India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రానున్న మూడు రోజులు ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం చేకూర్చనుంది. కానీ చేతికొస్తున్న పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పదో తరగతి పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ, శ్రద్ధ వహించారు. గత 2023 సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 92.93 శాతంతో ఆదిలాబాద్ 17వ స్థానంలో నిలవగా 2022లో 19వ స్థానంలో నిలిచింది. ఈసారి వంద శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవడానికి చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ప్రత్యేక ప్రణాళిక చేపట్టి వెనుకబడిన విద్యార్థులపై ఫోకస్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షల కోసం మొత్తం 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 21 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 10,106 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు బాలురు 5058, బాలికలు 4993, మొత్తం 10051 మంది ఉన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144, 163 అమలు చేసి పకడ్బందీగా చేపట్టనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం కనిపిస్తోంది. ప్రభుత్వం అభయహస్తం కింద అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించింది. దీంతో తొలి విడతలో చేపట్టనున్న నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్ల నిర్మాణానికి మోక్షం లభించనుంది. ఉమ్మడి జిల్లాలో 35 వేల మందికి లబ్ది చేకూరనుంది. గృహజ్యోతి కింద 3.60లక్షల మందికి లాభం జరగనుంది. పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య రెట్టింపు కానుంది.
ADB ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సైన్స్)లో మార్చ్ 22న జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జే.సంగీత, నెహ్రూ యువజన కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ సుశీల్ బడ్ ప్రకటనలో పేర్కొన్నారు. పోటీల్లో 15-29 వయసున్న డిగ్రీ చదివినా లేదా చదువుతున్న యువతీ యువకులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. పెయింటింగ్, మొబైల్ ఫొటోగ్రఫీ, కవితా రచన, ఉపన్యాసం, సాంస్కృతిక నృత్య విభాగంలో పోటీలు ఉంటాయన్నారు.
రిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు వైద్య సిబ్బంది ముందుండాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. రిమ్స్ వైద్య కళాశాలలో బుధవారం అన్ని శాఖల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో సమీక్ష నిర్వహించారు. రిమ్స్ ఆస్పత్రికి వచ్చే వారందరూ పేద ప్రజలేనని.. వారిని దృష్టిలో ఉంచుకొని వైద్య సేవలు అందించాలన్ నారు. ముఖ్యంగా గైనకాలజీ డిపార్ట్మెంట్లో అన్ని రకాల డెలివరీస్ చేయాలని పేర్కొన్నారు.
తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, పౌరశాస్త్రం సబ్జెక్టుల ఇంటర్మీడియట్ మొదటి విడత మూల్యాంకనం ఈనెల 21 నుంచి ప్రారంభిస్తామని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్, కేజీబీవీ, ఆదర్శ, ప్రైవేట్ కళాశాల్లో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు ADBలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు. అధ్యాపకులు ఉదయం 10:00 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు.
ADB జిల్లాలో ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్(144సెక్షన్) అమల్లో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. మైకులకు, డీజేలతో, ఊరేగింపులకు, ధర్నాలకు, ప్రచారాలకు అనుమతులు లేవని తెలిపారు. పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ దుకాణాలను మూసివేసి ఉంచాలని ఆదేశించారు.
స్వయం ఉపాధి పథకాల ద్వారా యువకులు లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన రాజీవ్ యువ వికాసం పథకానికి అన్ని వర్గాల యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్, కుల, ఆదాయ, పాన్ కార్డ్ తదితర వివరాలను ఉపయోగించి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
కందులు, శనగలు కొనుగోళ్లను ఈనెల 20న నిలిపివేస్తున్నట్లు ఆదిలాబాద్ సెంటర్ ఇన్ఛార్జ్ కేంద్రే పండరి బుధవారం తెలిపారు. కందులు, శనగల నిల్వలు అధికంగా ఉన్నందున కొనుగోళ్లు జరగవన్నారు. ఈనెల 21 నుంచి కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
Sorry, no posts matched your criteria.