India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD, RR, MDCL,VKB జిల్లాల పరిధిలో వర్ష బీభత్సం, ఈదురు గాలులకు రాత్రి అనేక చోట్ల కరెంట్ స్తంభించి పోయింది. కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. పలు చోట్ల కరెంట్ తీగలు తెగిపడ్డాయి. అనేక చోట్ల విధ్వంసకర పరిస్థితి ఏర్పడింది. విషయాన్ని తెలుసుకున్న విద్యుత్ శాఖ ఇంజినీర్లు, లైన్ మెన్, సిబ్బంది, అధికారులు అర్ధరాత్రి నిద్రహారాలు మాని ప్రజలకు కరెంట్ పునరుద్ధరించడంలో నిమగ్నమయ్యారు.
HYDలో కురిసిన వర్షం, ఈదురుగాలులకు దాదాపు 480 ఫీడర్ ఏరియాల్లో కరెంట్ సమస్యలు ఏర్పడ్డాయి. నగరంలో 4000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ కాస్త రాత్రి ఒక్కసారిగా..1000 మెగావాట్లకు పడిపోయింది. దాదాపుగా 300 ఫీడర్ ఏరియాల్లో అధికారులు మరమ్మతులు చేపట్టి సమస్యలకు చెక్ పెట్టారు. మిగతా ప్రాంతాల్లోనూ కరెంట్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి 2021లో ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
దేశంలోని లోక్సభ స్థానాల్లో చేవెళ్ల వైవిధ్యమైందని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చేవెళ్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందగా, మరికొన్ని చోట్ల కనీస సౌకర్యాలు లేవన్నారు. ఐటీ, రియల్ రంగాల్లో దూసుకెళ్తున్న ప్రాంతాలు కొన్నైతే, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న గ్రామాలు కొన్ని ఉన్నాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తనకో విజన్ ఉందని అన్నారు.
మల్కాజిగిరి దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం అని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇదో మినీ ఇండియా అని, భిన్న ప్రాంతాల వారున్నారన్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు, అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. మెట్రో విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతానని తెలిపారు.
HYD అల్వాల్లో <<13198573>>బావ యుగేంధర్(40)ను<<>> బావమరిది సుబ్రహ్మణ్యం హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికుడైన ఎం.యుగేంధర్.. గతంలో పలు నేరారోపణలతో జైలుకెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో భార్య జానకి, కుమార్తెను వేధిస్తున్నాడు. తాగొచ్చి భార్యపై దాడి చేయడంతో ఆమె తన తమ్ముడు సుబ్రహ్మణ్యానికి చెప్పింది. దీంతో అక్కను నిత్యం వేధిస్తున్నాడని కక్ష పెంచుకున్న బావమరిది బావను బండరాయితో మోది హత్య చేశాడు.
HYDలో కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్షం పరిస్థితులపై కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులతో సమీక్షించారు. రోడ్లపై నిలిచిపోయిన నీటిని చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశించారు. కంట్రోల్ రూమ్కి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి చర్యలు చేపట్టాలన్నారు. దాదాపు 75 ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచినట్లు అధికారులు గుర్తించారు.
ఎండలు తీవ్రంగా ఉండటంతో బాటసారులు, పౌరులకు చల్లటి తాగునీరందించేలా నగరవ్యాప్తంగా చలివేంద్రాల సంఖ్య పెంచాలని జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఇబ్బందులు, రానున్న వర్షాకాలానికి కార్యాచరణపై అధికారులతో సమీక్షించారు. తాగునీటి సరఫరా, ట్యాంకర్ల నిర్వహణ, వినియోగదారుల ఫిర్యాదులపై ఆరా తీశారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో సిబ్బంది దృష్టి సారించాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని గతంలో మర్యాదపూర్వకంగానే కలిశానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ మరోసారి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. HYD తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను BRSలో సంతృప్తిగా ఉన్నాననన్నారు. బీసీలకు ఎక్కువ సంఖ్యలో టికెట్లు ఇచ్చిన BRSను ఆదరించాలన్నారు.
నగరాభివృద్ధి కోసం జీహెచ్ఎంసీ అవలంబిస్తున్న పథకాలను కమిషనర్ రోనాల్డ్ రాస్ శిక్షణ ఐఏఎస్లకు వివరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డెమోగ్రఫీ, శానిటేషన్, చెత్త సేకరణ, డిస్పోజల్, సీ అండ్ డీ అడ్మినిస్ట్రేషన్, ఆస్తి పన్ను వసూలు తదితర పథకాలను ఆయన వివరించారు. సమావేశంలో ఈఎన్సీ జియాఉద్దీన్, అదనపు కమిషనర్ ఉపేందర్ రెడ్డి, శిక్షణ ఐఏఎస్లు పాల్గొన్నారు.
వయోధికుడి నుంచి రూ.91.64 లక్షలు సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. నగరానికి చెందిన 74 ఏళ్ల వయోధికుడికి ఫెడెక్స్ కొరియర్ నుంచి ఓ వ్యక్తి కాల్ చేశాడు. మీకు వచ్చిన పార్సెల్లో మత్తు పదార్థాలు ఉన్నాయని బెదిరించారు. కేసు నుంచి తప్పించాలంటే తమకు డబ్బు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు భయపడ్డ వయోధికుడు రూ.91.64లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు.
Sorry, no posts matched your criteria.