Adilabad

News March 13, 2025

ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

డిగ్రీ పాసైన BC అభ్యర్థులకు బ్యాంకింగ్&ఫైనాన్స్‌లో ఫ్రీ ట్రైనింగ్,ఉద్యోగం కల్పించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా BC అభివృద్ధి అధికారి రాజలి,స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. ట్రైనింగ్ పూర్తైన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్‌మెంట్ కల్పిస్తారన్నారు.అర్హులు ఈనెల 15 నుంచి www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఏజ్ లిమిట్-26లోపు.లాస్ట్ డేట్-ఏప్రిల్ 8. SHARE IT

News March 13, 2025

అంతర్జాతీయ కళాపోటీల్లో ADB వాసికి అవార్డ్

image

దేశంలోని కళాకారులు, 5 దేశాలకు పైగా NRIల మధ్య నిర్వహించిన సెషన్ 16వ అంతర్జాతీయ కళాపోటీల్లో ADB టీచర్స్ కాలనీకి చెందిన గాధరి చంద్రశేఖర్ ప్రతిభ కనబర్చాడు. ఇన్నోవిజే గ్లోబల్ టాలెంట్ సెర్చ్ ర్యాంక్ స్లాట్ ప్రకారం ఐఏసీ నుంచి డ్రాయింగ్, పెయింటింగ్ విభాగంలో ది మెడల్ ఆఫ్ అప్రిషియేషన్‌తో పాటు ది లెటర్ ఆఫ్ రికగ్నిషన్ లెవల్-2లో అవార్డు అందుకున్నాడు. అర్హులైన కళాకారుల్లో ఒకరిగా పేరు సాధించుకున్నారు.

News March 13, 2025

ADB: సెకండియర్ పరీక్షకు 386 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ మ్యాథమెటిక్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షకు మొత్తం 9,088కి 8,702 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ గణేశ్ జాదవ్ తెలిపారు. 386 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

News March 12, 2025

‘ప్రశక్తి’ అవార్డుకు నార్నూర్ ఎంపిక

image

దేశ రాజధాని ఢిల్లీ నుంచి DAPRG అదనపు కార్యదర్శులు కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ బ్లాక్‌లలో అమలు చేసిన చర్యలు, ముఖ్య విజయాలను స్క్రీనింగ్ కమిటీకి కలెక్టర్ సమర్పించారు. దీంతో నార్నూర్ బ్లాక్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం కేటగిరిలో ప్రధానమంత్రి ‘ప్రశక్తి’ అవార్డు-2024 రెండో రౌండుకు ఎంపికైందన్నారు.

News March 12, 2025

గ్రూప్‌2 ఫలితాల్లో.. ADB వాసికి STATE 5TH ర్యాంక్

image

గ్రూప్‌2 ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకులు సత్తా చాటారు. ఇందులో భాగంగా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన చింతలపల్లి వెంకట్ రెడ్డి కుమారుడు చింతలపల్లి ప్రీతంరెడ్డి గ్రూప్‌2 ఫలితాల్లో 431 మార్కులు సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు స్థానంలో నిలిచారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు.

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. ఆదిలాబాద్‌కు ఏం కావాలంటే..!

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కోరాట చనాక ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించి పూర్తిచేయాలని, కుప్టి ప్రాజెక్ట్‌ ప్రారంభించాలని కోరుతున్నారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించి పునఃప్రారంభిస్తే ఎందరికో ఉపాధి దొరుకుతుంది. బోథ్‌కు రెవెన్యూ డివిజన్ ప్రకటనపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

News March 12, 2025

గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటిన ADB బిడ్డ

image

బజార్హత్నూర్‌కు చెందిన బిట్లింగ్ లక్ష్మణ్, నీల దంపతుల కుమారుడు ఉదయ్ 404 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 51వ ర్యాంక్ సాధించి తమ ప్రతిభ కనబర్చారు. ఉదయ్ పంచాయతీ కార్యదర్శి, ఫారెస్ట్ బీట్ అధికారి, వీఆర్వో, గ్రూప్ -4, సింగరేణి (ఎస్‌సీ‌సీ‌ఎల్ )జాబ్ సంపాదించి మరోపక్క గ్రూప్‌2కు సన్నద్ధమయ్యాడు. మంగళవారం వెలువడిన గ్రూప్‌2 ఫలితాల్లో ఉద్యోగం సాధించడం పట్ల అభ్యర్థుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

News March 12, 2025

ఆదిలాబాద్: ఏసీబీ రైడ్ UPDATE

image

ADBలో ACB దాడుల్లో అవినీతి అధికారి పట్టుబడిన విషయం తెలిసిందే. స్థానిక మైనార్టీ రెసిడెన్షియల్ భవనానికి రూ.2 కోట్లు మంజూరైతే ఒక శాతం లంచం ఇవ్వాలని ఎడ్యుకేషనల్ & వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జిన్నంవార్ శంకర్ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ACBని ఆశ్రయించాడు. రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా శంకర్‌ను పట్టుకొని కరీంనగర్ కోర్టులు హాజరుపర్చారు.

News March 12, 2025

అట్టుడుకుతున్న ADB.. 40డిగ్రీల టెంపరేచర్

image

వేసవి ప్రారంభం ముందే ఆదిలాబాద్ జిల్లా ఉష్ణోగ్రతలతో అట్టుడుకుతోంది. జిల్లాలో నిత్యం 39డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారు. మహారాష్ట్రకు సరిహద్దయిన గాదిగూడ మండలంలో మంగళవారం 40డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా పక్క మండలమైన నార్నూర్‌లో 39డిగ్రీలు నమోదైంది. ఉదయం 10 నుంచే వేడిమి పెరగడంతో బయటకు వెళ్లలేకపోతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

News March 12, 2025

ADB: LRS పై 25% రాయితీ: కలెక్టర్

image

ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుం మార్చి 31లోపు చెల్లించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుడికి ప్రొసీడింగ్ కాపీని కలెక్టర్ అందజేశారు. 25% రాయితీతో ప్రభుత్వం ఇచ్చిన సదవాకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు ఉన్నారు.