Adilabad

News April 5, 2025

ఇన్‌కం సర్టిఫికెట్ అవసరం లేదు: ADB కలెక్టర్

image

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని నూతనంగా ప్రారంభించినట్లు కలెక్టర్ రాజర్షిషా ఆన్నారు. ADB కలెక్టరేట్‌లో PO ఖుష్బూ గుప్తాతో కలిసి పథకంపై సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ద దరఖాస్తు చేసేందుకు రేషన్‌ కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

News April 4, 2025

విద్యార్థులకు మెరుగైన విద్య అందించండి: ITDA PO

image

ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీఓ కుష్బూగుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం ఇంద్రవెల్లి బాలికల ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ పాఠశాలను పీఓ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలని సూచించారు.

News April 4, 2025

ADB: శభాష్.. AIతో చక్కగా చదువు చెబుతున్నారు: DEO

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి కంప్యూటర్ ద్వారా విద్యా బోధన చేస్తున్న ఆదిలాబాద్‌లోని రణదివ్యనగర్ ప్రభుత్వ పాఠశాలలను డీఈవో శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి హర్షం వ్యక్తం చేసి ఉపాధ్యాయులను అభినందించారు. అకడమిక్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ గౌడ్, సీసీ రాజేశ్వర్ తదితరులున్నారు.

News April 4, 2025

ఉట్నూర్: ‘TASK శిక్షణతో ఉపాధి సాధన సులువు’

image

యువతలో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగ సాధనకు మార్గాన్ని సులువు చేయడమే లక్ష్యంగా టాస్క్ ముందుకు సాగుతుందని ప్రిన్సిపాల్ టి.ప్రతాప్ సింగ్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో Campus to Corporate C2C అంశంపై రెండు రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ తరగతులకు కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

News April 4, 2025

ఆదిలాబాద్: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 4, 2025

ADB ఆదివాసీ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శిగా వరుణ్

image

ఆదివాసి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధానకార్యదర్శిగా వరుణ్ ను ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో ఆదివాసీ విద్యార్థి సంఘం సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం నూతన జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శిగా వరుణ్ మరోసారి ఎన్నుకున్నారు. ఆదివాసి విద్యార్థుల సమస్యలపై పోరాడుతానని, ఆదివాసుల విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

News April 4, 2025

ADB: ‘ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు నిర్వహించాలి’

image

ఓపెన్ స్కూల్ సోసైటి ద్వారా జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ కే.శ్యామలాదేవి అన్నారు. గురువారం వివిధ పరీక్ష నిర్వహణ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. పదో తరగతి పరీక్షలకు 623 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 465 మంది హాజరవుతారన్నారు. వీరికి ఏప్రిల్ 20వ తేది నుంచి ఏప్రిల్ 26 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.

News April 4, 2025

నార్నూర్: యాక్సిడెంట్.. యువకుడి దుర్మరణం

image

నార్నూర్ మండలం గంగాపూర్‌లో ఎంగేజ్మెంట్‌కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పుసిగూడ ఘాట్ వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో యువకుడు దుర్మరణం చెందారు. యువకుడిని ఆటోలో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. మృతుడు తొడసం జంగుగా గుర్తించారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి భార్య పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 4, 2025

CCI పునరుద్ధరణపై లోక్‌సభలో మాట్లాడుతా: NZB MP

image

ADBలో సీసీఐ ఫ్యాక్టరీ రీఓపెన్‌పై పార్లమెంట్‌లో మాట్లాడాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ను CCI సాధన కమిటీ సభ్యులు కోరారు. న్యూ ఢిల్లీ కొత్త పార్లమెంట్ భవన్‌లో ఎంపీ అర్వింద్‌ని గురువారం సభ్యులు కలిసి విన్నవించారు. వారి న్యాయమైన డిమాండ్ గురించి కచ్చితంగా పార్లమెంట్‌లో మాట్లాడుతానని ఎంపీ హామీ ఇచ్చారన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న సీసీఐ సాధన కమిటీ సభ్యులు ఉన్నారు.

News April 4, 2025

ఉట్నూర్: గురుకులాల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు

image

గిరిజన గురుకుల పాఠశాల పీవీటీజీ బాలుర ఆసిఫాబాద్లో 2025-26 విద్యా సంవత్సరానికి 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సీట్లు మిగిలాయి. వీటి భర్తీకి ఆదిమ గిరిజన తెగలకు చెందిన కొలాం, తోటి విద్యార్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్త, ఆర్సీఓ అగస్టీన్ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ASFలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఈనెల 9 నుంచి 30 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

error: Content is protected !!