India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చారిత్రక నేపథ్యం ఉన్న ఘట్కేసర్ (M) ఏదులాబాద్లోని మన్నారు గోదాదేవి సమేత రంగనాథస్వామి దేవాలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. TG,APలో ఏకైక ఆలయంగా ప్రఖ్యాతిగాంచింది. ఈఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పలదేశికుడికి ఆండాళ్ దేవికలలో దర్శనమిచ్చి ఆలయ నిర్మాణానికి ఆదేశించింది. జమీందారుల విరాళాలతో గుడి నిర్మాణం సాధ్యమైంది. సంతానప్రదాయినిగా గాజులమ్మను కొలుస్తారు. నాగుల పంచమినాడు మట్టిగాజులు సమర్పిస్తారు.

ఆర్థిక సమస్యలు తాళలేక ఓ యువ ఆర్కిటెక్ట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కరీంనగర్కు చెందిన అనుదీప్ ఓ ప్రైవేట్ సంస్థలో ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిల ఫొటోలతో సైబర్ నేరగాళ్లు విసురుతున్న వలల్లో యువత చిక్కుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వేదికగా అమ్మాయిల పేరుతో ఫేక్ ప్రొఫైల్ సృష్టించి ఫ్రెండ్ రిక్వెస్ట్లు, ఆఫర్స్ అంటూ లింకులు పెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల మేడ్చల్(D) మల్లాపూర్కు చెందిన ఓవ్యక్తి రూ.42,590 పోగొట్టుకున్నాడు. సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించినా తగ్గటం లేదు.

సైబర్ నేరాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో CERT ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మెసేజెస్ పంపుతుంది. మీరు సైబర్ నేరాల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. బోట్నెట్ ఇన్ఫెక్షన్లు, మాల్వేర్ల నుంచి మీ పరికరాన్ని సురక్షితంగా ఉంచడానికి, CERT-In GoI https://www.csk.gov.inలో ఉచిత బాట్ రిమూవల్ టూల్ని డౌన్లోడ్ చేసుకోవాలని HYD టీమ్ సూచించింది.

ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం భారీ స్కెచ్ వేసి, RR(D)లోని 56 గ్రామాలను FCDA పరిధిలోకి తీసుకువచ్చింది. ఇక్కడి భూముల క్రయవిక్రయాలు, లేఅవుట్లకు ఇకపై పంచాయతీల సంతకాలు చెల్లకపోగా, గ్రామసభల ప్రమేయం లేకుండానే సాగు భూములను కమర్షియల్ జోన్లుగా మార్చే అధికారం బోర్డుకే కట్టబెట్టింది. భూములపై పూర్తి పట్టుకోసమే ఈ ‘సూపర్ బాడీ’ని తెచ్చారని, అభివృద్ధి ముసుగులో పల్లెగొంతు నొక్కేస్తున్నారని స్థానికులు అంటున్నారు.

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో ఎదురవుతున్న భూసేకరణ అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బాపుఘాట్ పరిసరాల్లో ఉన్న సుమారు 200 ఎకరాల డిఫెన్స్ భూమిని సేకరించేందుకు కేంద్రంతో సంప్రదింపులు తుది దశకు చేరుకున్నాయి. ఈ భూమి లభిస్తే, నది వెడల్పును పెంచడంతో పాటు అక్కడ భారీ స్థాయిలో ‘నైట్ ఎకానమీ’ హబ్, అంతర్జాతీయ స్థాయి వాక్-వేలను నిర్మించవచ్చని అధికారులు Way2Newsకు తెలిపారు.

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో ఎదురవుతున్న భూసేకరణ అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బాపుఘాట్ పరిసరాల్లో ఉన్న సుమారు 200 ఎకరాల డిఫెన్స్ భూమిని సేకరించేందుకు కేంద్రంతో సంప్రదింపులు తుది దశకు చేరుకున్నాయి. ఈ భూమి లభిస్తే, నది వెడల్పును పెంచడంతో పాటు అక్కడ భారీ స్థాయిలో ‘నైట్ ఎకానమీ’ హబ్, అంతర్జాతీయ స్థాయి వాక్-వేలను నిర్మించవచ్చని అధికారులు Way2Newsకు తెలిపారు.

చైల్డ్ పో*ర్న్ చూస్తున్న వ్యక్తులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 18 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. TG వ్యాప్తంగా 24 మందిని అరెస్ట్ చేయగా.. వీరిలో హైదరాబాద్ చెందిన యువకులు అధికంగా ఉన్నట్లు తేలింది. వీడియోలు చూడడమే కాకుండా, షేర్ చేయడం, అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు. వీరిలో ఇరిగేషన్ శాఖలో పని చేసే ఉద్యోగి కూడా ఉండటం గమనార్హం.

సిటీలో సంక్రాంతి ముందే వచ్చేసింది. శుక్రవారం సాయంత్రం ఓల్డ్ సిటీ, అశోక్నగర్, తార్నాక, మల్కాజిగిరి గల్లీల్లో ఎటు చూసినా పతంగిల సందడే. అపార్ట్మెంట్ టెర్రస్ యాక్సెస్ ఒక ‘స్టేటస్ సింబల్’గా మారగా ఇండిపెండెంట్ హౌసెస్ మీద లోకల్ స్లాంగ్తో పందేలు కాస్తున్నారు. ఒక మేడ మీద పాత తెలుగు హిట్లు, పక్క బిల్డింగ్లో మాస్ బీట్ల మధ్య ‘కాటే’ కేకలు ఊదరగొడుతున్నాయి. ఈ ‘టెర్రస్ వార్’ ఇప్పుడు పీక్స్కు చేరింది.

హుస్సేన్సాగర్.. ప్రశాంతంగా ఉండే బుద్ధుడి విగ్రహం, NTR మార్గ్లో స్ఫూర్తినిచ్చే భారీ అంబేడ్కర్ విగ్రహం, ట్యాంక్బండ్పై ఉద్యమ స్ఫూర్తిని రగిల్చే తెలంగాణ అమరుల స్థూపం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అర్ధరాత్రి వరకు ఇక్కడ సందర్శకుల సందడి ఉంటుంది. ఇంకా ఆ పక్కనే తెలంగాణ సచివాలయం స్పాట్ అందరికీ ఫేవరెట్. వినోదం కోసం లుంబిని పార్క్, ఇందిరా పార్క్ ఉన్నాయి. ఇటువంటి ప్రాంతంలో HMDA నైట్ బజార్కు ప్లాన్ వేస్తోంది.
Sorry, no posts matched your criteria.