India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇచ్చోడ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఇందిరా మహిళ శక్తి పథకం కింద ఏర్పాటు చేస్తున్న నూతన మహిళ శక్తి క్యాంటీన్ను బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా పరిశీలించారు. క్యాంటీన్ ఏర్పాటుకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా శక్తి పథకంతో మహిళల ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం ఐకేపీ వీవోఏలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ హాజరై సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ఐకేపీ వీవోఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఈఎస్ఐ, పీఎఫ్, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యువత గంజాయికి బానిసలు అవుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా గత మూడేళ్లలో జిల్లా వ్యాప్తంగా 242 కేసులు నమోదు కాగా, 398 మందిని అరెస్ట్ చేశారు. 1,056.64 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో రూ.2లక్షల లోపు రుణం ఉండి రేషన్ కార్డు లేక రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు ఇన్ఛార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 3 విడతల్లో రుణమాఫీ అయింది. రేషన్ కార్డు లేక రుణమాఫీ కాని రైతులను గుర్తించి వారి కుటుంబ వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇందుకోసం మండలాల వారీగా నోడల్ అధికారులను నియమించనున్నారు.
భార్య చనిపోయిన అదే రోజు భర్త మృతి చెందిన ఘటన తానూర్లో చోటుచేసుకుంది. మండలానికి చెందిన బండేవార్ పోశెట్టి (91), పెంటుబాయి (86) దంపతులు. కాగా పెంటుబాయి మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందింది. భార్య అంత్యక్రియలు మధ్యాహ్నం జరగగా అదే రోజు రాత్రి 10గంటలకు మనోవేదనతో ఆమె భర్త పోశెట్టి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఆసిఫాబాద్లో ఈనెల 29న నిర్వహించే మాజీ మంత్రి స్వర్గీయ కోట్నాక భీంరావు వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావాలని గోండ్వాన పంచాయతీ రాయ్ సెంటర్ సభ్యులు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబును కోరారు. ఈ మేరకు ఇవాళ కాగజ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమంలో గోండ్వాన జాతీయ నాయకులు సిడం అర్జు, మేడి మోతిరాం, సభ్యులు చిన్నయ్య, గుణ్వంతరావ్, తదితరులు ఉన్నారు.
చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు. ఆదిలాబాద్ లోని కే.ఆర్.కే కాలనీలో నివాసం ఉండే పెన్నేశ్వరి ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. దీంతో ఆమె మావల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేస్ దర్యాప్తు చేయగా ఐదుగురు యువకులు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. వీరిలో అర్బాజ్, షెహబాజ్, సోహెల్, వాజిద్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు అశోక్ కోసం గాలిస్తున్నామన్నారు.
ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన అక్షయ్, ఆకాశ్, విజయ్ తాంసీ మండలంలోని బండల్ నాగపూర్లోని తమ బంధువు శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. అయితే సరదాగా మంగళవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో గల్లంతు కాగా, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి, ముగ్గురు యువకుల మృతదేహాలు వెలికితీశారు.
చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన ఆదిలాబాద్ రూరల్ మండలంలో చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు కూలీలు తాంసి మండలంలోని బండల్ నాగపూర్ గ్రామంలో గల బంధువుల ఇంటికి వచ్చారు. మంగళవారం పొచ్చర వాగులో చేపల వేటకు వెళ్లగా వాగులో గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లాలో సహజ సిద్ధమైన అందాలకు, ప్రకృతి రమణీయతకు కొదవలేదు. వర్ష కాలంలో ఆకుపచ్చని చీరను చుట్టినట్లు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దట్టమైన అడవితో అందాలు కనువిందు చేస్తాయి. ఆకుపచ్చని దట్టమైన చెట్ల మధ్యలో నుంచి నల్లటి తారురోడ్డు ఆదిలాబాద్ మీదుగా వెళ్లే 44 జాతీయ రహదారి విహంగ దృశ్యం కనువిందు చేస్తోంది.
Sorry, no posts matched your criteria.