India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల తానూర్ మండలం బెళ్తారోడా గ్రామానికి చెందిన దుర్గ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం బాలికను నిర్మల్ పట్టణంలోని పాఠశాలలో చేర్పించి, బాలిక చదువుకోవడానికి అవసరమైన వస్తువులను కొనిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని బాలికకు సూచించారు. ఇందులో ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి పెంట సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. PACSలో రైతులకు తెలియకుండానే వారి పేరిట రుణాలు తీసుకొని అక్రమాలకు పాల్పడ్డారని, రుణాలు, నిధులు, ఎరువుల విక్రయాల నగదు సొంతానికి వాడుకున్నారని వెలుగులోకి వచ్చింది. అధికారులు కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. దీంతో జిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
రుణమాఫీ నగదును అప్పు ఖాతా కింద మినహాయించవద్దని, రైతులకు విధిగా నెలాఖరులోగా చెల్లించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. అధికారులతో రైతు రుణమాఫీ, రుణాల క్రమబద్ధీకరణ, మహిళాశక్తి రుణాల మంజూరు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. బ్యాంకర్ల వారీగా విడుదలైన మొత్తం రైతులకు ఇచ్చిన నగదు వివరాలపై ఆరాతీశారు. ఏకరూప దుస్తుల తయారీని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయాధికారి శ్రీధర్, డీఆర్డీఓ సాయన్న ఉన్నారు.
జిల్లాలోని వసతిగృహాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ గురువారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా కు బాలల హక్కుల పరీక్షణ వేదిక సభ్యులు వినతి పత్రం అందించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, బాలికల వసతి గృహాలలో మహిళా సిబ్బందిని నియమించాలని విన్నవించారు. ఈ విషయాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. వేదిక సభ్యులు ఎండి షాహిద్, పెందూర్ మధు, రాథోడ్ రోహిదాస్, సాంబశివరావు ఉన్నారు.
నిషేధిత గంజాయిని రవాణా, విక్రయించే వారిపై కూడా కేసులు నమోదు చేసి పిడి యాక్ట్ అమలు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం కమిషనరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ క్రైమ్ బాధితులు కోల్పోయిన డబ్బు త్వరగా రీఫండ్ అయ్యే విధంగా చూడాలని సూచించారు.
ఆదిలాబాద్ రిమ్స్లో ఆల్ ఇండియా MBBS కోటా ప్రవేశాల గడువును పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 29తో ముగుస్తున్న గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఆల్ ఇండియా కోటాలో రిమ్స్కు 15 సీట్లు కేటాయించారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. గడువు పొడిగించి విద్యార్థులకు మరో అవకాశం కల్పించారు.
విద్యార్థులకు పాఠశాల స్థాయిలో చదువుతో పాటు వృత్తివిద్య శిక్షణ కోర్సులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 29 పాఠశాలల్లో కోర్సులు అమలు చేస్తోంది. ఆదిలాబాద్ 6, కొమురం భీమ్ 7, మంచిర్యాల 12, నిర్మల్ 4 పాఠశాలల్లో కోర్సులు అమలు అవుతున్నాయి. కోర్సుల నిర్వహణకు సంబంధించి సామాగ్రి కొనుగోలుకు సంబంధించి రూ.11.62 లక్షల నిధులు విడుదలయ్యాయి.
బాలికను శారీరకంగా వాడుకొని మోసం చేసిన బాలుడిపై కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల సీఐ బన్సిలాల్ తెలిపారు. మంచిర్యాలకు చెందిన ఓ బాలికను(17) ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి ఓ బాలుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను వేధిస్తున్నట్లు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. రిమాండ్ నిమిత్తం బాలుడిని బుధవారం కోర్టు హాజరుపర్చినట్లు సీఐ వెల్లడించారు.
ఆదిలాబాద్ రిమ్స్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, CAS, RMO, CMO పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ జైసింగ్ తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో సెప్టెంబర్ 4న వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. వివరాల కోసం adilabad.telangana.gov.in, rimsadilabad.org వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ రాజర్షిషా బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు, అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపడుతున్న నిర్మాణ పనులతీరు, పదవతరగతికి సంబంధించి రూపొందించిన క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. డెంగ్యూ కేసులు నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, మెప్మా ద్వారా ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
Sorry, no posts matched your criteria.