Adilabad

News August 16, 2024

ఆదిలాబాద్: మాఫీ ముగిసె.. అన్నదాతలు మురిసె

image

ప్రభుత్వం జిల్లాల వారీగా రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న మాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడతల వారీగా మాఫీ చేయడంతో 2018 నుంచి ఉన్న బకాయిల నుంచి రైతులకు రుణవిముక్తి లభించింది. ఉమ్మడి జిల్లా మొత్తంలో తుది విడతలో 51 వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. 61,416 మంది రైతుల ఖాతాల్లో రూ.846.41 కోట్లు నేరుగా జమ చేసేలా నిధులు విడుదల చేశారు.

News August 16, 2024

ఆదిలాబాద్: ఉత్తమ పోలీసులకు మెడల్స్ అందించిన ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లాలో 73 మంది పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ గౌష్ అలం మెడల్స్ అందించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం ఉత్తమసేవలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 3 ఉత్తమసేవా, 3 ఉత్క్రిస్ట సేవ, 2 అంత్రికసేవ, 65 సేవామెడల్స్ పొందిన పోలీస్ అధికారులకు ఎస్పీ మెడల్స్ బహుకరించారు.

News August 15, 2024

మంచిర్యాల: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు

image

78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, పోలీసు ఉన్నతాధికారులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

News August 15, 2024

మంచిర్యాల: అవమానం.. స్వాతంత్ర్య వేడుకల నుంచి వాకౌట్

image

బెల్లంపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ అవమానం జరిగిందని ప్రాతినిధ్య AITUC సంఘం వైస్ ప్రెసిడెంట్ తిరుపతి సభా ప్రాంగణం నుంచి వాకౌట్ చేశారు. తిరుపతి మాట్లాడుతూ.. గుర్తింపు సంఘంగా వేడుకలకు పిలిచి ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారని ఆగ్రహించారు. ప్రోటోకాల్ విషయంలో అధికారుల అత్యుత్సాహం పనికిరాదన్నారు.

News August 15, 2024

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నేటి వివరాలు

image

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 698.325 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 965 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

News August 15, 2024

ADB: బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి రిమాండ్

image

ఆదివాసీ బాలిక(17)ను ప్రేమపేరుతో మోసం చేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. బాధిత బాలికను ఆదిలాబాద్‌లోని క్రాంతినగర్‌కు చెందిన ముబాషిర్ 6 నెలలుగా ప్రేమపేరుతో మభ్యపెడుతూ లొంగదీసుకొని అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై అత్యాచారం, పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

News August 15, 2024

ఆదిలాబాద్‌‌కు చేరుకున్న షబ్బీర్ అలీ

image

స్వతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించడాని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ అలం ఘనంగా స్వాగతం పలికారు. 

News August 15, 2024

ముధోల్: నాలుగు ఉద్యోగాలు సాధించిన రైతు కుమారుడు

image

మండలంలోని కారేగాం గ్రామానికి చెందిన రైతు దూసముడి రాములు-లక్ష్మి దంపతుల కుమారుడు ప్రశాంత్ కుమార్ ఇటీవల TGPSC విడుదల చేసిన సివిల్ ఇంజినీరింగ్ AEE ఫలితాలలో మిషన్ భగీరథ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాన్ని సాధించాడు. అలాగే AE, TPBO, TO(Ground Water dept) మెరిట్ అర్హతను సాధించాడు. 10th వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన అతడు KUలో BTech, JNTUHలో MTech పూర్తిచేశాడు.

News August 14, 2024

ADB: స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మైదానంలో కలిసి తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం పోలీసులు ప్రత్యేక కవాతు రిహార్సల్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. వారి వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఏఎస్పీ సురేందర్ రావు, ఇతర అధికారులు ఉన్నారు.

News August 14, 2024

లోకేశ్వరం: విడిపోయిన భార్యభర్తలు.. కలిపిన ఎస్ఐ

image

లోకేశ్వరం మండలం బాగపూర్ గ్రామానికి చెందిన దర్శనం నరేష్‌కు, నగర్ గ్రామానికి చెందిన అనితకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి తేజశ్రీ, మిన్ను సంతానం. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో గొడవ పడి భార్య పుట్టింటికి వెళ్ళగా నరేష్ మత్తుకు బానిసయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సక్రియా నాయక్ బుధవారం భార్యభర్తలను పోలీసు స్టేషన్‌కు రప్పించి విడిపోయిన వారిని ఒక్కటి చేశారు.