India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న బంజారా ఉద్యోగ, ఉపాధ్యాయులకు శనివారం స్పెషల్ క్యాజువల్ సెలవు ఇస్తున్నట్ల ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. బంజారా ఉపాధ్యాయ సోదరులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.
పాఠశాలల అభివృద్ధి కోసం పీఎంశ్రీ కింద మంజూరైన నిధులు సద్వినియోగం చేసుకుని పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా విద్యా శాఖ అధికారులను సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్లోని తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు. కిచెన్ షెడ్, డార్మిటరీ, డైనింగ్ హాల్, తదితర వాటిని పరిశీలించి, పాఠశాలకు అవసరమైన మరమ్మతుల కోసం అంచనాల నివేదిక సమర్పించాలని ప్రిన్సిపల్ సూచించారు.
TUTF సంఘం నాయకుల ప్రాతినిధ్యం మేరకు పదో తరగతి మూల్యాంకన విధుల నుంచి అన్ని ఉపాధ్యాయ సంఘాల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులను తొలగిస్తూ శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత ఉత్తర్వులు జరిచేసినట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, జలంధర్ రెడ్డి పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవిని కలిసి సమస్యను విన్నవించగా విద్యాశాఖ అధికారికి తగిన చర్యలు తీసుకోమని ఆదేశించినట్లు తెలిపారు.
ఆదిలాబాద్ కేంద్రీయ విద్యాలయంలో పలు టీచర్ పోస్టుల కోసం అర్హత గల అభ్యర్థులకు ఈనెల 27న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. TGT (హిందీ, ఇంగ్లీష్, సోషల్ సైన్స్, గణితం, సైన్స్ సంస్కృతం), PRT, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, కౌన్సెలర్, స్టాఫ్ నర్సు, స్పెషల్ ఎడుకేటర్, సంగీతం/డ్యాన్స్ టీచర్, రీజినల్ లాంగ్వేజ్ (తెలుగు) టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పేర్కొన్నారు. ఉట్నూర్లోని కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమై ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని, BRS తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు.
ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.
రాష్ట్ర UIDAI ఆఫీస్ హైదరాబాద్ ప్రాజెక్ట్ మేనేజర్ నరేశ్ చంద్ర గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలోని ఆధార్ సెంటర్, ఈ సేవా ఆధార్ సెంటర్ని తనిఖీ చేశారు. ఆధార్ ఎన్రోల్మెంట్ వివరాలను, రికార్డ్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. తనిఖీలో EDM రవి, మీసేవ ఫ్రాంచైజీ ఓనర్ తన్వీర్, జోగు సాగర్, స్వాగత, దయాకర్, శేషగిరి ఉన్నారు.
సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్కు చెందిన 18 నెలల విహాంత్ అనే బాలుడికి పాము కాటు వేయడంతో గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఆరుబయట అక్కతో ఆడుకుంటున్న విహాంత్ ఇంటి పక్కన ఉన్న పొద నుంచి వచ్చిన పాము బాలుణ్ని కాటు వేసింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్ను ఎంపీ నగేశ్ ఢిల్లీలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ నుంచి ADB వరకు వయా నిర్మల్ రైల్వేలైన్, నాందేడ్ నుంచి కొన్ని రైళ్లను ADB వరకు పొడిగించాలని కోరారు. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను సిర్పూర్(టి) వరకు పొడిగించాలని, కాజీపేట నుంచి హౌరాకు పెద్దపల్లి, మంచిర్యాల, కాగజ్నగర్ మీదుగా కొత్త రైలు వేయాలని కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు నగేశ్ పేర్కొన్నారు.
జైనథ్, భోరజ్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పార్డి (బి)లో అక్రమంగా దేశీదారు అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 46 దేశీదారు బాటిల్లు, టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. అక్రమంగా దేశీదారు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.