India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆయా ప్రాంతాలను విద్యుత్శాఖ సిబ్బంది, అధికారులు పరిశీలిస్తున్నారు. వెంట వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో కరెంటు స్తంభాలకు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎర్రమంజిల్ ప్రాంతంలో చెట్టు కూలడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ ఐఆర్టీ టీమ్స్ వాటిని క్లియర్ చేస్తుందని పేర్కొన్నారు.
భారీ వర్షం కారణంగా రహదారులపై వర్షపు నీరునిలిచిపోయింది. తెలంగాణ సచివాలయం వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అటు ఖైరతాబాద్ KCP జంక్షన్, సోమాజిగూడలో ప్రధాన రహదారులపై చెట్లు నేలకొరిగాయి. భారీగా ట్రాఫిక్ జామైంది. వాహననదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. అత్యవసరం అయితేనే బయటకురండి. SHARE IT
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్డెన్ సిటీలో దారుణ ఘటన జరిగింది. 7 ఏళ్ల బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని దుండగులు మీరాలం ట్యాంక్ సమీపంలో పడేశారు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హత్యకు గురైన బాలుడు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చుట్టు పక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. బాలుడి హత్య వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.
అతిథి దైవ సమానం. కానీ, తాజా ఘటనతో పరువు పోయింది. జర్మనీ యువతికి HYD చూపిస్తానని నమ్మించిన యువకుడు అత్యాచారం చేసి, ఆమె జీవితంలో మాయనిమచ్చను మిగిల్చాడు. గతంలో ఓ ఫారినర్కు వ్యాపారి రూ.100కు ఒక్క అరటి పండు అంటగట్టాడు. ఇది అన్యాయమని ఆ టూరిస్ట్ వీడియో వైరల్ చేశాడు. వాస్తవానికి HYD మతసామరస్యానికి నిలువుటద్దం. గొప్ప వారసత్వ సంపద ఉన్న నగరం. లక్షల మందికి ఉపాధినిస్తోంది. అలాంటి చోట ‘అతిథి దేవోభవ’ ఆచరించండి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విధ్వంసాన్ని తక్షణమే నిలిపివేసి, గచ్చిబౌలి కంచ గచ్చిబౌలిలో అడవిని నాశనం చేయకూడదని ప్రొ.హరగోపాల్ సూచించారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మాట్లాడుతూ అడవి ఎంతో సుసంపన్నమైన ప్రకృతి అని, చూస్తే కానీ అర్థం కాదన్నారు. ఈ అడవిలో ఎన్నో రకాల అరుదైన పక్షి జాతులు ఉన్నాయని, ఒకసారి ప్రకృతిని ధ్వంసం చేస్తే పునర్నిర్మాణానికి వందల ఏళ్లు పడుతుందని తెలిపారు.
HCU విద్యార్థులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేయడాన్ని BJYM నాయకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన విధానాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా BJYM ఆందోళనకు పిలుపునిచ్చింది. సీఎంకి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నామని రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని మీరు హామీ ఇచ్చి ఇప్పుడు నెపాన్ని కేంద్రంపై ఎలా నెడుతారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేకపోతే, ఎలా హామీ ఇచ్చారన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేకే రేవంత్ ఈ డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలను వాడుకొని వదిలేయాలన్న ఆలోచనే ఉందని మండిపడ్డారు.
వైల్డ్లైఫ్ చీఫ్ వార్డెన్ మెరూను ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అరణ్య భవన్లో కలిశారు. హెచ్సీయూ పరిధిలో వివిధ జంతు- వృక్ష జాతుల మనుగడకు హాని కలిగించే చర్యలను తక్షణమే అడ్డుకోవాలని వినతిపత్రం అందజేశారు. అటవీ, పర్యావరణ పరిరక్షణ చట్టాలను కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘిస్తుండటంపై ఫిర్యాదు చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నగరవాసుల వేసవి తాపాన్ని తీర్చేందుకు తాటిముంజలు వచ్చేశాయి. ముషీరాబాద్, రాంనగర్ డౌన్, బయోలజికల్ ఈ లిమిటెడ్, అడిక్మెట్ ఫ్లై ఓవర్ తదితర ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరందుకుంది. డజన్ మంజలు రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. ఇవి తింటే జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. వడదెబ్బ తాకిన వారు వీటిని తింటే వెంటనే కోలుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధతో ధరలు ఎక్కువున్నా HYD వాసులు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు.
Sorry, no posts matched your criteria.