Adilabad

News March 19, 2025

తాంసి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

తాంసి మండల కేంద్రానికి చెందిన కనాకే ప్రసాద్(42) చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు.. తాంసికి చెందిన ప్రసాద్‌కు హోలీన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రసాద్ చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందాడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలున్నారు.

News March 19, 2025

రాష్ట్ర బడ్జెట్‌పై ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆశలు

image

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ADB జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఉట్నూర్ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా, జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్, స్పిన్నింగ్ వద్ద ఫ్లైఓవర్ పనులకు, చనాక-కొరాట ప్రాజెక్ట్, కుంటాల, పొచ్చర జలపాతాల వద్ద అభివృద్ధి, పర్యాటక రంగానికి, పురాతన ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

News March 19, 2025

ADB: ఐదుగురిపై కేసు నమోదు, అరెస్టు: DSP

image

యువత గంజాయి మత్తు బారిన పడకుండా తల్లిదండ్రులు వారిపై శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. ఇద్దరు గంజాయి అమ్మేవారు, ఒకరు గంజాయి పండించేవాడు, ఇద్దరు గంజాయి తాగే వారున్నారని తెలిపారు. వీరి నుంచి 35 గ్రాముల గంజాయి, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

News March 19, 2025

రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్ సాధించిన ADB బిడ్డ

image

ఉట్నూర్ మండల కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన నాతోరి రవీందర్ ప్రభుత్వం విడుదల చేసిన HWO ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకును సాధించి అందరి మన్ననలు పొందారు. రవీందర్ ఉట్నూర్ కీబీ ప్రాంగణంలోని ప్రభుత్వ పీఈటీసీ లైబ్రరీలో చదివి ఉద్యోగం సాధించారు. రవీందర్‌ను పీఈటీసీ ప్రిన్సిపల్ మెస్రం మనోహర్, తోటి విద్యార్థులు అభినందించారు..

News March 19, 2025

ఉట్నూర్: యాక్సిడెంట్.. ఒకరి దుర్మరణం

image

ఉట్నూర్ మండలం ఘన్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం రెండు బైకులు ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ జైనూర్ మండలం గూడ మామడ గ్రామానికి చెందిన కుమ్రా భక్కు‌ను రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గౌరు అనే మరోవ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎదురుగా బైక్‌ను ఢీ కొన్న చిచ్‌దరి ఖానాపూర్‌కు చెందిన వ్యక్తికి గాయాలతో చికిత్స పొందుతున్నాడన్నారు.

News March 19, 2025

ADB: రాష్ట్రస్థాయి జిజ్ఞాసలో మనోళ్లకే  మొదటి స్థానం

image

ADBలోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జిజ్ఞాసలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి మొదటి స్థానంలో నిలిచారు. HYDలో జరిగిన రాష్ట్రస్థాయి జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వ పాలన శాస్త్రంలో “ఆరు గ్యారంటీల అమలుకు అవకాశాలు: ADBపై ఒక అధ్యయనం” అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బేగం వారిని అభినందించారు.

News March 19, 2025

ADB: ఐదుగురిపై కేసు నమోదు, అరెస్టు: DSP

image

యువత గంజాయి మత్తు బారిన పడకుండా తల్లిదండ్రులు వారిపై శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. ఇద్దరు గంజాయి అమ్మేవారు, ఒక గంజాయిని పండించేవాడు, ఇద్దరు గంజాయి తాగే వారున్నారని తెలిపారు. వీరి నుంచి 35 గ్రాముల గంజాయి, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

News March 19, 2025

ADB: ఉపాధి పని ప్రదేశంలో వాటర్ బెల్

image

వేసవిలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఉపాధి కూలీలకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పనులు చేసేలా చర్యలు చేపట్టాలని డీఆర్డీఓను ఆదేశించినట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో రక్షణ కల్పించేందుకు ఉపాధి పథకంలో వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలన్నారు. పనులకు హాజరయ్యే కూలీలకు గంటకోసారి నీళ్ళు తాగేలా పని ప్రదేశంలో చర్యలు తీసుకోవాలన్నారు.

News March 19, 2025

యాపల్‌గూడ యువకుడికి సెకండ్ ర్యాంక్

image

యాపగూడ గ్రామానికి చెందిన పరమాదాస్, రుక్మాబాయి దంపతుల కుమారుడు ఎ.చంద్రశేఖర్ TSPSC నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలో ఉత్తమ ప్రతిభచాటాడు. బీసీ వెల్ఫేర్ విభాగంలో, బాసర జోన్‌లో సెకండ్ ర్యాంక్ సాధించాడు. ఆదిలాబాద్ పట్టణంలోని, ప్రైవేట్ B.Ed కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తూ ప్రిపేర్ అయ్యాడు. తమ గ్రామ యువకుడు ఉద్యోగం సాధించడం పట్ల యాపల్ గూడ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 19, 2025

నీటిఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు: కలెక్టర్

image

తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాను బలోపేతం చేయాలని, లీకేజీలను వెంటనే సరిచేయాలన్నారు. బోర్లు, పంపుల మరమ్మతులు చేయాలని, నీటి వనరులను గుర్తించాలని ఆదేశించారు. ప్రజలకు నీటివినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బోర్లు, చేతి పంపులను మరమ్మతులు చేయాలన్నారు.

error: Content is protected !!