Adilabad

News July 7, 2024

ఇంద్రవెల్లి: బావిలో పడి బాలుడి మృతి

image

ఇంద్రవెల్లి మండలంలోని దొడంద గ్రామానికి చెందిన పంద్రా బండు(16) శనివారం ఉదయం బహిర్భూమికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు అతడిని వెతికినా ఫలితం దక్కలేదు. కాగా ఆదివారం ఉదయం పంద్రా.. స్థానికులకు బావిలో శవమై కనిపించాడు. వారు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా చేశారు.

News July 7, 2024

2వ రోజు 231 మంది సర్టిఫికెట్ వెరీఫికేషన్ పూర్తి

image

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌లో ప్రవేశించేందుకు ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా 2వ రోజు ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ లో సర్టిఫికెట్ వేరిఫికేషన్ ప్రక్రియ కొనసాగింది. రెండవ రోజు 280 మంది అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోగా 231మంది హాజరై సర్టిఫికెట్ వేరిఫికేషన్ పూర్తి చేసుకున్నారని కోఆర్డినేటర్ వీరస్వామి తెలిపారు

News July 7, 2024

పెంచికల్పేట్‌లో బొలెరో బోల్తా.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెంచికల్పేట్‌లోని మురళిగూడ వద్ద గుట్ట ఎక్కుతున్న క్రమంలో బొలెరో బోల్తా పడింది. అందులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బెజ్జూర్ నుంచి సిమెంట్, రేకులు, సిలెండర్లతో పాలు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు, తల్లిదండ్రులతో వాహనం గ్రామానికి వస్తోంది. ఈ క్రమంలో గుట్ట ఎక్కుతుండగా బొలేరో బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది.

News July 7, 2024

మంచిర్యాల: బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్‌.. మహిళ మృతి

image

శ్రీరాంపూర్ పట్టణంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందింది. స్థానిక కృష్ణ కాలనీకి చెందిన శారద ఇంటి ఆవరణలో బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News July 7, 2024

ఆదిలాబాద్: పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. జులై 7 వరకు గడువు ఉండగా ఈనెల 12 వరకు పొడగించినట్లు తెలిపారు. మీసేవ, TG ఆన్‌లైన్ సెంటర్‌లోనే ఫీజు చెల్లించాలన్నారు. PG రెండో సంవత్సర పరీక్షలు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు, PG మొదటి సంవత్సరం పరీక్షలు ఆగస్టు 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News July 7, 2024

ADB: ప్రియురాలి ఇంటికెళ్లి యువకుడి ఆత్మహత్యాయత్నం

image

ప్రియురాలి ఇంటికెళ్లి యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గుడిహత్నూర్‌లో చోటుచేసుకుంది. రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు అరుణ్ కాలనీకి చెందిన యువతని ప్రేమించాడు. యువతి కుటుంబీకులు వారి ప్రేమకు నిరాకరించడంతో శనివారం యువతి ఇంటికి వెళ్లి తనతో తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా యువకుడి పోలీసులు అదుపులోకి తీసుకొని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

News July 7, 2024

కాగజ్‌నగర్‌లో పెద్దపులి సంచారం

image

కాగజ్‌నగర్ అటవీ రేంజ్‌లో పెద్దపులి సంచరిస్తున్నట్లు FRO రమాదేవి తెలిపారు. పట్టణ సమీప గ్రామాలైన అంకుసాపూర్, నందిగూడ, నార్లపూర్, గొంది, చారిగాం, కోసిని, రేగులగూడ, ఊట్పల్లి, వేంపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. పులి కదలికలు, పాదముద్రలు వంటివి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

News July 7, 2024

ఆదిలాబాద్: కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు

image

ఆదిలాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. విద్యాలయంలో సంగీతం/నృత్యం, టీజీటీ సంస్కృతం, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్ విభాగాల్లో 4 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 15న ఉదయం నిర్వహించే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక జిరాక్స్ సెట్‌తో హాజరుకావాలని సూచించారు.

News July 7, 2024

ఆదిలాబాద్: ఆర్టీసీ ప్రయాణికులకు సూచన

image

ఆదిలాబాద్ నుండి హైదరాబాద్, ఆదిలాబాద్ నుంచి గుంటూరు ఒంగోలు సూపర్ లగ్జరీ, లహరి సర్వీసులకు ఒకేసారి పోనురాను టికెట్ బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో 10శాతం రాయితీ పొందవచ్చని RTC డిపో మేనేజర్ కల్పన తెలిపారు. టికెట్ బుకింగ్ కోసం RTC ప్రయాణ ప్రాంగణంలో రిజర్వేషన్ కౌంటర్లో లేదా
www.tsrtconline.in బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని RTC లో సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణం చేయాలని కోరారు.

News July 6, 2024

BREAKING: ADB: డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

image

కేయూ పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. MAY నెలలో 2, 4, 6 సెమిస్టర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. శనివారం ఆరో సెమిస్టర్ ఫలితాలను KU అధికారులు విడుదల చేయగా 2, 4వ సెమిస్టర్ ఫలితాలు మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం
https://www.kuonline.co.in/Result/RS_6TH_MAY2024.aspx లింక్‌ను క్లిక్ చేయాలని సూచించారు. ఈనెల 22 వరకు రివాల్యుయేషన్ కు అవకాశం కల్పించింది.