India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిర్మల్ సహాయక ఎస్పీగా తొలి పోస్టింగ్ చేపట్టిన జితేందర్ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. ఆయన ఇక్కడ ఏఎస్పీగా 6 జనవరి 1995 నుంచి 12 డిసెంబరు 1995 వరకు పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు.. నిర్మల్ ఏఎస్పీగా ఉన్న సమయంలో ఆయన వివాహం జరిగింది. ఏడాదిపాటు పనిచేసిన ఆయన శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతో కృషి చేసినట్లు ఆయనతో కలిసి విధులు నిర్వర్తించిన పోలీసులు వెల్లడించారు.
వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వాహనాన్ని సీజ్ చేయటంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఆదిలాబాద్ DSP జీవన్ రెడ్డి హెచ్చరించారు. ట్రాఫిక్ CI ప్రణయ్ కుమార్, SI ముబీన్తో కలిసి DSP పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. గత వారం రోజుల్లో 321 వాహనాలను సీజ్ చేశామన్నారు. తాజాగా బుధవారం 55 వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
గ్రూప్-I మెయిన్స్ కొసం ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గ్రూప్-I మెయిన్స్కు అర్హత పొందిన అభ్యర్థులు https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce లో జులై 19 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ ఈనెల 22 నుంచి 75 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. హైదరాబాద్లో 150, ఖమ్మంలో 150 మందికి శిక్షణ ఇవ్వనున్నారు.
తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులపై దృష్టి సారించారు CM రేవంత్ రెడ్డి. అదిలాబాద్ జిల్లాలో ఈనెల చివరి వారంలో ప్రాజెక్టుల సందర్శన పేరిట పర్యటించనున్నారు. సదర్మాట్, మత్తడి వాగు ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించి 2025 మార్చిలోగా పనులు పూర్తి చేసేందుకు నిర్ణయించారు. సీఎంతో పాటు ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క కూడ ఇదే జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.
హాస్టల్ నుంచి తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లడం లేదంటూ విద్యార్థిని భవనం పైనుంచి దూకిన ఘటన నస్పూర్లో చోటుచేసుకుంది. కస్తూర్బాలో 6వ తరగతి చదువుతున్న అక్షర అనే బాలిక తను హాస్టల్లో ఉండనని ఇంటికి తీసుకువెళ్లాలంటూ తల్లిదండ్రులను కోరింది. అందుకు వారు నిరాకరిస్తూ హాస్టల్లోనే ఉంటూ చదవాలన్నారు. దీంతో మనస్తాపానికి గురైన అక్షర హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద రూ.500 వంట గ్యాస్ సిలిండరు ప్రభుత్వం అందజేస్తోంది. జిల్లాలో పథకం కోసం సుమారు 3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వివరాలు సక్రమంగా ఉండి LPG సిలిండర్లు ఉన్నవారికి ఇప్పటి వరకు జిల్లాలో 94వేల మంది లబ్ది పొందారని జిల్లా పౌరస రఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. సబ్సిడీని డీబీటీ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు.
జిల్లా పంచాయతీ శాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. బాసర జోన్ పరిధిలో జరిగే గ్రేడ్-1, 2, 3 కార్యదర్శుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేసిన అధికారులు మంగళవారం ప్రకటించారు. గ్రేడ్-1లో ఎనిమిది మందికి గాను ఒకరు, గ్రేడ్-2లో 09 మందికి నలుగురు, గ్రేడ్-3లో 57 మందికి 41 మంది నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. వీరు తప్పనిసరిగా బదిలీపై వెళ్లనున్నారు. ఈమేరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు.
మంచిర్యాలలోని ఒక రెస్టారెంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు ఆదేశాలతో మంగళవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరి వద్ద నుంచి రూ.1 లక్ష 78 వేలు నగదు స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు సమాచారం.
నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాని వెల్లడించింది. నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సరైనా వర్షాలు లేక జిల్లాలోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి.
ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2015 బ్యాచ్కు చెందిన బీ.కాం. విద్యార్థి యోగేంద్రసింగ్ జూనియర్ లెక్చరర్ల పోస్టులకు జరిగిన పరీక్ష ఫలితాలలో హిందీ సబ్జెక్టులో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ప్రిన్సిపల్ డాక్టర్ అచ్చి శ్రీనివాస్, కామర్స్ ప్రిన్సిపల్ డాక్టర్ జలగం అనిత, తన హిందీ గురువు T. ప్రతాప్ సింగ్, అధ్యాపకులు జగరామ్, దయాకర్ యువకుడిని సన్మానించి అభినందించారు.
Sorry, no posts matched your criteria.