India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి ఐదుగురు జూదరులను అరెస్ట్ చేసినట్లు సీఐ రాణాప్రతాప్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ మండలం బూరుగూడ శివారులో జూదం ఆడుతున్నరనే సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద రూ.13,800 నగదు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు వెల్లడించారు.
డిగ్రీ కళాశాలలో చేరేవారికి విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. DOST ద్వారా మూడు విడతల్లో సీట్లు పొంది కాలేజీల్లో స్వయంగా రిపోర్టింగ్ చేయాల్సిన గడువు నిన్నటితోనే ముగియాల్సి ఉంది. అయితే విద్యార్థుల విన్నపం మేరకు ఈ నెల 18 వరకు గడువు పొడగించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. SHARE IT
పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన తుప్ప నరేశ్ (36) కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్య, అప్పుల బాధ తట్టుకోలేక శుక్రవారం సాయంత్రం పురుగు మందు తాగగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం ఆసుపత్రిలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య రజిత, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
లక్ష్మణచందా మండలంలోని వడ్యాల్ సమీపంలో గల సరస్వతి కెనాల్ పై ఉన్న ఆయకట్ట బ్రిడ్జి గురువారం కుప్పకూలింది. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరినా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు బ్రిడ్జి కూలిపోవడంతో ఆయకట్టు కింద ఉన్న రైతులు తమ పొలాలకు ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొని త్వరగా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
జిల్లాలో 468 జీపీలు ఉన్నాయి. పంచాయతీల్లో పైసల్లేకుండా పోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో GPల ఖజానా నిండుకుంది. ఓ వైపు ట్రాక్టర్ల కిస్తీలు పేరుకుపోతుండగా మల్టీపర్పస్ కార్మికులకు నెలల తరబడి జీతాలివ్వలేని దుస్థితి. ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఆదాయం కలిగిన, మేజర్ జీపీలను మినహాయిస్తే చిన్న పంచాయతీల్లో పాలన కార్యదర్శులకు పెనుభారంగా మారుతోంది.
లక్ష్మణచందా మండలంలోని వడ్యాల్ సమీపంలో గల సరస్వతి కెనాల్ పై ఉన్న ఆయకట్ట బ్రిడ్జి గురువారం కుప్పకూలింది. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరిన అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు బ్రిడ్జి కూలిపోవడంతో ఆయకట్టు కింద ఉన్న రైతులు తమ పొలాలకు ఎలా వెళ్లి పండించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొని త్వరగా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
జన్నారం మండలం టీజీపల్లె వద్ద శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల వైపు నుంచి ఉట్నూరు వైపు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న నలుగురిలో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని 108 సిబ్బంది. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే శుక్రవారం పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
చెన్నూర్ పట్టణంలో నూతనంగా రూ.1.90 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన 33/11 కేవి విద్యుత్తు ఉప కేంద్రాన్ని శుక్రవారం ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డ వివేక్ వెంకటస్వామిలు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. విద్యుత్తు ఉప కేంద్రంలో శాఖ సిబ్బందికి అన్ని ఏర్పాట్లను త్వరలో పూర్తి చేస్తామని హామిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చాత గ్రామానికి చెందిన చందుల సాయిలు గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై మద్యం మత్తులో పరుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుని కుమారుడు అంజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.