Adilabad

News May 7, 2025

నిర్మల్: కాలకృత్యాలకు వెళ్లిన వివాహితపై లైంగిక దాడి

image

నిర్మల్ జిల్లా తానూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మోగ్లిలో కాలకృత్యాలకు వెళ్లిన వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు గాయాలతో ఇంటికి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. భర్తతో కలిసి గ్రామానికి చెందిన సునీల్‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 7, 2025

నిర్మల్: కాలకృత్యాలకు వెళ్లిన వివాహితపై లైంగిక దాడి

image

నిర్మల్ జిల్లా తానూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మోగ్లిలో కాలకృత్యాలకు వెళ్లిన వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు గాయాలతో ఇంటికి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. భర్తతో కలిసి గ్రామానికి చెందిన సునీల్‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 7, 2025

ADB: ఇలా వెళ్తే కేసులు పెడతాం: DTO

image

ఆదిలాబాద్ లో శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు రవాణా వాహనాలలో ప్రజలని పరిమితికి మించి తీసుకువెళ్తున్న 6 వాహనాలను సీజ్ చేశారు. ఈ క్రమంలో వాహనాలలో ప్రయాణిస్తున్న ప్రజలకి అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు. రవాణా అధికారి రవీందర్ మాట్లాడుతూ.. వాహన యజమానులు సరకు రవాణా వాహనాల్లో ప్రజలను తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

News May 7, 2025

ఆదిలాబాద్‌లో 10 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

image

సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ పి.చంద్రశేఖర్‌కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ADBలోని తిరుపెల్లిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు పేకాట ఆడుతుండగా సంఘటన స్థలంలో పది మంది పట్టుబడ్డారని సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి పది మొబైల్ ఫోన్లు, పేకాట ముక్కలు, రూ.79,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

News May 7, 2025

కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

image

పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ప్రజలకు సత్వర నయం చేకూర్చేలా చూడాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. శుక్రవారం ఆదిలాబాద్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నెలవారీ నేర సమీక్షలో ఎస్పీ పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లలో ఉన్న 16 వర్టికల్స్ పనితీరు సక్రమంగా ఉండాలన్నారు. వాటిని ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. ఏఎస్పీ సురేందర్ ఉన్నారు.

News April 25, 2025

ADB: కట్టుకున్నవారే కడతేర్చుతున్నారు

image

కట్టుకున్నవారే కాలయముళ్లుగా మారి కడతేరుస్తున్నారు. బంధాలను మర్చిపోయి పిల్లలను తల్లి ప్రేమకు దూరం చేస్తున్నారు. ADB (D) గుడిహత్నూర్‌కు చెందిన మారుతి భార్యపై కక్ష పెంచుకుని కత్తితో హతమార్చాడు. ASF(D) కాగజ్‌నగర్‌కు చెందిన జయరాం మగసంతానం కోసం భార్యతో గొడవపడి పలుగుతో దాడి చేసి చంపాడు. అన్యోన్యంగా ఉండాల్సినవారు గొడవలతో జీవితాన్ని నాశనం చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.

News April 25, 2025

నిర్మల్: కన్న కొడుకును నరికి చంపిన తండ్రి

image

నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలంలో దారుణం జరిగింది. మల్లాపూర్ గ్రామంలో కన్నకొడుకు గొడ్డలితో నరికి తండ్రి హత్య చేశాడు. గ్రామానికి చెందిన బైనం అశోక్ (29)ను అతని తండ్రి బైనం ఎర్రన్న ఇవాళ ఉదయం హత్య చేశాడని గ్రామస్థులు పేర్కొన్నారు. చంపిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెల్లి లొంగిపోయాడు. ఎస్ఐ రహమాన్ మాలిక్ ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 25, 2025

ADB: వడదెబ్బకు ఏడుగురి మృతి

image

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్‌లో ఒకరు, ఆదిలాబాద్‌లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.

News April 25, 2025

ADB: వివాహేతర సంబంధం.. భార్యను చంపిన భర్త

image

గుడిహత్నూర్ మండలకేంద్రంలో భర్త చేతిలో భార్య కీర్తి (25) దారుణ హత్య విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కీర్తి భర్త మారుతి 5 ఏళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రోజూ భార్యాభర్తల మధ్య గొడవ జరిగేది. సదరు మహిళను ఇంటికి తీసుకువస్తానని భర్త చెప్పడంతో గురువారం భార్య మందలించింది. ఇరువురి మధ్య గొడవ జరిగి భార్యను గొడ్డలితో దారుణంగా నరికాడు. తర్వాత మారుతి పరారయ్యాడు.

News April 25, 2025

ADB: మే 4న NEET.. కలెక్టర్ సమీక్ష

image

UGC, NEET (నీట్) నిర్వహణపై గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షిషా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సంబంధిత అధికారులు, ప్రిన్సిపల్స్‌తో సమీక్ష నిర్వహించారు. మే 4వ తేదిన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న నీట్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.