India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 2025-27 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ మద్యం (A4) దుకాణాల కేటాయింపు కోసం గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లాలోని మొత్తం మద్యం దుకాణాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లక్కీ డ్రా తీశారు. డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2027 వరకు ఈ లైసెన్స్లు చెల్లుబాటు అవుతాయి.

విద్యార్థులను చదువుకునేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు SP అఖిల్ మహాజన్ సూచించారు. ఇచ్చోడ మండలంలోని కేశవపట్నంలో గురువారం తెల్లవారుజామున ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు, ఒక మ్యాక్స్ను స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ SP కాజల్ సింగ్ ఐపీఎస్, DSP జీవన్ రెడ్డి తదితరులున్నారు.

రోడ్ సేఫ్టీ, NCORD మాదక ద్రవ్యాల నిషేధంపై ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు సంబంధిత అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలను పాటించడమే రోడ్డు ప్రమాదాల నివారణకు కీలకమన్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారవచ్చని, డ్రైవింగ్ చేసే ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. విద్యాసంస్థల్లో రోడ్ సేఫ్టీ అవగాహన చేపట్టాలన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ నెల 26న విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ఆయా కళాశాలల్లో నిర్వహిస్తున్నట్టు జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. ఈ విద్యాసంవత్సరం ఇంటర్లో అత్యుత్తమ మార్పులు, నాణ్యమైన విద్యతో మంచి ఫలితాలు తీసుకురావడానికి ముందుకు వెళ్తున్నామన్నారు. విద్యార్థుల ప్రగతి నివేదికలపై చర్చిస్తామని వెల్లడించారు.

దుర్గాదేవీ నవరాత్రుల సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. షీటీం, పోలీస్ పర్యవేక్షణ కొనసాగుతుందని SP అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. ఆకతాయిలు యువతులు, మహిళలను ఇబ్బంది పెడితే కేసులు పెడతామని హెచ్చరించారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల సమయంలోనూ ఇలా వ్యవహరించిన పదిమందిపై 1-టౌన్ PSలో కేసులు నమోదు చేశారు. ఉత్సవాలను ప్రశాంతంగా జరగనీయండి.. మీ తాత్కాలిక ఆనందం కోసం ఎవరినీ ఇబ్బంది పెట్టకండి.
SHARE IT

డా.బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ అధ్యాయన కేంద్రాల్లో కాంటాక్ట్ పద్ధతిన కౌన్సెలింగ్ తరగతులు బోధించడానికి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత పేర్కొన్నారు. బోధన అనుభవం, పీహెచ్డి, నెట్, సెట్, పీజీ సంబంధిత సబ్జెక్టులలో 50% మార్కులు కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హులు www.braou.ac.inలో అక్టోబర్ 10 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ DSP జీవన్ రెడ్డి హెచ్చరించారు. జందపూర్లో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో నిందితురాలిపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనపై ప్రజలు ఎలాంటి దుష్ప్రచారాలు వ్యాప్తి చేయకుండా ఉండాలని సూచించారు. మహిళకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు.

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్స్, శ్రామిక్ పోస్టుల భర్తీ కోసం స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చెసిందని, అర్హులైన గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్భూగుప్తా తెలిపారు. ఉమ్మడి ADBజిల్లాలోని అర్హులైన గిరిజన యువత మరిన్ని వివరాల కోసం ఐటీడీఏలోని GSUK కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

ఉట్నూర్కు చెందిన సాయితేజ సీనియర్ల వేధింపులకు గురై హైదరాబాద్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి మృతదేహాన్ని మంగళవారం ఉట్నూర్కు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్థులు, కుటుంబీకులు సాయితేజకు కన్నీటి వీడ్కోలు పలికారు. యువత ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చవద్దని గ్రామస్థులు కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు సోమవారం నిర్వహించారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా దగ్గరుండి పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది.
Sorry, no posts matched your criteria.