India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈనెల 21న అఖిల భారత మహిళా విద్యావేత్తల సదస్సు జరగనుందని కాన్ఫరెన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ మంచుకొండ శైలజ తెలిపారు. సదస్సును ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. సదస్సుకు NHRC అధ్యక్షురాలు విజయ భారతి సయాని తదితరులు హాజరవుతారని పేర్కొంది. ఈ సదస్సులో వికసిత భారత్ నిర్మాణంలో మహిళా విద్యావేత్తల పాత్ర తదితర అంశాలపై ప్రముఖులు మాట్లాడనున్నట్లు తెలిపింది.
దసరా, దీపావళి, ఛాత్ పూజకు వెళ్లే ప్రయాణికులరద్దీని దృష్టిలో పెట్టుకుని 24 ప్రత్యేక రైలు సర్వీసులను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబరు 5 నుంచి నవంబరు 12 మధ్య ఒక్కో మార్గంలో ఆరేసి ట్రిప్పుల చొప్పున ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి, తిరుపతి-సికింద్రాబాద్, తిరుపతి-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-తిరుపతి మధ్య రైలు నడపనున్నట్లు తెలిపారు.
భారత్-ఇరాన్ పర్యాటక సహకారమే లక్ష్యంగా ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో సాంస్కృతిక, చారిత్రక, సహజ వైవిధ్యాన్ని తెలిపేలా ఇరాన్ టూరిజం శాఖ హైదరాబాద్లోని ఓ హోటల్లో గురువారం రోడ్షో నిర్వహించింది. ఇరాన్ టూరిజం ఉపమంత్రి అలీ అస్గర్ షాల్బాఫియాన్, తెలంగాణ టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. జనవరి 2024 నుంచి భారతీయులకు ప్రతీ 6 నెలల్లో 15 రోజుల పాటు వీసా రహిత ప్రయాణాన్ని ఇరాన్ ప్రకటించింది.
వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం కోసం హైదరాబాద్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మండపాల్లో విగ్రహాలను నిలబెట్టిన భక్తులు ‘రేపటి కోసం’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ‘నిమజ్జనం ఉంది. విరాళాలు కావాలి. సొంత డబ్బులు పోగు చేయాలి. అన్నదానం కోసం దాతల సహాయం కావాలి. మన గణపతిని అంగరంగ వైభవంగా ఊరేగించాలి’ అన్న తపనతో యువత ముందుకు కదులుతున్నారు. మరి మీ మండపం వద్ద పరిస్థితి ఎలా ఉంది. కామెంట్ చేయండి.
రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. HYD జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, RR జిల్లాలో స్టేట్ చీఫ్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది.
హైదరాబాద్ మెట్రోలో రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా నాగోల్ నుంచి రాయదుర్గం రూట్లో ఉదయం, సాయంత్రం నిలబడలేని పరిస్థితి ఉంటోంది. నాన్స్టాప్ సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనివలన ప్రయాణం సౌలభ్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రెగ్యులర్ సేవలతో పాటు నాన్ స్టాప్ సర్వీసులు కూడా ఏర్పాటు చేయడంతో సమయం ఆదా అవుతోందన్నారు. దీనిపై మీ కామెంట్?
HYDలో గణేశ్ నిమజ్జనాలు మొదలయ్యాయి. బుధవారం 5వ రోజు పూజలు అందుకుంటున్న గణనాథులు సాయంత్రం భారీ జులూస్ నడుమ ట్యాంక్బండ్కు చేరుకోనున్నారు. నెక్లెస్రోడ్లోని పీపుల్ ప్లాజా ఎదుట క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం గణేశ్ విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంలో మద్యం, మరేదైనా మత్తు పదార్థాలు తాగిన వ్యక్తులను అనుమతించకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు చేసుకోవాలన్నారు.
SHARE IT
HYD నగరంలో గణపతి నిమజ్జనం చివరి రోజు 40 గంటల పాటు భారీ బందోబస్తు ఉంటుందని సీపీ CV ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, తదితర పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు. మిలాద్ ఉన్ నబి వేడుకల్లో భాగంగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీలు, కమ్యూనల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. శాంతియుతంగా వేడుకలు నిర్వహించుకోవాలన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షిర్డీ సాయినాథుడిని ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు స్పీకర్కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మధ్యాహ్నం హారతి సమయంలో మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాధాకృష్ణ వికే పాటిల్తో కలిసి సాయినాథుడిని మహా సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్, ఇతర సిబ్బందికి 6 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషం అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే సీఎంకు వీరి వెతలు కనిపించకపోవడం శోచనీయమన్నారు. టీవీవీపీ ఆసుపత్రుల్లోని సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.