Adilabad

News April 10, 2025

పోషణ పక్షం విజయవంతం చేయాలి: ADB కలెక్టర్

image

పోషణ పక్షం ఈనెల 22 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా ఆన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో పోషణ పక్షం 2025పై అధికారులతో సమావేశం నిర్వహించారు. సరైన పోషణతో ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేలా అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించేలా యోగా, వ్యాయామం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

News April 10, 2025

ADB: MSG UR SP.. నంబర్ ఇదే 8712659973

image

జిల్లా ప్రజలకు మరింత వేగవంతమైన పారదర్శకమైన సేవలను అందించాలని ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా ప్రజలు, సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, ఎలాంటి సమస్యలున్నా సమాచారాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. 8712659973కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.

News April 9, 2025

ADB: ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

image

నిర్మల్ పట్టణ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు అతని 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.

News April 9, 2025

TG మెడికల్ సర్వీసెస్ జనరల్ మేనేజర్‌గా ADB బిడ్డ

image

బోథ్‌కు చెందిన డా.రుక్మారెడ్డి TG మెడికల్ సర్వీసెస్&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMSIDC)లో ఔషధాలు, శస్త్ర చికిత్స పరికరాలు విభాగానికి జనరల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రంలోని సబ్‌సెంటర్‌ల నుంచి మెడికల్ కాలేజీ దవాఖానాల వరకు అన్ని స్థాయిల్లో ప్రభుత్వ దవాఖానాల ఔషధ అవసరాలు పర్యవేక్షణ చేయనున్నారు. కాగా ఆయన ప్రస్తుతం HYD DMHO ఆఫీస్‌లో ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్నారు.

News April 9, 2025

ఇచ్చోడ: ఇంట్లో ఉరేసుకొని బాలిక మృతి

image

ఇచ్చోడ మండలంలో ఉరి వేసుకొని చనిపోయిన ఘటన జరిగింది. ఎస్సై తిరుపతి వివరాల ప్రకారం. ముఖరా(బి)కి చెందిన రఫీ గత కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులతో మద్యం తాగి వచ్చి రోజు గొడవ పడేవాడు. దీంతో మనస్థాపానికి గురైన కూతురు షేక్ ఫిర్దోసి(16) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. తల్లి జాబీనాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 9, 2025

ADB: వ్యాపారంలో నష్టాలు.. వ్యక్తి SUICIDE

image

ADBలోని సంజయ్ నగర్‌కు చెందిన పశువుల వ్యాపారి సలీంఉల్లా సిద్దీఖీ అలియాస్ ఫేరోజ్(35) పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. పశువుల క్రయవిక్రయాల్లో నష్టాలపాలైన సలీంఉల్లా సిద్దిఖీ సోమవారం మధ్యాహ్నం ఇంటి వద్దనే గుర్తు తెలియని మందు తాగేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

News April 9, 2025

ADB: విద్యార్థులకు GOOD NEWS.. అడ్మిషన్లు START

image

ADB జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమైనట్టు ప్రిన్సిపల్ శివకృష్ణ తెలిపారు. బీఏ(హెచ్ఈపీ), బీకాం (సీఏ), బీఎస్సీ, బీజడ్సీ, డాటా సైన్స్, స్టాటిస్టిక్స్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 9849390498 లేదా https://ttwrdcs.ac.in/Boat వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు.

News April 9, 2025

ఇచ్చోడ: యాక్సిడెంట్.. నలుగురికి గాయాలు

image

ఎదురుఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొని నలుగురికి గాయాలైన ఘటన మంగళవారం పెంబి మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలం సల్లెడ గ్రామానికి చెందిన మాడవి శ్రీకాంత్, పోషన్న ఖానాపూర్ నుంచి పెంబి వస్తున్నారు. ఈ క్రమంలో పరిమండల్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఎదురుఎదురుగా వస్తున్న బైక్‌ను భీకొని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం హాస్పిటల్‌కు పంపారు.

News April 8, 2025

కేయూ: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

image

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు.ఇంకా 181 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

News April 8, 2025

ఆదిలాబాద్‌: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని KRK కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. భాగ్యలక్ష్మి, గంగన్న అనే ఇద్దరు.. అమాయక మహిళలు, యువతులకు డబ్బు ఆశ చూపుతూ వ్యభిచారం చేయిస్తున్నట్లు ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు. ఇద్దరు బాధిత మహిళలను అదుపులోకి తీసుకొని సఖి కేంద్రానికి తరలించి ఆశ్రయం కల్పించామన్నారు. నిందితులైన భాగ్యలక్ష్మి, గంగన్నతో పాటు విటులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.