Adilabad

News August 13, 2024

ADB: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆదిలాబాద్ జిల్లాలో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం ఈ నెల 20 లోగ సంబంధిత ఎంఈవోలకు దరఖాస్తు పెట్టుకోవాలని జిల్లా విద్యాధికారి ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో MEOలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దరఖాస్తులను పరిశీలించి ఉత్తమ సేవలందించిన ముగ్గురు ఉపాధ్యాయులను ఎన్నిక చేసి ఈ నెల 24 న జిల్లా విద్యాశాఖాధి కార్యాలయంలో సమర్పించాలని ఎంఈవోలకు ఆమె సూచించారు.

News August 13, 2024

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలు

image

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 698. 075 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 1419 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు.

News August 13, 2024

నిర్మల్: ఆ విషయంలో ప్రత్యేకత చాటుకుంటున్న నిర్మల్

image

మహిళా జనాభా ఎక్కువగా ఉన్న నిర్మల్ జిల్లా మరో విషయంలోనూ ప్రత్యేకత చాటుకుంటోంది. జిల్లాలోని పరిపాలన యంత్రాంగంలో ఎక్కువ మంది మహిళా అధికారులే ఉండడం విశేషం. అత్యంత కీలకమైన కలెక్టర్‌, ఎస్పీ, డీఆర్డీఓ, ఆర్డీఓ పోస్టుల్లో మహిళా అధికారులే బాస్‌లుగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్‌గా అభిలాష అభినవ్‌, ఎస్పీగా జానకీ షర్మిల, డీఆర్డీఓగా విజయలక్ష్మి, ఆర్డీవోగా రత్న కల్యాణి ఇలా అత్యధికులు మహిళలే ఉన్నారు.

News August 13, 2024

ADB: తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను తయారు చేయాలి: కలెక్టర్

image

ఆదిలాబాద్ ZP సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీవో లు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన శిక్షణ శిబిరానికి కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి తప్పులు లేని వార్డుల వారీగా గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాను తయారు చేయటానికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో నిరంతర ప్రక్రియగా స్వచ్ఛదనం పచ్చదనం కొనసాగాలన్నారు.

News August 13, 2024

మందమర్రి: ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్‌బాల్ బాలికల జట్టు ఎంపిక పోటీలు

image

మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో సోమవారం ఇంటర్ డిస్ట్రిక్ట్ బాలికల ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి క్రీడాకారులు హాజరు కాగా జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈనెల 16, 17, 18 తేదీలలో నిజామాబాద్ జిల్లాలో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొంటారని ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రెటరీ రఘునాథరెడ్డి తెలిపారు.

News August 12, 2024

ఆదిలాబాద్: పరీక్షల్లో మెరిసిన శుభాంగి

image

ఆదిలాబాద్‌ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల BZC విద్యార్థిని శుభాంగి అగర్వాల్ సీపీ గెట్ పీజీ ఫలితాల్లో ఏకంగా ఏడు సబ్జెక్టుల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి చరిత్ర సృష్టించింది. వృక్షశాస్త్రంలో 6వ ర్యాంకు, హిందీలో 25, జంతు శాస్త్రంలో 27, ఆంగ్లంలో 57, జర్నలిజంలో 107, ఆర్థిక శాస్త్రంలో 117, రసాయన శాస్త్రం లో 1713 ర్యాంకులు సాధించి ఔరా అనిపించింది. సోమవారం కళాశాలలో శుభాంగిని, తండ్రిని సన్మానించారు.

News August 12, 2024

ముధోల్: ‘నా భర్తను స్వదేశానికి రప్పించండి’

image

కువైట్ దేశంలో చిక్కుకున్న ముధోల్ మండలం వాసి రాథోడ్ నాందేవ్‌ను స్వదేశానికి తిరిగి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని పాస్ పోర్ట్, ఇమ్మిగ్రేషన్ అధికారి అమిత్ కుమార్‌ను హైదరాబాద్‌లో బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బాధితుడి కుటుంబ సభ్యులు కలిశారు. క్లీనింగ్ అని చెప్పి ఏజెంట్ కువైట్ దేశానికి పంపించడంతో అక్కడ ఎడారిలో ఒంటెలు మేపుతూ భర్త ఇబ్బందుల పాలవుతున్నాడు అని ఆమె వాపోయారు.

News August 12, 2024

ఆదిలాబాద్ జిల్లాలో విద్యావలంటీర్లు అవసరం..!

image

ఉపాధ్యాయుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ బడుల్లో అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పేరిట విద్యావాలంటీర్ల నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. ఇప్పటికే నారాయణపేట, వికారాబాద్ జిల్లాల కలెక్టర్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈనేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోనూ VVల అవసరం ఎంతో ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగు ప్రతిపాదనలు పంపించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

News August 12, 2024

ఆదిలాబాద్: ఓపెన్ DEGREE ప్రవేశాలకు దరఖాస్తులు

image

కాకతీయ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్‌ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ నుంచి ప్రవేశాల ప్రకటన విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో UG/ PG/ డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. యూజీ, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను పేర్కొంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆగస్టు 31వ తేదీ గడువు ఉంది.

News August 12, 2024

మంచిర్యాల జిల్లాలో 40 రోజుల్లో 25 డెంగీ కేసులు

image

మంచిర్యాల జిల్లాలో జులై నుంచి ఆగస్టు వరకు గడిచిన 40 రోజుల్లో 25 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు అలెర్ట్ చేస్తున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటూ ఇటీవల పలు వార్డుల్లో, గ్రామాల్లో అవగాహన ర్యాలీలు అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్వహించారు. దోమల నివారణకు చర్యలు కూడా తీసుకుంటున్నారు.