Adilabad

News July 6, 2024

బాసరలో ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం

image

ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బాసరలో చోటుచేసుకుంది. నిజామాబాద్‌కి చెందిన ఓ మహిళ తన భర్తతో గొడవ పడి మనస్తాపంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లలను గోదావరిలో తోసేందుకు ప్రయత్నించగా స్థానికులు చూసి అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా బాసర ఎస్ఐ గణేశ్ వారిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

News July 6, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు

image

ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక, క్షణికావేశంలో చాలా మంది ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో 93 మంది సూసైడ్ చేసుకున్నారు. రెండు రోజులకు ఓ సూసైడ్ జరుగుతుంది.

News July 6, 2024

ఆదిలాబాద్: మూడు రోజుల పాటు EAMCET కౌన్సెలింగ్

image

ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే తొలి విడత EAMCET కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్ గాంధి పాలిటెక్నిక్ కళాశాలలో ఈ తొలివిడత కౌన్సెలింగ్ జులై 6, 7, 8 తేదీల్లో జరగనుంది. కౌన్సెలింగ్ కు వచ్చే విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, ధృవపత్రాల పరిశీలనకు హాజరయ్యే తేదీ స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు.

News July 5, 2024

ఆదిలాబాద్: ఉచిత సివిల్ శిక్షణకు దరఖాస్తులు

image

రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు 10 నెలల ఉచిత శిక్షణకు గాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ శాఖ అధికారి సునీత, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. ఆసక్తి గలవారు http: //tsstudycircle.co.in వెబ్ సైట్ లో జులై 18 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 5, 2024

చెన్నూరు: కారు, బైక్ ఢీ.. ఒకరి మృతి

image

మంచిర్యాల జిల్లా చెన్నూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి వద్ద ఉన్న పెట్రోల్ బంకు దగ్గర కారు బైక్ కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారని, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ప్రమాద విషయాన్ని పోలీసులకు చేరవేసినట్లు వారు పేర్కొన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 5, 2024

ఆదిలాబాద్: ఉచిత సివిల్ శిక్షణకు దరఖాస్తులు

image

రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు 10 నెలల ఉచిత శిక్షణకు గాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ శాఖ అధికారి సునీత, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. ఆసక్తి గలవారు http: //tsstudycircle.co.in వెబ్ సైట్ లో జులై 18 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 5, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మల్ కాంగ్రెస్ నాయకులు

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిర్మల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విట్టల్ బీఆర్ఎస్‌కి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఆయనతో కలిసి సీఎంను కలిసి శాలువాతో సత్కరించారు. ఇందులో పార్లమెంట్ జిల్లా ఇన్‌ఛార్జ్ సత్తు మల్లేశ్, మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ మాన్ అలీ, తదితరులున్నారు.

News July 5, 2024

జైపూర్: వన మహోత్సవంలో MP, MLA, IAS

image

జైపూర్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ హాజరయ్యారు. అనంతరం మొక్కలను నాటారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కను నాటి ప్రకృతికి అండగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News July 5, 2024

ఆదిలాబాద్: వారికి రేషన్ బియ్యం రాదు

image

బోగస్ ఆహార భద్రత కార్డులను ప్రభుత్వం ఏరివేస్తోంది. రేషన్ డీలర్లకు లబ్ధిదారుల జాబితా పంపించి పరిశీలన ప్రక్రియ చేపడుతోంది. క్షేత్రస్థాయిలో అధికారులతో విచారణ చేయించి బోగస్ కార్డులు రద్దు, అనర్హుల పేర్లు తొలగింపునకు చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు నెలల వ్యవధిలో 89 కార్డులు రద్దు చేయగా, 664 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు.

News July 5, 2024

రాష్ట్ర గవర్నర్ OSDగా మంచిర్యాల జిల్లా వాసి

image

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ OSDగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సిరిశెట్టి సంకీర్తన్ నియామకం అయ్యారు. ఆయన 2020లో IPS శిక్షణ పూర్తి చేసుకుని ములుగు, మధిర జిల్లాలకు ప్రొబెషనరీ IPSగా పని చేశారు. అనంతరం ఏటూరునాగారం ASPగా పనిచేసిన సంకీర్తన్ ఇటీవల గవర్నర్ OSDగా నియమితులయ్యారు. గవర్నర్ OSDగా బాధ్యతలు స్వీకరించడం పట్ల ఆయన తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.