India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి, భక్తి వాతావరణంలో 600 మంది పోలీసులతోపాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో నిమజ్జన ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం పేర్కొన్నారు. మరోవైపు ఇందుకు పలు సంఘాలు, కమిటీలు, మండప నిర్వాహకులు, యువత సహకారం అభినందనీయమని ఆయన తెలిపారు.

బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలకు 43% రిజర్వేషన్ అమలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీ రాజ్యాంగ రద్దు కోసం కుట్ర చేస్తోందన్నారు. నాయకులు రవీంద్ర, జంగుబాపు, రమేశ్, జగన్మోహన్, తుకారాం తదితరులు ఉన్నారు.

ఆదిలాబాద్లో 2 వేలకి పైగా గణేష్ మండపాలు ఏర్పాటు చేయగా.. ఆదివారంతో నిమజ్జనాలు విజయవంతంగా పూర్తయ్యాయి. జిల్లాలో ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం 11 రోజులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూసినందుకు ప్రజలు, సామాజికవేత్తలు వారిపై ప్రశంసలు కురిపిస్తూ కృతజ్ఞతలు చెబుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం ఉదయం మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.

గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీ అధికారుల(జీపీఓ) పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో కొత్తగా నియామక పత్రాలు పొందిన 83 మంది జీపీఓలతో ఆయన సమావేశమయ్యారు. ప్రతి అధికారి తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.

గణపతి నవరాత్రి ఉత్సవాలను జిల్లా ప్రజలు ప్రశాంతంగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి, నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సూచనలిచ్చారు. ప్రజలతో మర్యాదగా మాట్లాడి, సామరస్యంగా వ్యవహరించాలని ఆయన కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, 24 గంటలు కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా పూర్తి చేయడానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆయన పోలీసులకు పలు సూచనలు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పలుచోట్ల 108 అంబులెన్సులను అందుబాటులో ఉంచినట్లు జిల్లా ఇన్ఛార్జీ రాజశేఖర్, సామ్రాట్ తెలిపారు. ఆదిలాబాద్లోని వన్టౌన్ పోలీస్ స్టేషన్, కిసాన్ చౌక్, చందా, పెన్గంగాతో పాటు ఉట్నూర్, బోథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్లో 108 సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని వారు పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో నేడు 450 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. వీటిలో దాదాపు 50 శాతం విగ్రహాల వద్ద బ్యాండ్లను ఏర్పాటు చేశారు. బ్యాండ్ వాయించేవారు అలసిపోయినప్పుడు వారికి కొద్దిగా విశ్రాంతి ఇవ్వడం, మంచి నీరు, ఆహారం అందించడం ద్వారా నిర్వాహకులు మానవత్వాన్ని చాటుకోవాలని సామాజికవేత్తలు కోరారు. వారిని ఇబ్బంది పెట్టకుండా తోటి మానవులుగా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

మహిళలను వేధిస్తున్న ఐదుగురు ఆకతాయిలపై కేసు నమోదు చేసినట్లు షీటీం ఇన్ఛార్జ్ ASI సుశీల తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మహిళల భద్రతకు షీటీం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. ఈ మేరకు మహిళలను వేధిస్తూ రెడ్ హ్యాండెడ్గా ఐదుగురిని పట్టుకున్నామన్నారు. వీరిలో మయూర్, సిద్దు, కార్తీక్, గణేష్, వినాయక్పై 1 టౌన్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మహిళలు అత్యవసర సమయంలో 8712659953కు కాల్ చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.