India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ జిల్లాలోని రెసిడెన్షియల్, కేజీబీవీ, ఆదర్శ, ప్రైవేట్ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న వృక్షశాస్త్రం,జంతుశాస్త్ర అధ్యాపకులు ఇంటర్మీడియట్ రెండో విడత మూల్యాంకనంలో పాల్గొనాలని DIEO జాధవ్ గణేశ్ సూచించారు. ఈ నెల 23న జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఈ నెల 24 భౌతిక శాస్త్రం, అర్థశాస్త్రం మూల్యంకనం జరుగుతుందన్నారు. అధ్యాపకులు రిపోర్ట్ చేయాలని కోరారు.
ఆదిలాబాద్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్లో ఈ నెల 24న TSKC ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత, TSKC కోఆర్డినేటర్ డా.శ్రావణి, ప్లేస్మెంట్ సెల్ కోఆర్డినేటర్ మంజుల తెలిపారు. HDFC Bank & Axis Bankలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయన్నారు. ఏదైనా డిగ్రీ ఉండి 30ఏళ్లలోపు వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ADB జిల్లా తలమడుగు మండలం సుంకిడిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన కుమ్మరి లింగన్న(48) ఐదెకరాల్లో పత్తి పంట వేశాడు. రెండేళ్లుగా పంట దిగుబడి రాకపోవడంతో సుమారు రూ.3 లక్షల వరకు అప్పులయ్యాయి. దీంతో పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లక్ష్మీ, ఇద్దరు కుమారులున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మావల సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి బైక్, లారీ, కారు ఇలా ఒకదానినొకటి ఢీకొన్నాయి. గమనించిన స్థానికులు గాయపడ్డ వారిని అంబులెన్స్లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్న దేవేందర్గా ఒకరిని గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సోనాలలోని ఓ పాఠశాలలో శుక్రవారం రాత్రి జరిగిన వార్షికోత్సవంలో మై విలేజ్ షో యూ ట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పాల్గొని సందడి చేశారు. గంగవ్వను చూడడానికి ప్రేక్షకులు దండెత్తారు. ప్రేక్షకులతో మై విలేజ్ షో యూట్యూబ్లో చేసిన అనుభవాలను పంచుకున్నారు. గంగవ్వతో సెల్ఫీలు దిగడానికి యువత ఆసక్తి కనబరిచారు.
ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన శుక్రవారం DCC/DLRS సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఎం ఈజీపీ, ఎస్సీ కార్పొరేషన్, మహిళా శక్తి పథకం, తదితర వాటిపై బ్యాంకర్లు, అధికారులతో వారి శాఖల లక్ష్యంపై సమీక్షించారు. పెండింగ్ అప్లికేషన్స్ లబ్ధిదారులతో ఈ నెల 24న సమావేశం నిర్వహించి వివరాలు సేకరించాలని, బ్యాంకు వారితో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని జనరల్ మేనేజర్, పరిశ్రమల శాఖ అధికారిని ఆదేశించారు.
ఆదిలాబాద్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్లో ఈ నెల 24న TSKC ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత, TSKC కోఆర్డినేటర్ డా.శ్రావణి, ప్లేస్మెంట్ సెల్ కోఆర్డినేటర్ మంజుల తెలిపారు. HDFC Bank & Axis Bankలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయన్నారు. ఏదైనా డిగ్రీ ఉండి 30ఏళ్లలోపు వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో హమాలీల సమస్యలు, లైసెన్స్లపై శుక్రవారం కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించి కమిటీతో చర్చించారు. వ్యవసాయ కమిటీల్లో హమాలీలకు కొత్తగా లైసెన్సులు ఇచ్చేందుకు జిల్లా స్థాయి సమీక్షా నిర్వహించారు. హమాలీ లైసెన్సులు జారీ చేసేందుకు పేపర్ ప్రకటన ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఎంపిక ప్రక్రియను మార్చి చివరిలోగా పూర్తి చేయాలని వ్యవసాయ కమిటీల అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు శుక్రవారం ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేశ్ హాజరయ్యారు. తెలంగాణకు చెందిన పార్లమెంట్ సభ్యులు, ఒడిశా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, గోవా అండమాన్, నికోబార్ దీవులు, దాద్రా& నగర్ హవేలీ, డామన్ & డయ్యూ, లక్షద్వీప్ ఇతర రాష్ట్రాల కీలక అంశాలపై చర్చించారు.
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాలలో నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. గ్రామం నుంచి 4 KM దూరంలో ఉన్న వాగు వద్ద బోర్వెల్ వేసి అక్కడి నుంచి పైపు లైన్ ద్వారా గ్రామంలోని GLSR ట్యాంకుకు నీరు సరఫరా చేస్తామన్నారు. రోజు ఉదయం 7గంటలకు, సాయంత్రం 6 గంటలకు 10,000 లీటర్ల నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.