India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
◆ ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వాన
◆ లోకేశ్వరం: పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
◆ MNCL: రైలుకింద పడి యువకుడు మృతి
◆ భీమిని : మద్యం మత్తులో తల్లిపై దాడి
◆ బెల్లంపల్లి : గుండెపోటుతో ప్రభుత్వ పిఈటి మృతి
◆ కన్నెపల్లి : ఉరేసుకుని వ్యక్తి మృతి
◆ NRML : కడెం ప్రాజెక్టు మూడుగేట్లు ఎత్తివేత
◆ పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు
◆ ఆదిలాబాద్ : పోలీసులమంటూ బురిడీ
◆ మంచిర్యాల: MLAపై అసత్య ప్రచారం.. ముగ్గురు అరెస్ట్
భీమిని మండల కేంద్రంలో రాంటెంకి శ్రీకాంత్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో తల్లి పోషక్కను బ్లేడ్తో చేతిపై గాయపర్చగా, అన్న శంకర్ను ఇనుపరాడ్తో కొట్టి తాను బ్లేడ్తో కోసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శ్రీకాంత్ను ఆసుపత్రికి తరలించే క్రమంలో హోంగార్డు అశోక్ పై దాడి చేసి బ్లేడ్తో గొంతు కోశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దండేపల్లి మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ అనిలాను సస్పెండ్ చేస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల రికార్డులు సక్రమంగా లేకపోవడం, యూనిఫాం డబ్బులు సకాలంలో చెల్లించకపోవడం తదితర ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపి నివేదికలను రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ ఏంఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
ADB జిల్లా వ్యాప్తంగా 18 మంది ధరణి అపరేటర్లకు స్థానచలనం కల్పించారు. ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లను ఎట్టకేలకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఆయా మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో చేరాలని ఆదేశించారు. కాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కొందరిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తారని అంతా భావించినా.. పక్క మండలానికే కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
◆ త్వరలో ఆదిలాబాద్లో రేవంత్ రెడ్డి పర్యటన
◆ జైనూర్: భారీగా గుట్కా పట్టివేత
◆ భైంసా: కోతికి అంత్యక్రియలు
◆ మంచిర్యాల: చోరీకి పాల్పడిన ముగ్గురు అరెస్ట్
◆ తలమడుగు: పురుగుల మందుతాగి యువకుడు మృతి
◆ పెంచికల్ పెట్ : రోడ్డుపై చేపలు పడుతూ నిరసన
◆ దిలావార్పూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
◆ ఆదిలాబాద్: ప్రాజెక్టులకు జలకళ
◆ పలు చోట్ల ఉప్పొంగిన వాగులు, వంకలు
◆ రెబ్బెన: డ్రంక్ అండ్ డ్రైవ్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రంను ఎస్పీ గౌస్ ఆలం శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న కానిస్టేబుళ్లకు వడ్డించే ఆహారాన్ని స్వయంగా తిని పరిశీలించి వంటలు నిర్వహించే వారికి సూచనలు చేశారు. ఆహారాన్ని నాణ్యతతో కూడిన వస్తువులతో వండాలని సూచించారు. శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు శిక్షణ కాలంలో క్రమం తప్పకుండ హాజరవ్వాలని అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి త్వరలో పర్యటించనున్నారు. కాగా జిల్లాలో సీఎం ప్రారంభించే కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మహిళా శక్తి క్యాంటీన్, ఎంఆర్ఐ మిషన్ ప్రారంభించనున్నారు. అలాగే కేజీబీవీ హైస్కూల్, బంగారి గూడ, కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించనున్నారు. వీటితో పాటు మదర్ పౌల్ట్రీ యూనిట్లను ఓకే చోట బటన్ నొక్కి ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు.
నారాయణపూర్ జీపీలోని రాజుల గూడలో వైద్య సిబ్బంది. బురద రోడ్డులో రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి గ్రామస్తులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 12 మంది రక్తం నమూనాలు సేకరించి, 95 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. గర్భిణీలు, బాలింతలకు రోగ నిరోధక టీకాలు వేశారు. హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కృష్ణ, ఏఎన్ఎం రేణుక, సిబ్బంది పాల్గొన్నారు.
జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన చిందం రాజమౌళి అనే రైతుకు ఇందంపల్లి గ్రామీణ బ్యాంకులో రూ.45 వేల అప్పు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణమాఫీ చేసిన లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆ రైతు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం ప్రెస్ కార్యాలయానికి వచ్చి మీడియాకు తన గోడును వినిపించాడు. అర్హతలు ఉన్నప్పటికీ మాఫీ కాలేదన్నారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 16 మంది నాయకులపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు వారిపై సస్పెన్షన్ విధిస్తూ పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. వేటుకు గురైన వారిలో ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. వారితో పాటు పార్టీ క్రమశిక్షణ చర్యల కింద పలువురు నాయకులకు సైతం బహిష్కరించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.