Adilabad

News October 7, 2025

5-17 వయసు వారికి ఉచితం: ADB కలెక్టర్

image

17 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌కు అక్టోబర్ 1 నుంచి ఎలాంటి రుసుము తీసుకోవడం లేదని
UIDAI తెలిపిందని కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని గమనించి ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. 17 ఏళ్లు దాటినా వారందరికి రూ.125 వసూలు చేస్తారని తెలిపారు.

News October 7, 2025

ADB: జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు ఫ్యాన్ పేజెస్

image

స్థానిక సంస్థల ఎన్నికలు వినూత్న ప్రచారానికి వేదికగా మారాయి. ఇప్పటివరకు సెలబ్రిటీలు పెద్దసాయి ప్రజాప్రతినిధులకు మాత్రమే పరిమితమైన సోషల్ మీడియా ఫ్యాన్ పేజెస్ పల్లెల్లోకి సైతం విస్తరించాయి. అప్ కమింగ్ జడ్పీటీసీ ఆర్మీ అంటూ ఇన్‌స్టాలో పేజీలు ప్రారంభించారు. తమ నాయకుడు ఎక్కడికి వెళ్లినా వాటిని రిల్స్‌గా మార్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దానికి వచ్చిన లైక్స్, షేర్స్‌ను చూసి మురిసిపోతున్నారు.

News October 7, 2025

ADB: బయటకు ఒకటి.. లోపల ఇంకోటి

image

స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులు భిన్న రీతిలో తమదైన ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ నుంచి తమకే టికెట్ వస్తుందని ఆశిస్తూ ఇప్పటి నుంచే ఓటర్లను కాకా పడుతున్నారు. బయటకు మాత్రం పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నిత్యం ఏదో ఒక ఊరికి వెళ్లి మద్దతును కూడగడుతూ తమకే ఎక్కువ బలం ఉందని అధిష్టానం వద్ద నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

News October 6, 2025

ఎన్నికలకు పూర్తిగా సంసిద్ధమై ఉండాలి: ADB SP

image

రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణ నిర్వహించడానికి ముందస్తు చర్యలో భాగంగా ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విధులు నిర్వహించాలన్నారు. నిజాయితీతో విధులు నిర్వర్తించి ఎన్నికలను సమష్టి కృషితో పూర్తి చేయాలని సూచించారు.

News October 6, 2025

32 ఫిర్యాదులు స్వీకరించిన ఆదిలాబాద్ SP

image

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, సుదూర ప్రాంతాల వారు జిల్లా కేంద్రంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో సమస్యల పరిష్కారానికి ఎస్పీ అఖిల్ మహాజన్‌ను సంప్రదించారు. సోమవారం పోలీస్ ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజల నుంచి 32 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఎస్పీని నేరుగా సంప్రదించాలంటే 8712659973 నంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు.

News October 6, 2025

ADBని విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలి: జోగురామన్న

image

కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిసి పంట నష్టంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జిల్లాను విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి కలెక్టర్ రాజర్షిషాకు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదుతో పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయన్నారు.

News October 6, 2025

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంకండి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీల 2వ సాధారణ ఎన్నికలు-2025 సజావుగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. రీట‌ర్నింగ్ అధికారులు (ROs) స్టేజ్-II, సహాయ రీట‌ర్నింగ్ అధికారులు (AROs) స్టేజ్-I లకు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ జరిగింది. ACLB రాజేశ్వర్‌తో కలిసి కలెక్టర్ పాల్గొని, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు.

News October 6, 2025

ADB: ADHAAR సేవల ఛార్జీల్లో మార్పు

image

యూఐడీఏఐ (UIDAI) ఆధార్ ఎన్రోల్‌మెంట్, అప్‌డేట్ సేవల ధరలను సవరించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎన్రోల్‌మెంట్, మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) (5-17 ఏళ్లు) ఉచితంగా ఉంటాయన్నారు.​ జనగణన వివరాల అప్‌డేట్ (పేరు, చిరునామా)కు రూ.75, ​బయోమెట్రిక్ అప్‌డేట్ (వేలిముద్రలు, కనుపాప)కు రూ.125 ​ఆధార్ ప్రింటవుట్‌కు రూ.40 చెల్లించాలన్నారు. ​ఈ కొత్త ఛార్జీలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు వివరించారు.

News October 6, 2025

ADB: టికెట్ కోసం పోరు.. పార్టీ లీడర్లకు పెద్ద సవాలు

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బడా నేతలకు సవాలుగా మారింది. సర్పంచ్ స్థానానికి ఇద్దరేసి, జడ్పీటీసీ స్థానానికి ముగ్గురు, నలుగురు తమకే టికెట్ ఇవ్వాలంటూ పార్టీ అధిష్ఠానం వెంట పడుతున్నారు. భీంపూర్, ఉట్నూర్, బేల, భోరజ్, జైనథ్, సాత్నాల మండలాల్లో భారీగా పోటీ ఉండటంతో అన్ని పార్టీల జిల్లా నేతలకు తలపోటుగా మారింది. ఒకరికి టికెట్ ఇస్తే మరో ఇద్దరు వ్యతిరేకంగా వ్యవహరిస్తారనే భయం పట్టుకుంది.

News October 6, 2025

క్రమం తప్పకుండా తరగతులకు రావాలి: ADB DIEO

image

దసరా సెలవులు ముగిశాయని.. ఇంటర్ జూనియర్ కళాశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతున్నట్లు ఆదిలాబాద్ DIEO జాధవ్ గణేశ్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థులు తరగతులకు క్రమం తప్పకుండా హాజరుకావాలని సూచించారు. ముఖ గుర్తింపు (Face Recognition) సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేస్తామన్నారు. ఈ హాజరును అంతర్గత, ప్రాక్టికల్ IPE 2026 థియరీ పరీక్షలలో పరిగణలోకి తీసుకుంటామన్నారు.