Adilabad

News July 5, 2024

భీంపూర్: ఐదు తరగతులు.. ఒకే ఉపాధ్యాయుడు

image

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గాం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఐదు తరగతులకు కలిపి మొత్తం 81 మంది విద్యార్థులు ఉండగా.. ఒకే ఒక్క ఉపాధ్యాయుడు పని చేస్తున్నారు. మూడు పోస్టులు ఉండగా, ఏడాది క్రితం ఒకరు అనారోగ్యంతో చనిపోగా.. ఒకరు ఇటీవల పదోన్నతిపై వెళ్లారు. ఇప్పుడున్న టీచర్ సైతం బదిలీ కాగా, రిలీవర్ రాకపోవడంతో అయన ఉండిపోయారు. అందరినీ ఒకచోట కూర్చోబెట్టి బోధిస్తున్నారు.

News July 5, 2024

ఆదిలాబాద్: బదిలీలకు వేళాయె

image

ఐదేళ్ల తర్వాత సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎవరెవరు బదిలీ అవుతారు? ఎక్కడికి వెళ్తారనే చర్చ సామాన్యుల్లో.. అధికార వర్గాల్లో జోరందుకుంది. ఉమ్మడి జిల్లాలో అన్ని శాఖలు కలిపి 63 ఉండగా.. అందులో జిల్లా స్థాయి, జోనల్, మల్టీజోన్, రాష్ట్రస్థాయి కేటగిరిల్లో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

News July 5, 2024

ఆదిలాబాద్: నిందితుడి కోసం వెళ్లి.. నింగిలోకి

image

ఆదిలాబాద్‌కు చెందిన ASI యునాస్ ఖాన్ నిన్న <<13567244>>గుండెపోటుతో <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. ఓ కేసులో కోర్టుకు హాజరు కాని నిందితుడికి కోసం SI, కానిస్టేబుల్తో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో భీమవరం వెళ్లాల్సి ఉంది. మెహిదీపట్నం నుంచి రూట్ 5కే సెట్విన్ బస్సులో యూనస్ ఖాన్ సికింద్రాబాద్ బయలుదేరాడు. బస్సు బాటా వద్దకు వచ్చేసరికి గుండెపోటుతో సీటులో నుంచి జారి కిందపడ్డాడు.

News July 5, 2024

ఆదిలాబాద్: కాంగ్రెస్‌లో చేరిన MLC దండె విఠల్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా BRS MLC దండె విఠల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆరుగురు MLCలు కాంగ్రెస్‌లో.. చేరగా అందులో విఠల్ ఉన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

News July 5, 2024

@1959లో ఆవిర్భవించిన ఆదిలాబాద్ ZP

image

ఆదిలాబాద్ జిల్లా పరిషత్ 1959లో ఆవిర్భవించింది. ఇప్పటివరకు 22 మంది ఛైర్మన్లుగా సేవలందించారు. పల్సికర్ రంగారావు తొలి ఛైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న ఆదిలాబాద్ జెడ్పికి ఐదుసార్లు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఐదుగురు కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు నిర్వహించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ చివరి ఛైర్ పర్సన్‌గా నిర్మల్‌కు చెందిన శోభారాణి వ్యవహరించారు.

News July 4, 2024

ఆదిలాబాద్: గుండెపోటుతో ఏఎస్సై మృతి

image

ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ఏఎస్సై యూనస్ ఖాన్ హైదరాబాద్‌లో గురువారం గుండెపోటుతో మృతి చెందారు. 1989 బ్యాచ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల విధులు నిర్వర్తించారు. ఏఎస్సైగా పదోన్నతి పొంది హైదరాబాద్‌ సీఐడీ విభాగంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. గురువారం విధుల్లో ఉండగా సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌ సమీపంలో గుండెపోటుతో ఆయన మృతి చెందాడు.

News July 4, 2024

కెరమెరి: వాగులో మునిగి మహిళ మృతి

image

కెరమెరి మండలం సుర్దపూర్ గ్రామానికి చెందిన చౌదరి జ్యోతి(24) వాగులో మునిగి మృతి చెందినట్లు ఎస్ఐ విజయ్ తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్లిన భర్త సురేందర్‌కు భోజనం తీసుకెళ్తూ పెద్దవాగు దాటుతున్న క్రమంలో నీటిలోతు తెలియక జ్యోతి నీటిమునిగి మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలి భర్త  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News July 4, 2024

సిర్పూర్: బావిలో స్నానానికి వెళ్లి విద్యార్థి మృతి

image

లింగాపూర్ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన ఆత్రం రామకృష్ణ (15) గురువారం ఉదయం బావిలో స్నానానికి వెళ్లి మృతి చెందినట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కంచనపల్లి ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న రామకృష్ణ గురువారం ఉదయం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.

News July 4, 2024

ఆదిలాబాద్: NACలో ఉద్యోగ అవకాశాలు

image

బెల్లంపల్లి NAC సెంటర్‌లో కంప్యూటర్ స్కిల్స్, ఇంగ్లిష్ నేర్పించుటకు ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేయడానికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా NAC ఏడీ నాగేంద్రం తెలిపారు. MA ఇంగ్లిష్, కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్న యువకులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని సూచించారు.

News July 4, 2024

ఆదిలాబాద్: ఉద్యోగులకు GOOD NEWS

image

దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ బదిలీ కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు తీపికబురు అందించింది. సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన పలువురు జిల్లాస్థాయి అధికారులతో పాటు ఉద్యోగులకు స్థానచలనం కలిగే అవకాశముంది.