India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్లో ఇంటి వద్ద ఓటు వేసే సదుపాయాన్ని 531 మంది వృద్ధులు ఉపయోగించుకున్నట్లు హైదరాబాద్ ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్ రాస్ ప్రకటించారు. హైదరాబాద్లో ఇప్పటి వరకు 5,233 మంది ఉద్యోగులు తపాలా ఓటు వేశారని, అందులో ఆదివారం ఓటు వేసిన ఎన్నికల అధికారులే 1,914 మంది ఉన్నారని చెప్పారు. ఎన్నికల విధులకు హాజరయ్యే వారు తపాలా ఓటు వేయాలని సూచించారు.
ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు మోదీ మేలు చేశారని బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత అన్నారు. HYD కార్వాన్లో ఏర్పాటు చేసిన గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనంలో మాజీ గవర్నర్ తమిళిసైతో కలిసి మాధవీలత పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు బీజేపీకి ఉందని తెలిపారు. సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకున్న నేత పీఎం మోదీ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దళితవర్గాల ప్రయోజనమే తెలంగాణ ప్రయోజనంగా భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మొదటి నుంచి దళిత వర్గాలకు అన్ని రకాలుగా అండదండలు అందించారని MRPS రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మాదిగ సామాజిక వర్గం తీరని వేదనకు గురవుతోందని వాపోయారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
JNTU కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్కు ఇచ్చిన మాదిరిగానే వర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించాలని BC సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ విద్యాశాఖ అధికారులను కోరారు. OUలో ఆయన మాట్లాడారు. తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాలులతో కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. స్టూడెంట్స్కు ఉపశమనం కలిగే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్కు ఒక్క రూపాయి తీసుకొరాని కిషన్ రెడ్డి ఓట్లు ఎలా అడుగుతారని KTR ప్రశ్నించారు. ఆదివారం రాత్రి రాంనగర్ చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. గత 10 ఏళ్లుగా నగరంలో BRS 36 ఫ్లై ఓవర్లు కట్టిందన్నారు. అంబర్పేట, ఉప్పల్లో BJP మొదలుపెట్టిన ఫ్లై ఓవర్లు నేటికీ పూర్తికాలేదన్నారు. గతంలో వరద బాధితులకు కనీసం సాయం చేయడానికి ముందుకు రాని BJP నేతలను ప్రజలు నిలదీయాలన్నారు. దీనిపై మీ కామెంట్?
> అబిడ్స్లోని ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
> కాచిగూడ YMCAలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం
> ఉప్పల్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య మంజరి
> కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు
> నగరంలో జోరుగా ఎన్నికల ప్రచారం
> సిద్ధమవుతోన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్
> 170 చలివేంద్రాలు ఏర్పాటు చేశాం: HMWSSB
KCR ఉంటేనే నగరం బాగు పడుతుందని ప్రజలు నమ్మి 16 సీట్లు ఇచ్చారని KTR అన్నారు. ఇతర జిల్లాల్లో ప్రజలు కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయారన్నారు. రూ. 2500, వృద్ధులకు రూ. 4 వేలు, రైతు భరోసా, తులం బంగారం అంటూ అమలుకాని హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. కర్మన్ఘాట్లో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న KTR.. BJPకి ఓటు వేస్తే HYDను యూటీ చేస్తారు.. కచ్చితంగా లూటీ చేస్తారని విమర్శించారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో BJP సభ కొనసాగుతోంది. మరికాసేపట్లో ప్రాంగణానికి అమిత్ షా రానున్నారు. ఇప్పటికే వేలాది మంది కార్యకర్తలు సభకు చేరుకొన్నారు. భద్రతా చర్యల దృష్ట్యా సిటీ పోలీసులు ఆంక్షలు విధించారు. సంగీత్ X రోడ్ నుంచి బేగంపేట, పంజాగుట్ట వెళ్లేవారిని క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, CTO, రసూల్పురా మీదుగా మళ్లిస్తున్నారు. పరేడ్ చుట్టూ వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
SHARE IT
MP ఎన్నికల్లో సికింద్రాబాద్ హాట్ ఫేవరేట్గా మారింది. కిషన్ రెడ్డి, పద్మారావు, దానం పోటీలో ఉండటం అంచనాలు పెంచింది. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇక్కడ జాతీయ పార్టీలదే హవా. ఒకే ఒక్కసారి తెలంగాణ ప్రజాసమితి(1971) గెలిచింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా BRS ఖాతా తెరవలేదు. ఈసారి పజ్జన్న నిలబడటంతో టగ్ ఆఫ్ వార్ అని టాక్. BJP, INC గెలుపుపై ధీమాతో ఉన్నారు. ప్రజానాడీ ఎటువైపనేది ఉత్కంఠగా మారింది.
గ్రేటర్ HYDలో రికార్డ్ స్థాయి విద్యుత్ వినియోగం నమోదైనట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మే 4న 90.68 మిలియన్ యూనిట్లకు దాటినట్లు పేర్కొన్నారు. 2023లో ఇదే రోజు 59.98 మిలియన్ యూనిట్లు మాత్రమే నమోదయిందని, కానీ.. ఈ ఏడాది దాదాపు 51 శాతం అధికంగా విద్యుత్ వినియోగం నమోదయినట్లు వెల్లడించారు. ఈ వేసవిలో ఎంత డిమాండైనా తట్టుకునేనుందుకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.