 గంటలు బాధ్యతాయుతంగా పని చేసే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సమస్యను తెలుసుకున్నారు. మొత్తం 20 ఫిర్యాదులు రాగా.. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

News August 18, 2025

ఎడ్ల బండెక్కి.. రైతులను పరామర్శించిన పాయల్ శంకర్

image

ఎడ్ల బండెక్కి పంట పొలాల్లో కలియ తిరుగుతూ రైతన్నల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంట నష్టం చెందిన వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే సోమవారం పర్యటించారు. భోరజ్ మండలలోని కేదర్పూర్, ఆకోలి, గిమ్మ, కోరాట, పూసాయి, పిప్పర్‌వాడ తదితర గ్రామాల్లో తహసీల్దార్ రాజేశ్వరీ అగ్రికల్చర్ అధికారులతో కలిసి పర్యటించి నీట మునిగిన పంటను పరిశీలించారు

News August 17, 2025

రేపు గణేష్ మండప నిర్వాహకులతో ఎస్పీ సమావేశం

image

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి మండప కమిటీ, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో ఈనెల 18న ఆదిలాబాద్ తనీషా గార్డెన్‌లో ఉదయం 10:30 గంటలకు ఎస్పీ అఖిల్ మహాజన్ సమావేశం నిర్వహిస్తున్న డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. నిర్వహకులకు మండపాల ఏర్పాటుపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, కమిటీ సభ్యులు చేయవలసిన విధి విధానాలపై ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వన్ టౌన్, టూటౌన్, మావల, రూరల్ మండపాల సభ్యులు కావాలన్నారు.

News August 17, 2025

ఆదిలాబాద్: దివ్యాంగులకు ముఖ్య సూచన

image

ADB డివిజన్ TTD కల్యాణ మండపంలో ఈనెల 19న, ఉట్నూర్ డివిజన్ వికాసం పాఠశాలలో 20న దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఉపకరణాలు అందజేయుడానికి గుర్తింపు, నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు DEO కుష్బూగుప్తా తెలిపారు. అవసరమైన దివ్యాంగులను గుర్తించి వారికి ఉచితంగా ఉపకరణాలను అందజేయడానికి సిఫారసు చేస్తారన్నారు. అన్ని ధ్రువీకరణ పత్రాలతో అర్హులైన దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు హాజరు కావాలని సూచించారు.

News August 17, 2025

ADB: రేపటి ప్రజావాణి రద్దు

image

ఈ నెల 18, 19 తేదీల్లో వాతావరణ సూచనల మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 18న సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి కలెక్టరేట్‌కు రావద్దని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు సైతం జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

News August 17, 2025

ADB: వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారా..?

image

వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపనకు ప్రతిఒక్కరూ https://policeportal.tspolice.gov.in/index.html వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేసుకోవాలని ADB ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకై మట్టి వినాయక ప్రతిష్ఠాపనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మండపాల వద్ద వాలంటీర్లు కమిటీ సభ్యులు 24 గంటలు ఉండేలా చూసుకోవాలన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలకు అధిక శబ్దం చేసే డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

News August 17, 2025

ADB: సహాయక చర్యల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు

image

ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తలెత్తే అత్యవసర పరిస్థితులకు వెంటనే సహాయం అందించేందుకు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌తో పాటు మున్సిపాలిటీ టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజలు తమ సమస్యలను కంట్రోల్ రూమ్ నంబర్: 18004251939, మున్సిపాలిటీ టోల్‌ఫ్రీ 9492164153కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు. సమాచారం అందిన వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.

News August 16, 2025

ADB: ప్రేమకు ప్రతిరూపం రాధాకృష్ణులు

image

కృష్ణుడి ప్రేమ, ఆధ్యాత్మికతకు ప్రతీక రాధ. రాధాకృష్ణుల ప్రేమ బంధాలకు అతీతమైనది. వారి అనుబంధం దైవిక ప్రేమ, నిస్వార్థ భక్తికి నిలువెత్తు నిదర్శనం. భీంపూర్(M)లో కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం గుబిడిలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకల్లో చిన్నారులు వేసిన శ్రీ కృష్ణుడు, గోపికల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేడుకలు తిలకించేందుకు గ్రామస్థులు ఒకచోట చేరారు.

News August 16, 2025

ADB: రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలు ప్రారంభం

image

క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు విజేతనే అని తెలంగాణ రాష్ట్ర బేస్ బాల్ సంఘం అధ్యక్షుడు హరిశంకర్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ బేస్ బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రం నుంచి దాదాపు 700 మంది క్రీడాకారులు పాల్గొనగా వారికి అవసరమైన పూర్తి సౌకర్యాలు కల్పించారు. జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.