Hyderabad

News June 14, 2024

HYD: గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100కి అవకాశం ఇవ్వాలని మంత్రికి వినతి

image

త్వరలో జరగబోయే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులను 1:50 గా కాకుండా 1:100గా ఎంపిక చేయాలని పలువురు నిరుద్యోగులు ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హైదరాబాద్‌లో వినతిపత్రం అందజేశారు. 1:100కి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువతకు ఎక్కువ అవకాశం కల్పించినట్లు అవుతందన్నారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ CM దృష్టి తీసుకెళుతానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

News June 14, 2024

HYD: పోస్టింగ్‌ ఇవ్వాలని సీఎం ఇంటికి అభ్యర్థులు

image

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ లెటర్స్ తీసుకున్న గురుకుల అభ్యర్థులు శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల ముందు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చినా ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదని వాపోయారు. ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికే ఆలస్యమైందన్నారు. ఇకనైనా సీఎం దృష్టిసారించి తమకు పోస్టింగ్ ఇవ్వాలని కోరారు.

News June 14, 2024

HYD: బాలాపూర్‌లో మర్డర్

image

బాలాపూర్ PS పరిధి రాయల్ కాలనీలో దారుణం జరిగింది. చంపాపేట్ బాబానగర్‌కు చెందిన సయ్యద్ సమీర్‌(28) హత్యకు గురయ్యాడు. రాయల్ కాలనీ వద్ద గుర్తుతెలియని దుండగులు చంపేశారు. డెకరేషన్ చేసి ఇంటికి వస్తుండగా స్థానిక గంజాయి బ్యాచ్‌ ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 14, 2024

RAINS: హైదరాబాద్‌‌‌లో మెట్రో ఇక ఆగదు!

image

వర్షాకాలంలో‌ మెట్రో‌ రైలు‌ సేవల్లో అంతరాయం లేకుండా‌ అధికారులు‌ చర్యలు తీసుకుంటున్నారు. గురువారం బేగంపేటలో‌ L & T HYD మెట్రో ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ కంపెనీ కియోలిస్ తదితరులతో ఎండీ NVSరెడ్డి సమావేశమయ్యారు. ట్రాన్స్‌ కో ఫిడర్ ట్రిప్ అయితే ప్రత్యామ్నాయంగా మరొక ఫీడర్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. నీటి పైపులను క్లీన్ చేయడం, జాయింట్ల తనిఖీ, ఎస్కలేటర్ల వద్ద నీరు నిలువకుండా జాగ్రత్త‌ పడాలని సూచించారు

News June 14, 2024

HYD: గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్య పెంచాలి: గుజ్జ సత్యం

image

గ్రూపు-2, 3 పోస్టుల సంఖ్యను పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా HYD కాచిగూడలో ఆయన మాట్లాడుతూ.. గ్రూప్-2 ఎక్సైజ్ ఎస్ఐ ఎత్తు 167.6 నుంచి 165కు తగ్గించాలని, డీఎస్సీ పరీక్షను ఆఫ్ లైన్‌లో నిర్వహించాలని కోరారు. ఎంతో మంది నిరుద్యోగులు జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

News June 13, 2024

HYD, RR, MDCLలో వర్షపాతం వివరాలు..

image

HYD, RR, MDCL జిల్లాల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం వేళ మోస్తారు వర్షం కురిసింది. అధికంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మంగళ్‌పల్లిలో 74.5 మిల్లీమీటర్లు, మొయినాబాద్ 55.8, సైదాబాద్ 41, చార్మినార్ 39.8, బండ్లగూడ 30, అంబర్‌పేట్ 28.5, సరూర్ నగర్ 22.3, బహదూర్‌పుర 18.8, నాంపల్లి 17.8, మల్కాజిగిరి 11.8, మారేడ్‌పల్లి 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది.

News June 13, 2024

HYD: ‘రెసిడెన్షియల్ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్‌గా మార్చొద్దు’

image

తెలంగాణలో రెసిడెన్షియల్ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చే ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, నంద గోపాల్ గురువారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను HYDలో కలిసి విజ్ఞప్తి చేశారు.

News June 13, 2024

BREAKING: HYD: లంచం తీసుకుంటూ దొరికిన సీఐ

image

HYD CCSలో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్ సీహెచ్.సుధాకర్‌ ఈరోజు రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ వ్యక్తిపై నమోదైన కేసుకు సంబంధించి అతడికి అనుకూలంగా విచారణ చేసేందుకు రూ.15 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారని తెలిపారు. అందులో మొదట విడతగా రూ.5 లక్షలు తీసుకోగా ఈరోజు మరో రూ.3 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నామని వెల్లడించారు.

News June 13, 2024

HYD: పంజాగుట్టలో వ్యభిచారం.. పోలీసుల రైడ్స్

image

వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఈరోజు HYD పంజాగుట్ట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పంజాగుట్టలోని ఓ ప్రముఖ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి దాడులు చేశారు. నిర్వాహకురాలు సూర్యకుమారి సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.89వేల నగదు, 18 సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News June 13, 2024

HYD: అధికారులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ సమావేశం

image

రేపు ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా ఈరోజు HYD ఖైరతాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బ్లడ్ బ్యాంక్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని కేంద్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లను నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.