Adilabad

News July 12, 2024

జైపూర్: ఉరివేసుకొని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

image

జైపూర్ మండలం మిట్టపల్లిలోని కొమ్ముగూడెనికి చెందిన డిగ్రీ విద్యార్థిని సెగ్యం భాగ్యలక్ష్మి (18) గ్రామ సమీపంలోని మామిడి తోటలో గురువారం రాత్రి చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సెగ్యం రమేశ్-శ్రీలత దంపతుల కూతురుభాగ్యలక్ష్మి జిల్లా కేంద్రంలో డిగ్రీ చదువుతుంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 12, 2024

KGNR: ముగ్గురు విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయురాలు

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఓ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వారికి ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే పాఠాలు బోధిస్తోంది. కాగజ్‌నగర్ మండలం నజ్రుల్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక ప్రైమరీ బెంగాలీ పాఠశాలలో ఒకప్పుడు 13 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ఆరెగూడ పాఠశాలలో పనిచేస్తున్న సంధ్యారాణికి డిప్యూటేషన్ ఇవ్వడంతో ఆమె ఈ పాఠశాలలోని ముగ్గురు విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.

News July 11, 2024

ఆదిలాబాద్: ఫీజు చెల్లింపు గడువు మరోసారి పొడిగింపు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. జూలై 12 వరకు గడువు ఉండగా ఈనెల 31 వరకు పొడగించినట్లు తెలిపారు. మీసేవ, TG ఆన్‌లైన్ సెంటర్‌లలో ఫీజు చెల్లించవచ్చన్నారు. PG రెండో సంవత్సర పరీక్షలు జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు, PG మొదటి సంవత్సరం పరీక్షలు ఆగస్టు 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News July 11, 2024

ADB: SC స్టడీ సర్కిల్ నుంచి 36 మంది గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపిక

image

ఇటీవల విడుదలైన గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాల్లో ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి 36 మంది అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించి మెయిన్స్‌కి ఎంపికైనట్లు స్టడీ సర్కిల్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ డాక్టర్ రమేష్ పేర్కొన్నారు. ఈ విజయానికి కారణం అత్యుత్తమ అధ్యాపక బృందం, రాష్ట్ర డైరెక్టర్, జిల్లా కలెక్టర్, జిల్లా షెడ్యూల్ అభివృద్ధి అధికారి సునీత ప్రోత్సాహంతో ఈ ఫలితాలు సాధించామని ఆయన పేర్కొన్నారు.

News July 11, 2024

రైతుల ఆలోచనే ప్రభుత్వ ఆలోచన: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

image

రైతుల ఆలోచనే ప్రభుత్వ ఆలోచన అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఉట్నూర్ పట్టణంలోని కేబీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. రైతులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పవచ్చని అన్నారు.

News July 11, 2024

ADB: గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ జాబితా

image

జిల్లా పంచాయతీ శాఖలో పనిచేసే గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ జాబితాను అధికారులు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 320 మంది గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. ఇందులో 245 మంది నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. వీరిలో 40% మాత్రమే బదిలీచేయాలనే నిబంధనల మేరకు 128 మందిని అర్హులుగా గుర్తించారు. సంబంధిత సీనియారిటీ జాబితా సిద్ధం చేసిన అధికారులు కలెక్టర్ అనుమతితో నోటీస్ బోర్డుపై ఉంచారు.

News July 11, 2024

జైపూర్: KGBV నుంచి హైదరాబాద్‌కు పారిపోయిన విద్యార్థినులు

image

KGBV నుంచి ఇద్దరు విద్యార్థినులు పారిపోగా పోలీసులు వీరిని హైదరాబాదులో గుర్తించారు. జైపూర్ KGBV నుంచి ఇద్దరు విద్యార్థినులు బుధవారం ఉదయం 3 గంటలకు పారిపోయారని అధికారిణీ శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఈమేరకు దర్యాప్తు ప్రారంభించి CC కెమెరాలను పరిశీలించి భాగ్యనగర్ రైల్లో హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తించామని శ్రీరాంపూర్ CI. మోహన్, SI.రాములు తెలిపారు.

News July 11, 2024

పంచాయతీరాజ్ పర్యవేక్షకులకు స్థానచలనం

image

ఆదిలాబాద్ జిల్లాలో వివిధ చోట్ల పనిచేస్తున్న 11 మంది పంచాయతీరాజ్ పర్యవేక్షకులకు స్థానచలనం కలగనుంది. జోనల్ స్థాయిలో జరిగే ఈ బదిలీల్లో జడ్పీ నుంచి వివరాలు ఉన్నతాధికారులకు నివేదించగా ఉద్యోగుల పేర్లతో జాబితాను పంపించారు. ఎక్కడైనా అయిదు చోట్ల ప్రాధాన్యం వారీగా వీరు ఖాళీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీరితోపాటు జోనల్ స్థాయి పోస్టులైన పీఆర్ సీనియర్ అసిస్టెంట్లు ఏడుగురు బదిలీ కానున్నారు.

News July 11, 2024

నేడు ఆదిలాబాద్ జిల్లాకు నలుగురు మంత్రులు

image

ఆదిలాబాద్ జిల్లాలో నేడు నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. ఉట్నూరులో నిర్వహించే రైతు భరోసా ప్రజాభిప్రాయ సేకరణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి తుమ్మల, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి సీతక్క హాజరుకానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ తెలిపారు. మండల కేంద్రంలోని KB కాంప్లెక్స్ లో ఉ.10.30కు నిర్వహించే ఈ సభలో వీరు పాల్గొంటారు.

News July 11, 2024

ఆదిలాబాద్ జిల్లాలో 15 పాఠశాలలు మూత

image

ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 15 పాఠశాలలు పదోన్నతుల ప్రక్రియ తర్వాత మూతబడ్డాయి. జిల్లాలోని 12 మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఆయా పాఠశాలల్లో అత్యల్పంగా 10 మంది విద్యార్థులు ఉంటే.. అత్యధికంగా 50 మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖవర్గాలు చెబుతున్నాయి. మరో వైపు 80 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. అత్యవసర సమయంలో ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఆయా పాఠశాలలకు అనధికారిక సెలవు ప్రకటించాల్సిందే.