Adilabad

News July 15, 2024

ఆదిలాబాద్: ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు

image

అనాథ విద్యార్థుల చదువుల కోసం ఆదిలాబాద్ జకాత్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు ట్రస్ట్ ఇన్స్‌పెక్టర్ అబ్దుల్ రహీం పేర్కొన్నారు. నర్సరీ నుంచి పీజీ విద్య వరకు అర్హులైన అనాథ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వృత్తి విద్య చదివే నిరుపేద విద్యార్థులు సైతం ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. వివరాల కోసం 93980 71197కి సంప్రదించాలని సూచించారు.

News July 15, 2024

నిర్మల్: ప్రతి హాస్టల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి: కలెక్టర్

image

వసతి గృహ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాల రిపోర్టులను సమర్పించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. వర్షాకాల నేపథ్యంలో ప్రతి హాస్టల్లో వైద్య శిబిరాలు నిర్వహించి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు చికిత్సలు చేసి, అవసరమైన మందులను అందించాలని అన్నారు. వసతి గృహలలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక విశ్రాంతి హాలును ఏర్పాటు చేయాలన్నారు.

News July 15, 2024

ఆదిలాబాద్: ‘కేటాయించిన లక్ష్యాలను సాధించాలి’

image

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులుగా నియమించబడిన అధికారులు ఫీల్డ్ విజిట్ చేయాలని, రోజువారి నివేదిక టూర్ డైరీ మెయింటెన్ చెసి ప్రతీ నెల 5లోగా రిపోర్ట్ సమర్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వన మహోత్సవం సందర్భంగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రతీ రోజూ నాటిన మొక్కల వివరాలను పోర్టల్‌లో అప్ లోడ్ చేయాలని అన్నారు.

News July 15, 2024

ఆదిలాబాద్: ప్రజావాణికి 100 దరఖాస్తులు

image

ప్రజావాణి సందర్భంగా సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల అర్జీలనుపరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం వంద దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

News July 15, 2024

ఆదిలాబాద్: భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం

image

భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బేల మండలంలో చోటుచేసుకుంది. సైద్పూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుటుంబకలహాల కారణంగా తన భార్య సునీతను కత్తితో పొడిచి దారుణంగా హత్యచేశాడు. అనంతరం తానూ కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. అతడి పరిస్థితి విషమంగా ఉందన్నారు. పోలీసులకు, అంబులెన్సుకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.

News July 15, 2024

ఉమ్మడి ADB జిల్లాలో 5 ICTC కేంద్రాలు మూసివేత

image

హేతుబద్ధీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎయిడ్స్‌ పరీక్ష కేంద్రాలను మూసివేసింది. తొలి విడుతలో చెన్నూర్‌, మందమర్రిలో గల ఇంటిగ్రేటెడ్‌ కౌన్సెలింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ICTC) కేంద్రాలు మూసివేశారు. కాగా ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో చెన్నూర్‌, మందమర్రి, ఆదిలాబాద్‌, ఖానాపూర్‌, ముధోల్‌లో కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో HIV పరీక్షలకు చేయించుకునేందుకు ప్రజులు, గర్భిణులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.

News July 15, 2024

నిర్మల్: నాఖాబందిలో 664 కేసులు నమోదు

image

నిర్మల్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాల మేరకు శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన నాకాబంది(ప్రత్యేక తనిఖీ)లో మొత్తం 664 కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాటిలో హెల్మెట్ లేనివారు 565, డ్రైవింగ్ లైసెన్స్ 7, సీట్ బెల్ట్ 5, రాంగ్ డ్రైవింగ్ 9, ట్రిపుల్ డ్రైవింగ్ 7, నంబర్ ప్లేట్ 66, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ 2, మైనర్ డ్రైవింగ్ 2 కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు.

News July 15, 2024

ADB: నేడు JOBS కోసం ఇంటర్వ్యూలు

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. విద్యాలయంలో సంగీతం/నృత్యం, టీజీటీ సంస్కృతం, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్ విభాగాల్లో నాలుగు పోస్టులు ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈరోజు ఉదయం నిర్వహించే ఇంటర్వ్యూలకు ద్రువపత్రాలతో హాజరుకావాలని ఆమె సూచించారు.

News July 14, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లో నేటి ముఖ్యాంశాలు

image

★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొహారం ఉత్సవాలు
★ ఆదిలాబాద్‌లో హైడ్రామా
★ దస్తురాబాద్: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
★ భీమిని: నిషేధిత గడ్డి మందు పట్టివేత
★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల సందడి
★ తాంసి: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
★ భైంసా: దాబాల్లో పోలీసుల దాడులు.. మద్యం స్వాధీనం
★ ఉమ్మడి వ్యాప్తంగా కురిసన వర్షం
★ నిర్మల్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం.

News July 14, 2024

నిర్మల్: 35 కిలోమీటర్లు పరుగెత్తిన డాక్టర్

image

రన్నింగ్‌తో మానసిక ప్రశాంతత లభిస్తుందని నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. ప్రజల్లో రన్నింగ్ పై అవగాహన పెంచేందుకు ఆయన ఆదివారం నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు సుమారు 35 కిలోమీటర్ల దూరం పరుగెత్తారు. ప్రతి వ్యక్తికి వ్యాయామం అవసరమని, దాని ద్వారా క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.