Adilabad

News August 13, 2025

నాటిన మొక్కలను సంరక్షించాలి: కలెక్టర్

image

నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం సాత్నాల మండలకేంద్రంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన మొక్కలను నాటారు. అనంతరం సాత్నాల ప్రాజెక్టును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గేట్ ఎత్తే వేసే ముందు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సమాచారం అందజేయాలని సూచించారు.

News August 13, 2025

నిండుకుండలా లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్

image

సాత్నాల ప్రాజెక్టు కుడి కాల్వ కింద జైనథ్ మండలంలో ఉన్న లక్ష్మీపూర్ బ్యాలెన్స్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 7,600 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. మంగళవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండటం, సాత్నాల కుడి కాలువ నుంచి లక్ష్మీపూర్ ప్రాజెక్టులోకి నీటి విడుదల కొనసాగుతుండడంతో అలుగు పారే అవకాశం ఉంది.

News August 13, 2025

ADB: హర్ ఘర్ తిరంగా ప్రచారం

image

మిషన్ శక్తి – DHEW బృందం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని పలు విద్యాసంస్థల్లో బుధవారం హర్ ఘర్ తిరంగా ప్రచారం కార్యక్రమంతో పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. పౌరులు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రోత్సహించే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని చేపట్టినట్లు జిల్లా మిషన్ కోఆర్డినేటర్ యశోద తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా దేశభక్తి భావాన్ని పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

News August 13, 2025

ADB: ఆ మండలాల పాఠశాలలకు సెలవు

image

భారీ వర్షాల వల్ల విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉట్నూరు, ఇచ్చోడ, సిరికొండ, బోథ్, సోనాల మండలాలలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు లోకల్ హాలిడే ప్రకటించినట్లు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా తెలిపారు. ఈ మేరకు సంబంధిత మండలాల ఎంఈఓలకు, పాఠశాల ప్రిన్సిపల్‌లకు ఆదేశాలు జారీ చేశారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

News August 13, 2025

ADB: పావురాల ప్రేమికుడు ఆ‘దిల్’♥

image

పక్షులంటే ఆ పసివాడికి ప్రాణం. చిన్నప్పుడే పావురాలతో అతడికి స్నేహం ఏర్పడింది. వాటితో ఒక్కరోజు గడపకపోతే అతడిలో ఏదో వెలితి కనిపిస్తుంది. ఇచ్చోడ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆదిల్ 40కి పైగా పావురాలను పెంచుకుంటున్నాడు. రోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పావురాలతో గడుపుతాడు. వాటికి ఆహారాన్ని అందిస్తుంటాడు. పక్షులపై విద్యార్థి చూపిస్తున్న ప్రేమకు చుట్టుపక్కల వాళ్లు ఫిదా అవుతున్నారు.

News August 13, 2025

ADB: ALERT.. 72 గంటలు భారీ వర్షాలు

image

భారీ వర్షాల కారణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. రాబోయే 72 గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 18004251939కు కాల్ చేయాలని సూచించారు. డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

News August 13, 2025

ADB: ఉరేసుకొని యువకుడి బలవన్మరణం

image

జిల్లాకేంద్రంలోని రామ్‌నగర్ కాలనీలో నివాసం ఉండే రాథోడ్ విక్కీ(32) మంగళవారం రాత్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గదిలోకి వెళ్లి ఉరేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా బలవన్మరణానికి పాల్పడడానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

News August 12, 2025

బజార్హత్నూర్: సంప్రదాయబద్ధంగా నోవోంగ్ పూజలు

image

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నాయకులు పేర్కొన్నారు. బజార్‌హత్నూర్‌ మండలం అనంతపూర్ (పంగిడి) గ్రామంలోని సిడాం వంశస్థులు మంగళవారం నోవోంగ్ పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా చేతికొచ్చిన పంటలకు ప్రత్యేక పూజలు చేసి, తమ మొక్కులను తీర్చుకున్నారు.

News August 12, 2025

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: ADB DSP

image

విద్యాసంస్థల్లో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని వ్యవసాయ కళాశాలలో విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. ర్యాగింగ్‌కు పాల్పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ర్యాగింగ్ వంటి అంశాలకు దూరంగా ఉండి, తమ కెరీర్‌పై దృష్టి పెట్టాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలని ఆయన తెలిపారు.

News August 12, 2025

అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు: ADB కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అక్రమాలకు పాల్పడిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సంబంధిత సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షిషా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్లు, వనమహోత్సవం, గృహజ్యోతి, మహాలక్ష్మి, సౌర విద్యుత్ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. భూభారతి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, దరఖాస్తుల పరిశీలనను రోజువారీగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.