India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

‘అయ్యో! మీరు చనిపోయారా.. ఏం పర్లేదు మీ పెన్షన్ డబ్బులు ఆగిపోవు.. మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. మీరు ఏ లోకంలో ఉన్నా వాడుకోవచ్చు’ ఇది సర్కారు తీరు. ఫతుల్లాగూడకు చెందిన జంగయ్య, బండ్లగూడకు చెందిన పోచయ్యలు ఎప్పుడో చనిపోయారు. అయినా వారి అకౌంట్లలో వృద్ధాప్య పెన్షన్ పడుతోంది. త్యాయగరాయనగర్కు చెందిన వీరభద్రయ్య(దివ్యాంగుడు) చనిపోయినా 5ఏళ్లుగా నెలకు రూ.4,016 జమ అవుతోందంటే మన అధికారుల తీరు అర్థం చేసుకోవచ్చు.

మన హైదరాబాద్ గడ్డపై ఐఐటీయన్లు గట్టిగానే ప్లాన్ చేశారు. భారత్ ఏఐ ఇంపాక్ట్ సమిట్కు మద్దతుగా మార్చి 8న వెస్టిన్ హోటల్లో ‘పాన్-ఐఐటీ సదస్సు’ జరగనుంది. త్వరలో ఫ్రాన్స్లో జరిగే ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమానికి కూడా వీరు తోడుగా నిలవనున్నారు. ప్రభాత్ కుమార్ నేతృత్వంలో ఐఐటీ HYDలో కొత్త ఆఫీసు కూడా రాబోతోంది. ఆరోగ్యం, డిఫెన్స్ రంగాల్లో ఏఐ విప్లవంపై 600 మందికి పైగా నిపుణులు ఈ వేదికపై చర్చించనున్నారు.

మన హైదరాబాద్ గడ్డపై ఐఐటీయన్లు గట్టిగానే ప్లాన్ చేశారు. భారత్ ఏఐ ఇంపాక్ట్ సమిట్కు మద్దతుగా మార్చి 8న వెస్టిన్ హోటల్లో ‘పాన్-ఐఐటీ సదస్సు’ జరగనుంది. త్వరలో ఫ్రాన్స్లో జరిగే ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమానికి కూడా వీరు తోడుగా నిలవనున్నారు. ప్రభాత్ కుమార్ నేతృత్వంలో ఐఐటీ HYDలో కొత్త ఆఫీసు కూడా రాబోతోంది. ఆరోగ్యం, డిఫెన్స్ రంగాల్లో ఏఐ విప్లవంపై 600 మందికి పైగా నిపుణులు ఈ వేదికపై చర్చించనున్నారు.

కంటోన్మెంట్ MLA శ్రీ గణేష్కు తృటిలో ప్రమాదం తప్పింది. మంచిర్యాల బస్ స్టాప్ సమీపంలో ఎమ్మెల్యే కాన్వాయ్పైకి ఆర్టీసీ బస్సు దూసుకొచ్చింది. ఈ ఘటనలో కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాన్వాయ్ డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్లో విశ్వసనీయ ఆహార బ్రాండ్ నిలోఫర్ బంజారాహిల్స్లో తన కొత్త రూఫ్టాప్ వెజిటేరియన్ రెస్టారెంట్ Niloufer Chathను ప్రారంభించింది. నార్త్ ఇండియన్ వెజ్ రుచులు, ఆధునిక డిజైన్, ప్రీమియం అంబియెన్స్తో ప్రత్యేక అనుభూతిని అందిస్తోంది. నాణ్యత, నమ్మకమే తమ లక్ష్యమని ఛైర్మన్ అనుముల బాబు రావు, MD శశాంక్ తెలిపారు. MLA దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొని ప్రశంసించారు.

నగరంలోని PG హాస్టళ్లపై పోలీసుల నిఘా మొదలైంది. ‘ఇకపై ఆటలు సాగవు.. నిబంధనలు పాటించాల్సిందే’ అంటూ మియాపూర్ పోలీసులు నిర్వాహకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ట్రేడ్ లైసెన్స్, ఫైర్ ఎన్వోసీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్లు లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ శివప్రసాద్ హెచ్చరించారు. ప్రతి హాస్టల్ సెక్టార్ వారీగా రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని ఆదేశించారు.

హైదరాబాద్ పోరగాళ్లది మామూలు రచ్చ కాదు. ఇప్పుడు తిండి రుచి కంటే కూడా అది కెమెరాలో ఎట్లా కనిపిస్తుందనేదే ముఖ్యం. నియాన్ లైట్ల కొరియన్ ఫుడ్ దగ్గర మొదలుపెట్టి, మంటలు పుట్టించే ఫైర్ నూడుల్స్ దాకా అన్నీ రీల్స్ కోసమే. ప్లేటులో చీజ్ ఊగినా, పొగలు కక్కినా అదో వైరల్ సెన్సేషన్. కడుపు నిండడం సంగతేమో కానీ వీడియో క్రేజీగా రాకపోతే వీళ్లకు ఆ క్యాలరీలు దండగన్నమాట. డ్రామా ఉంటేనే మన జెన్-జీకి అసలైన దావత్.

కార్పొరేట్ ఆట కట్టించేందుకు సర్కారు ‘DBT’ అస్త్రం విసిరింది. “నీ ఫీజు నీ చేతికే” అంటున్న.. ఏదో తిరకాసు ఉందని టాక్. గ్రేటర్లోని 3.5 లక్షల మంది పేద విద్యార్థులకు నిధులు టైముకు రాకపోతే గతేంటి? గతంలో కాలేజీలు సర్కారు కోసం ఎదురుచూసేవి, ఇప్పుడు విద్యార్థులే మేనేజ్మెంట్ల ముందు నిలబడాల్సిన పరిస్థితి. ఈ పద్ధతి కాలేజీలను దారికి తెస్తుందా?, విద్యార్థులను అప్పుల ఊబిలో ముంచుతుందా! అనేది చర్చనీయాంశమైంది.

GHMCని 3 ముక్కలు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. HYD, CYB, మల్కాజిగిరి వేర్వేరు కార్పొరేషన్లు కొలువుదీరనున్నాయి. ‘స్పెషల్ ఆఫీసర్’గా Special CS జయేశ్ రంజన్ను రంగంలోకి దించుతోంది. సైబరాబాద్ కార్పొరేషన్ పగ్గాలు పి.సృజనకు, మల్కాజిగిరి బాధ్యతలు వినయ్ కృష్ణారెడ్డికి అప్పగించే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నికలు ముగిసే వరకు గ్రేటర్ ప్రధాన కమిషనర్గా RV కర్ణన్ చక్రం తిప్పనున్నారు. రేపు GO విడుదల కానుందని సమాచారం.

నగరంలో వరదలు వస్తే లోతట్టు ఇళ్లు, వాహనాలు మునిగిపోతాయని CM రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సోమవారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. వరదల సమస్యను ప్రచారంలో వాడుకున్న బండి సంజయ్ గత GHMC ఎన్నికల్లో దాదాపు 50 మందిని గెలిపించుకున్నారని పేర్కొన్నారు. కానీ, ‘బండి పోతే బండి ఇస్తాం’ అన్న సంజయ్ ఆ హామీని నీరు గార్చారని, BJPకి ఓటేస్తే హైదరాబాదీలను నిండా ముంచారని రేవంత్ తీవ్రంగా విమర్శించారు.
Sorry, no posts matched your criteria.