Hyderabad

News June 23, 2024

HYD: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

image

జూన్ 24 నుంచి 29 తేదీల మధ్య జరిగే వసతి గృహ సంక్షేమాధికారి, జూన్ 30 నుంచి జులై 4 వరకు నిర్వహించే డివిజనల్ అకౌంట్స్ అధికారి నియామక పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. అందరూ ఈ విషయాన్ని గమనించాలని, నిబంధనలు పాలించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News June 23, 2024

HYD: బొగ్గు బ్లాకుల వేలం సింగరేణి దివాలాకే: తమ్మినేని

image

రాష్ట్రానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను దివాలా తీయించేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వేలం పాట ప్రారంభించిందని CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. HYDలో ఆయన మాట్లాడారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేసి తర్వాత సింగరేణి మూతపడేలా కేంద్రం చేస్తుందని, దానిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించాలని కోరారు. అన్ని జిల్లాల్లో ఈనెల 28, 29న ధర్నాలు నిర్వహిస్తామన్నారు.

News June 23, 2024

HYD: 138కు చేరనున్న ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్య

image

HYD కూకట్‌పల్లి JNTU పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్య 138కు చేరనుంది. ప్రస్తుతం వీటి సంఖ్య 139 ఉండగా గుర్తింపు పునరుద్ధరణలో భాగంగా ఈ విద్యా సంవత్సరం ఒక కళాశాల తొలగింపునకు యాజమాన్యం నుంచి వినతి అందింది. మల్లారెడ్డి కళాశాలల్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీని.. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో విలీనం చేస్తున్నట్లు JNTUకు దరఖాస్తు చేసిందని అధికారులు తెలిపారు.

News June 23, 2024

HYD: 40 ఎకో టూరిజం స్పాట్లు: మంత్రి

image

రాష్ట్రంలోని 12 సర్యూట్‌లలో 40 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించినట్టు అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. సచివాలయంలో ఉన్న అటవీ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఎకో టూరిజం కన్సల్టేటివ్‌ కమిటీ ఉన్నత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. అడ్వెంచర్‌, రిక్రియేషన్‌, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్‌, నేచర్‌ వైల్డ్‌లైఫ్‌, హెరిటేజ్‌-కల్చర్‌ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తిస్తామన్నారు.

News June 23, 2024

HYD: పార్కింగ్‌ సమస్య పరిష్కారానికి కృత్రిమ మేధ

image

హైదరాబాద్‌తో పాటు అన్ని నగరాల్లో పార్కింగ్‌ సమస్యను పరిష్కరించడానికి కృత్రిమ మేధను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. HYDలోని సచివాలయంలో ఉన్న తన ఛాంబర్‌లో ‘ఈజీ పార్క్‌ ఏఐ’ సంస్థ డిజిటల్‌ ప్రెజెంటేషన్‌ను మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కింగ్‌ స్లాట్‌ను ముందే బుక్‌ చేసుకునేందుకు యాప్‌లను రూపొందించాలని పేర్కొన్నారు.

News June 23, 2024

HYD: వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీశాయి..!

image

రెండు వేర్వేరు ఘటనల్లో వివాహేతర సంబంధాలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. పోలీసులు తెలిపిన వివరాలు..పాతబస్తీ వాసి జాకీర్(29)కు వట్టేపల్లికి చెందిన మహిళకు వివాహేతర సంబంధం ఉంది.జాకీర్ తరచూ ఆ మహిళ ఇంటికి వస్తుండడంతో ఆమె భర్త, సోదరుడు కలిసి జాకీర్‌ను చంపేశారు. మరో ఘటనలో RRజిల్లా షాబాద్ వాసి సంతోష(36)కు, షాద్‌నగర్ వాసి సత్తయ్యకు వివాహేతర సంబంధం ఉంది. ఆమె మరికొందరితో కలుస్తుందనే అనుమానంతో సత్తయ్య ఆమెను చంపేశాడు.

News June 23, 2024

HYD: వాట్సాప్‌లో మెనేజ్.. రూ.16.68 లక్షలు స్వాహా

image

గూగుల్ మ్యాప్‌లో రేటింగ్ ఇవ్వాలని సైబర్ నేరగాళ్లు రూ.16.68 లక్షలు స్వాహా చేశారు. HYDకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి గూగుల్ టాస్క్ చేసి ఆదాయం పొందండి అంటూ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. లింక్ క్లిక్ చేసిన బాధితుడు టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ అయ్యాడు. మొదటగా కొన్ని టాస్క్‌లు చేసిన తర్వాత పెట్టుబడులు పెట్టాలంటూ సూచించారు. విడతల వారీగా రూ.16.68 లక్షలు దండుకున్నారు. మోసపోయానని బాధితుడు PSను ఆశ్రయించాడు.

News June 23, 2024

HYD: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిరంతరం నిర్వహించాలి: మంత్రి

image

హెల్త్‌ విభాగంలోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేసి, ఆయా సంస్థలను బలోపేతం చేయాలని అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తే సహించబోమన్నారు.

News June 23, 2024

రేపు GHMCలో ప్రజావాణి

image

2 వారాల సెలవు ముగించుకుని కమిషనర్ రోనాల్డ్ రాస్ రేపు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు GHMC తెలిపింది. ఉదయం 10:30 నుంచి ఉ.11:30గంటల వరకు ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుందని, ప్రజలు 040-23222182 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యను తెలపాలని అధికారులు తెలిపారు. అనంతరం ప్రజావాణికి హాజరైన నగర వాసుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు.

News June 23, 2024

HYD: ఎకో టూరిజం కమిటీ ఛైర్‌పర్సన్‌గా మంత్రి కొండా సురేఖ

image

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ ఛైర్‌పర్సన్‌గా మంత్రి కొండా సురేఖ, మరో 16 మంది అధికారులను సభ్యులుగా నియమిస్తూ శనివారం HYDలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకో టూరిజం అభివృద్ధి కోసం కమిటీ మూడు సమావేశాల్లో ఆయా టూరిజం స్పాట్స్‌ను గుర్తించాలని సూచించింది. ప్రత్యేకమైన ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.