Hyderabad

News September 3, 2024

HYD: హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనం.. విచారణ వాయిదా

image

HYD హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జన వ్యవహారంపై ఏటా చివరి క్షణంలో కోర్టును ఆశ్రయిస్తే ఎలా అంటూ పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. వినాయక చవితికి ముందు పిటిషన్లు వేసి కోర్టుపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం సరికాదంది. ఇప్పటికే ఇందులో ఉత్తర్వులు ఉన్నాయని, వాటిని పరిశీలిస్తామని పేర్కొంటూ విచారణను ఈనెల9వ తేదీకి వాయిదా వేసింది. కాగా హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై ఏటా చర్చ జరుగుతోంది.

News September 3, 2024

HYD: GHMC పరిధిలో నిత్యావసరాల పంపిణీ: సీఎం

image

జీహెచ్ఎంసీ పరిధిలో వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో సమీక్షించారు. ‘హైదరాబాద్‌లో ఎక్కడా చిన్న ఆవాంఛనీయ ఘటన జరగడానికి వీల్లేదు. విద్యుత్, ట్రాఫిక్, తాగునీరు, పారిశుద్ధ్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలి. కూలీలు పనులు దొరక్క ఇంటి దగ్గరే ఉండిపోతారు. వారిని గుర్తించి బియ్యం, పప్పులు, నిత్యావసర సరకులు పంపిణీ చేయాలి’ అని సీఎం ఆదేశించారు.

News September 3, 2024

జూబ్లీహిల్స్: పబ్బుల్లో పట్టుబుడుతోంది డీజేలే!

image

హుషారైన సంగీతంతో ఉర్రూతలూగించే డీజేలతో యువత మత్తు ఊబిలో చిక్కుకుంటున్నారు. పబ్బుల్లో పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారులు ఎప్పుడు డ్రగ్స్ తనిఖీలు చేపట్టినా డీజేలు దొరికిపోతున్నారు. కేవలం వినియోగం మాత్రమే కాదు.. ఏకంగా గోవా, బెంగళూరు, ముంబయి నగరాల్లోని డ్రగ్ డీలర్లతోనూ డీజేలకు లింకులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. కాగా జూన్ మూడో వారం నుంచి డ్రగ్స్ కేసుల్లో ఆరుగురు డీజేలు దొరికిపోయారు.

News September 3, 2024

HYD: కంట్రోల్ రూమ్‌లు 24 గంటలు పనిచేయాలి: CS

image

మంగళవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..’జిల్లాల కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కంట్రోల్ రూమ్‌లు 24 గంటలు పనిచే సేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 3, 2024

HYD: స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై పిటిషన్ కొట్టివేత

image

దివ్యాంగులకు రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రాథమిక దశలోనే హైకోర్టు కొట్టివేసింది. స్మితా సభర్వాల్ వ్యాఖ్యల వల్ల ఎవరి హక్కులకూ భంగం కలగలేదని, ఎవరూ నష్టపోలేదని, వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఆమెకు ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది.

News September 3, 2024

ప్రతీనెల 10న పాఠశాలలను సందర్శించాలి: కలెక్టర్

image

ప్రత్యేక అధికారులు ప్రతినెలా 10 పాఠశాలలను సందర్శించి రిజిస్టర్లను పరిశీలించాలని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్లో డీఈవో, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలను సందర్శించి నివేదికలు సమర్పించడానికి నియమించబడిన ప్రత్యేక అధికారులు వారానికి 2, నెలలో 10 పాఠశాలలను పరిశీలించాలని అన్నారు.

News September 3, 2024

HYD: సర్పంచుల పరిస్థితి దారుణం

image

కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచులకు బిల్లులు చెల్లించకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా మారిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మాట్లాడారు. ‘రూ.1300 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని గవర్నర్‌ను కలిసి సర్పంచులు మొర పెట్టుకున్నారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.600 కోట్లు ఎక్కడికి పోయాయి? గ్రామ పంచాయితీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది’ అని ప్రభుత్వంపై మండిపడ్డారు.

News September 3, 2024

HYD: ఇకనుంచి గల్లీల్లోనే ఆధార్ సేవలు

image

ఆధార్ సేవలను సులభతరం చేసేందుకు అబిడ్స్ జీపీవో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి వీధుల్లోనే ఆధార్ సేవలు అందించనున్నారు. అబిడ్స్‌లోని జీపీవోకి వచ్చి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా కావాల్సిన తేదీల్లో శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పుటికే ధూల్ పేట, కొండాపూర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో సేవలందించామని, ఇందుకు నామమాత్రపు రుసుం చెల్లించాలని చీఫ్ పోస్ట్ మాస్టర్ ప్రసాద్ తెలిపారు.

News September 3, 2024

HYD: రోడ్లన్నీ గోతులే.. రోజుకు వేలల్లో ఫిర్యాదులు

image

వర్షానికి నగరంలోని రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. సీసీ రోడ్లు, బీటీ రోడ్లని తేడాలేకుండా గుంతలుపడి నీళ్లు నిలిచాయి. మ్యాన్‌హోళ్ల మరమ్మతులు లేక రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. మహానగంలో ఉమ్మడి జిల్లాను కలుపుతూ 10వేల కి.మీ.ల రోడ్లుంటే అందులో 885 కి.మీ. ప్రధాన రహదారులు నిర్వహణ బాధ్యత ప్రైవేట్ సంస్థలది. వీటిపై అధికారులు పర్యవేక్షణను గాలికొదిలేశారు. బల్దియాకు రోజుకు 1000కిపైగా రహదారులపై కంప్లెంట్స్ వస్తున్నాయి.

News September 3, 2024

HYD: ప్రజలకు హెచ్చరికలు జారీ చేయలేదు: KTR

image

HYD వాతావరణ కేంద్రం ఆగస్టు 27న పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందని MLA KTR తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసినా.. ఈ కుంభకర్ణ కాంగ్రెస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్తలు, ప్రజలకు హెచ్చరికలు జారీ చేయలేదన్నారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఓ యువ శాస్త్రవేత్త, 20 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. KTR వ్యాఖ్యలపై మీ కామెంట్..?