Adilabad

News March 30, 2026

ADB: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఎస్పీ ఆదేశం

image

జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 28 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బాధితుల సమస్యలను నేరుగా విని, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశించారు. ప్రధానంగా కుటుంబ, భూ వివాదాలు నమోదయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారాన్ని 8712659973 వాట్సాప్ నంబర్‌కు తెలపాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు.

News March 30, 2026

ADB: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఎస్పీ ఆదేశం

image

జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 28 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బాధితుల సమస్యలను నేరుగా విని, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశించారు. ప్రధానంగా కుటుంబ, భూ వివాదాలు నమోదయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారాన్ని 8712659973 వాట్సాప్ నంబర్‌కు తెలపాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు.

News March 30, 2026

ప్రజావానికి 101 ఫిర్యాదులు: ఆదిలాబాద్ కలెక్టర్

image

ప్రజావాణి ద్వారా అందే ప్రతి ఫిర్యాదును 30 రోజుల్లోపు పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికలను సమయానికి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రతా పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి సమస్యలు తదితర అంశాలకు సంబంధించి మొత్తం 101 ఫిర్యాదులు అందయన్నారు.

News March 30, 2026

SC యాక్షన్ ప్లాన్ దరఖాస్తు గడువు పొడిగింపు: ADB కలెక్టర్

image

SC యాక్షన్ ప్లాన్ కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు గడువును మరోసారి పొడగించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఏప్రిల్ 8వ తేదీలోపు ఆసక్తి గల యువత దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తులను అర్జీదారు డౌన్ లోడ్ చేసుకొని అవసరమైన పత్రాలను జత చేసి సంబంధిత మండల కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోని సబ్సిడీ పొందాలని కోరారు.

News March 29, 2026

లోక్ అదాలత్‌లో 5,399 కేసులు పరిష్కారం: ADB SP

image

ఆదిలాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. మొత్తం 5,399 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఇందులో 3,812 డ్రంక్ అండ్ డ్రైవ్, 1,017 ఈ-పెట్టీ కేసులు ఉన్నాయి. సైబర్ బాధితులకు రూ.9.95 లక్షలు వాపసు చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

News March 29, 2026

ADB: ఏప్రిల్ 1 నుంచి పదో తరగతి పత్రాల మూల్యాంకనం

image

జిల్లాలో పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 1 – 9 వరకు నిర్వహించనున్నట్లు DEO రాజేశ్వర్ తెలిపారు. జోసెఫ్ కాన్వెంట్ పాఠశాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఇందుకోసం 614 మంది ఉపాధ్యాయులను కేటాయించినట్లు పేర్కొన్నారు. వీరిలో 466 మంది చీఫ్ ఎగ్జామినర్లు (CE), అసిస్టెంట్ ఎగ్జామినర్లు (AE) ఉండగా, 148 మందిని స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించినట్లు వెల్లడించారు.

News March 29, 2026

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ప్రకటన

image

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదిలాబాద్ విమానాశ్రయంపై కీలక ప్రకటన చేశారు. ఉడాన్ 2.0 పథకం కింద ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లను విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌లో కొత్త విమానాశ్రయం నిర్మించనున్నట్లు తెలిపారు. ​ప్రస్తుతం రక్షణ శాఖ అధీనంలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను కాకుండా, మిగిలిన భూమిని సేకరించి అక్కడ విమానాశ్రయం నిర్మిస్తామని స్పష్టం చేశారు.

News March 29, 2026

ఆదిలాబాద్‌లో పత్తికి ‘వర్ష’ గ్రహణం

image

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగుపై ప్రకృతి పగబట్టింది. వానాకాలం సీజన్‌లో 5.70 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా, అందులో సింహభాగం (4.40 లక్షల ఎకరాలు) పత్తిదే. సాధారణంగా 35-44 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, భారీ వర్షాలకు కాయలు కుళ్లిపోయి దిగుబడి పడిపోయింది. మార్కెట్‌కు కేవలం 15.96 లక్షల క్వింటాళ్లే చేరడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News March 28, 2026

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి: ADB SP

image

జిల్లాలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. ఈ వారం 14 ఫిర్యాదులు అందాయని, మోసపోయిన వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు. అనుమానాస్పద లింకులు, లోన్ యాప్‌లు, ఆఫర్లను నమ్మవద్దని.. ఆన్‌లైన్ లావాదేవీల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. తక్షణమే ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్ము తిరిగి పొందే అవకాశం ఉందన్నారు.

News March 28, 2026

ఆదిలాబాద్: MATHS పరీక్షకు 18 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శనివారం మ్యాథమెటిక్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు పోలీసుల బందోబస్తు నడుమ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 52 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 10894 మంది విద్యార్థులకు గాను 10876 మంది విద్యార్థులు హాజరై 18 మంది గైర్హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు.