India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్కు వచ్చిన ఆమెకు పెన్ గంగా గెస్ట్ హౌస్ వద్ద జిల్లా కలెక్టర్ రాజర్షి షా పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం కాసేపు ఇరువురు పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులున్నారు.
ఇంద్రవెల్లి ఏజెన్సీ ప్రాంతంలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత వారం రోజుల క్రితం నార్నూరులోని వ్యాపారి ఇంట్లో, వైన్ షాపులో చోరీ జరగింది. అది మరవకముందే గురువారం రాత్రి ఉట్నూర్ ఎక్స్ రోడ్, లోకారి, ఈశ్వర్ నగర్ వైన్ షాపుల్లో దొంగతనం జరిగింది. శుక్రవారం ఉదయం వైన్ షాపు యజమానులు చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు తెలపడంతో పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,940గా నిర్ణయించారు. సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం ప్రైవేట్ పత్తి ధర రూ.20 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గౌరాపూర్కు చెందిన సక్రి అశ్విని అదృశ్యమైనట్లు 2 టౌన్ ఎస్ఐ విష్ణుప్రకాశ్ తెలిపారు. బుధవారం ఇంద్రవెల్లి నుంచి మహారాష్ట్రలోని పూణేకు వెళ్లేందుకు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది. వారందరు రైలు ఎక్కగా, ఆమెతో పాటు కుమార్తె పియు కనిపించకుండా పోయారు. దీంతో భర్త గోరక్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
స్కౌట్స్&గైడ్స్ వ్యవస్థాపకుడు బేడెన్ పావెల్ దంపతుల జన్మదిన పురస్కరించుకొని ఈనెల 22న ADBలోని స్కౌట్స్&గైడ్స్ కార్యాలయ ఆవరణలో ‘థింకింగ్ డే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈఓ ప్రణీత తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు చెందిన స్కౌట్స్ మాస్టర్లు, గైడ్ క్యాప్టెన్లు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ ఆన్ డ్యూటీ సౌకర్యం ఉంటుందన్నారు.
తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ఈనెల18న మహేందర్ని అతడి బామ్మర్ది అశోక్ హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడైన అశోక్ను పట్టుకొన్నట్లు ADBడీఎస్పీ జీవన్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 48 గంటల్లోనే పట్టుకుని నిందితుడిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు రూరల్ సీఐ ఫణిందర్ తెలిపారు. కార్యక్రమంలో తలమడుగు ఎస్సై బి.అంజమ్మ ముజాహిద్ పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షిషా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో టీఎన్జీవో నూతన జిల్లా డైరీని అదనపు కలెక్టర్ శ్యామలాదేవితోపాటు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడారు. ఉద్యోగులు సమష్టిగా పని చేస్తూ జిల్లాను ప్రగతి పథంలో ముందు ఉంచాలని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా అధికారులతో కలెక్టర్ రాజర్షిషా గురువారం గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమీక్షించారు. ప్రజాపాలన, గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయని వారు కొత్త రేషన్ కార్డ్, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుటకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు సమ్మర్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలని RWS అధికారులను ఆదేశించారు.
ఆధార్ సర్వర్ పునరుద్ధరణ అయినట్లు, ఈనెల 21 శుక్రవారం నుంచి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు జరుపనున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి గజానంద్ తెలిపారు. నాణ్యమైన పత్తిని మాత్రమే సీసీఐ వారు కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. కౌడి పుచ్చుకాయ నిమ్ము పత్తిని సీసీఐ వారు కొనుగోలు చేయరన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి మార్కెట్ యార్డ్ సహకరించాలని కోరారు.
గ్యాస్ ఏజెన్సీలతో ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్శి షా తన ఛాంబర్లో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా గ్యాస్ సబ్సిడీ అందిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సబ్సిడీ అందని లబ్ధిదారుల వివరాలు తెలుసుకొని పలు సూచనలు చేశారు. లబ్ధిదారులకు సబ్సిడీ ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీ శ్యామల దేవి, అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.