India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYDలో డెంగ్యూ తగ్గిందని సర్కార్ లెక్కలు చెబుతున్నా గల్లీల్లో జనం జ్వరాలతో మంచం పడుతున్నారు. 2024లో 2,806గా ఉన్న కన్ఫర్మ్డ్ డెంగ్యూ కేసులు 2025లో 1,976కు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. అయితే, 2021లో 220గా ఉన్న సస్పెక్టెడ్ చికెన్ గున్యా కేసులు 2025 నాటికి ఏకంగా 13,500 దాటి 60 రెట్లు పెరిగాయని అధికారిక నివేదికలు తెలుపుతున్నాయి. 2026 ప్రారంభంలోనే <<19102369>>కోరంటిలో OP<<>> రోజుకు 700 దాటడం గమనార్హం.

మూసీ ప్రక్షాళన సంగతేమో కానీ.. దోమల సంతతి మాత్రం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. 2024లో మూసీ పరీవాహక ప్రాంతాల్లో 450 మలేరియా కేసులు నమోదవ్వగా 2025 ముగిసేసరికి ఆ సంఖ్య 700 దాటేసింది. అధికారులు డ్రోన్లతో మందులు చల్లుతున్నామని చెబుతున్నా గుర్రపుడెక్క ముందు అవేవీ పనిచేయడం లేదు. సాయంత్రం 6 దాటిందంటే చాలు కిటికీలు తెరిస్తే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. ఏటా రూ.కోట్లు ఖర్చు పెడుతున్నా దోమలు తగ్గడం లేదు.

* కమిషనర్ కర్ణన్ టీంలో అనురాగ్ జయంతి, ప్రియాంక ZCలుగా అందుబాటులో ఉంటారు. మీ ఏరియాలో ఎలాంటి సమస్యలున్నా 7993425555కు కాంటాక్ట్ అవ్వొచ్చు.
* వినయ్ కృష్ణారెడ్డి టీంలో ZCలుగా సాంచిత్ గంగ్వార్, రాధికా గుప్తా వ్యవహరిస్తారు. మీ ఏరియాలో ఎలాంటి సమస్యలున్నా 9063421145కు కాల్ చేయొచ్చు.
* సృజన టీంలో భోకాడే హేమంత్, అపూర్వ్ చౌహాన్, సందీప్ కుమార్ ZCలుగా ఉంటారు. ఎలాంటి సమస్యలున్నా 8008011110కు కాంటాక్ట్ కావచ్చు.

* కర్ణన్-LBనగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్ల పరిధి ఈయనదే.
* వినయ్ కృష్ణారెడ్డి-మల్కాజిగిరి, ఉప్పల్ జోన్లలోని కీసర, అల్వాల్, బోయిన్పల్లి, మౌలాలి, మల్కాజిగిరి, ఘట్కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్ బాధ్యతలు ఈయనకే.
* సృజన-శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలోని గచ్చిబౌలి, మాదాపూర్, నిజాంపేట్, జీడిమెట్ల సహా 16సర్కిళ్ల బాధ్యత ఈమెదే.

* కర్ణన్-LBనగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్ల పరిధి ఈయనదే.
* వినయ్ కృష్ణారెడ్డి-మల్కాజిగిరి, ఉప్పల్ జోన్లలోని కీసర, అల్వాల్, బోయిన్పల్లి, మౌలాలి, మల్కాజిగిరి, ఘట్కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్ బాధ్యతలు ఈయనకే.
* సృజన-శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలోని గచ్చిబౌలి, మాదాపూర్, నిజాంపేట్, జీడిమెట్ల సహా 16సర్కిళ్ల బాధ్యత ఈమెదే.

GHMCలో పాలనను పరుగులు పెట్టించేందుకు ప్రవేశపెట్టిన 3 ప్రధాన కమిషనరేట్ల ప్రతిపాదన అధికారికంగా ఖరారైంది. ఆర్వీ.కర్ణన్, టీ.వినయ్ కృష్ణారెడ్డి, జీ.సృజన నేతృత్వంలో జోన్లు, సర్కిళ్లు విడిపోయాయి. మొత్తం 12 జోన్లు, 60 సర్కిళ్ల పరిధిలోని జడ్సీలు, డిప్యూటీ కమిషనర్ల ఫోన్ నంబర్లతో కూడిన జాబితా విడుదలైంది. మహానగరం 3 ముక్కలై.. అతిపెద్ద కార్పొరేషన్గా అవతరించింది. పైన ఫొటోలో నంబర్లు ఉన్నాయి. #SAVE IT.

ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. HYD డివిజన్ పరిధిలో డాక్ సేవక్-7, HYD సోర్టింగ్ డివిజన్లో డాక్ సేవక్- 23 పోస్టులు ఉన్నాయి. HYD సౌత్ ఈస్ట్ పరిధిలో డాక్ సేవక్-22, ABPM-9, BPM-10, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో డాక్ సేవక్-12, ABPM-4, BPM-8 పోస్టులు ఉన్నాయి. వెబ్సైట్ indiapostgdsonline.cept.gov.inలో అప్లై చేసుకోండి.

ఆర్సీపురం, అశోక్నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్పూర్, భాగ్యనగర్ కాలనీ, ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు, ఎర్రగడ్డ, ఎస్ఆర్నగర్, అమీర్పేట్, కేపీహెచ్బీకాలనీ, కూకట్పల్లి, భాగ్యనగర్కాలనీ, ప్రగతినగర్కు నీటి సరఫరా ఉండదు. మంజీరా ఫేజ్- 2 మరమ్మతుల కారణంగా బుధవారం ఉ.6 నుంచి గురువారం రాత్రి 10 గం. వరకు వాటర్ నిలిచిపోతుంది.

10వ తరగతి విద్యార్థినికి ఓ టీచర్ తాళి కట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచేసింది. ఘట్కేసర్ పరిధి పోచారంలోని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ మైటీన్(27) విద్యార్థినికి మాయమాటలు చెప్పి చాటుగా తాళి కట్టాడు. JAN 3 గమనించిన తల్లి, కుమార్తెను నిలదీయగా విషయం చెప్పింది. ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లగా.. స్కూల్కి సంబంధం లేదనటంతో బాధితులు పోచారం PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని రిమాండ్కు తరలించారు.

నేటితో ముగియనున్న GHMC పాలక మండలి.. నిరసనలు, ఆందోళనలతోనే గడిచిపోయింది. ఐదేళ్ల పదవీ కాలంలో పాలకమండలి 23సార్లు సమావేశమైంది. ఏడాదికి సరాసరి 4.6 సార్లు జరిగినట్లు లెక్క. ఈ సమావేశాలు జరుగుతున్నపుడు ప్రతిపక్ష పార్టీల సభ్యుల ఆందోళనలు, నిరసనలు హోరెత్తాయి. దీంతో సగం సమావేశాలు వాటితోనే ముగిశాయి. ఈ 5ఏళ్లలో 415 తీర్మానాలను పాలకమండలి ఆమోదించింది.
Sorry, no posts matched your criteria.