India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆదిలాబాద్లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో గల పరేడ్ మైదానం ముస్తాబైంది. వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉ.9:30 గంటలకు జిల్లా ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ కలిసి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం, సంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్ సందర్శన ఉంటుందని అధికారులు తెలిపారు.
ADB పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల పూర్వ విద్యార్థిని తన ప్రతిభను కనబరుస్తూ వస్తుంది. గుడిహత్నూర్ గ్రామం కొల్హారి గ్రామానికి చెందిన ముండే రూమతాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పీజీ చదువుతూనే యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ చరిత్ర సబ్జెక్ట్లో అర్హత సాధించింది. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోకి అర్హత సాధించి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో PHDలో చేరింది.
ఆదిలాబాద్ జిల్లా ఉద్యాన వన, పట్టు పరిశ్రమ శాఖలో నూతనంగా ఉద్యాన వన విస్తరణ అధికారులు నియమితులయ్యారు. జైనథ్ మండలానికి గణేశ్, బోథ్ మండలానికి భూమయ్య, తాంసి మండలానికి శైలజ, గుడిహత్నూర్ మండలానికి సతీశ్ ఉద్యాన వన విస్తరణాధికారులుగా పట్టు పరిశ్రమ ఉన్నతాధికారి నర్సయ్య ఆధ్వర్యంలో గురువారం బాధ్యతలు చేపట్టారు.
జిల్లాలో స్టర్ 50 స్టడీ సర్కిల్ సెంటర్ను యథివిధిగా కొనసాగించాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి వరుణ్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. స్టర్ 50 స్టడీ సర్కిల్ సెంటర్ను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (COE)గా మార్చడంతో జిల్లాలోని ఆదివాసీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో భీంపూర్ మండలం అర్లి(టి)లో అత్యధికంగా 28.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా నేరడిగొండలో 4.8 వర్షపాతం రికార్డయింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టులు, జలపాతాల సందర్శనకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఆదిలాబాద్లో అత్యాచారానికి గురైన 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. శివాజీ చౌక్లో ఈనెల 7న అర్ధరాత్రి 80 ఏళ్ల వృద్ధురాలిపై ఓ కామాంధుడు అతిక్రూరంగా అత్యాచారం చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను రిమ్స్లో చేర్పించగా, చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బీసీ, గాండ్ల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (బోథ్)ను NCC కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ వీపీ సింగ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల NCC యూనిట్ రికార్డ్స్ను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఐక్యతకు క్రమశిక్షణతో NCC సైనిక శిక్షణ పొందాలని, సామాజిక బాధ్యతను పెంచుకోవాలన్నారు. ప్రిన్సిపల్ శివ కృష్ణ, NCC ANO లెఫ్టినెంట్ లక్ష్మణ్ ఉన్నారు.
జిల్లాకేంద్రంలోని టీటీడీసీలో 50 రోజుల లైసెన్స్ సర్వేయర్స్ శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే. శిక్షణ పూర్తి అనంతరం గత నెల 27, 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. కాగా వాటి ఫలితాలు బుధవారం విడుదల చేశారు. 155 మందికి కేవలం నలుగురే పాస్ అయ్యారు. 100కి 60 శాతానికి పాస్ పర్సంటేజ్ కావడంతో దానిని 50 శాతానికి తగ్గించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
ADB టూ టౌన్ సీఐగా కరుణాకర్ రావు అందించిన సేవలు అభినందనీయమని డీఎస్పీ జీవన్రెడ్డి కొనియాడారు. బుధవారం సాయంత్రం ఘన్పూర్ సర్కిల్కు బదిలీపై వెళ్తున్న కరుణాకర్ రావుకు డీఎస్పీతో పాటు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్సై విష్ణుప్రకాష్ ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు కరుణాకర్రావు తీసుకున్న చర్యలు అమోఘమని ప్రశంసించారు.
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బుధవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. 5th షెడ్యూల్ ప్రాంత పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని ఎంపీ కోరారు. స్పందించిన గవర్నర్ వర్షాకాలం తర్వాత టూర్ పెడతానని తెలిపారన్నారు. అనంతరం గిరిజన ఉద్యోగ సంఘ బాధ్యులు గిరిజన ప్రాంత సమస్యల గురించి వినతిపత్రం అందజేశారు.
Sorry, no posts matched your criteria.