Hyderabad

News August 30, 2025

భారీ వర్షాల నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దు

image

భారీ వర్షాలు కురిసి ట్రాక్స్ దెబ్బతిన్న కారణంగా పలు రైళ్లను ఈరోజు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ- నాగర్ సోల్, నిజామాబాద్- కాచిగూడ, నాందేడ్- మేడ్చల్, కాచిగూడ- కరీంనగర్, కాచిగూడ- మెదక్, సికింద్రాబాద్- సిద్దిపేట, కరీంనగర్- కాచిగూడ, మెదక్- కాచిగూడ, సిద్దిపేట- సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేశారు.

News August 30, 2025

సిటీకి సుస్తీ.. ఆస్పత్రుల్లో కుస్తీ

image

వాతావరణ మార్పులతో నగరానికి సుస్తీ చేసింది. దీంతో ప్రజలు ఆస్పత్రులకు ప్రజలు క్యూ కడుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో రోజుకు 2,200 నుంచి 2,500 మంది చికిత్సకు వస్తున్నారు. ఇక ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 400- 500 OP ఉండగా ఇప్పుడు రోజుకు 1,100- 1,300 మంది వస్తున్నారు. ఉస్మానియాలో సాధారణ OP 1,100 నుంచి 1,200 ఉండగా ఇప్పుడు 1,600-1,800 మంది వస్తున్నారు. ఒక్కో బస్తీ దవాఖానాకు 70- 90 మంది వస్తున్నారు.

News August 30, 2025

HYD: 10 ఏళ్ల తర్వాత హాజరవుతున్న సీఎం

image

టీచర్స్ డే.. ఉపాధ్యాయులు ఉప్పొంగే దినోత్సవం. ఈ వేడుకలో ఉపాధ్యాయుల ఆనందమే వేరు. ఈ అవార్డులు పొందిన టీచర్లకు ఆరోజు అభినందనలు వెల్లువెత్తుతాయి. ఇలాంటి వేడుకకు సీఎం వస్తే.. ఆ ఫీలే వేరు ఇది సగటు టీచర్ ఆనందం. ఎప్పుడో 2014లో రవీంద్రభారతిలో జరిగిన వేడుకలకు అప్పటి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత 10 ఏళ్లకు ఈ సెప్టెంబరు 5న రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. మాదాపూర్ శిల్పకళావేదికలో ఈ వేడుక నిర్వహించనున్నారు.

News August 30, 2025

HYD: గణేశుడితో పాటు బంగారం నిమజ్జనం!

image

హస్తినాపూర్ వాసులు గణేశుడికి వేసిన 5తులాల బంగారంతోనే శివారు తుర్కయంజాల్ మాసబ్‌చెరువులో నిమజ్జనం చేశారు. విషయాన్ని గుర్తించి జరిగిన విషయం మున్సిపల్ నోడల్ అధికారులు వినయ్, శ్రీధర్‌రెడ్డికి చెప్పారు. సిబ్బంది వెంటనే రంగంలోకి దింపగా.. JCB సహాయంతో శ్రమించి విగ్రహాన్ని బయటికి తీశారు. 5 తులాల బంగారాన్ని వారికి అందించారు. పోయిందనుకున్న బంగారం తిరిగి దక్కడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయ్.

News August 30, 2025

HYD: మెట్రో టైమింగ్స్ పొడిగింపు

image

మెట్రో రైలు టైమింగ్స్ శనివారం ప్రత్యేకంగా పొడిగించారు. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11:45 గంటలకు బయలుదేరనుంది. వినాయక మండపాల దర్శనాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఎక్కువ సమయం, భక్తి, సౌకర్యం కోసం ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాంటూ మెట్రో ప్రకటించింది.

News August 30, 2025

శేరిలింగంపల్లి: ‘360 లైఫ్‌’ ప్రాజెక్టు నిలిపివెయ్యండి: హైకోర్ట్

image

శేరిలింగంపల్లి ఇజ్జత్‌నగర్‌లో నిర్మిస్తున్న నమిత 360 లైఫ్‌ ప్రాజెక్టు నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫైర్, ఎయిర్‌పోర్టు ఎన్‌వోసీ లేకుండా నిర్మాణం జరుగుతుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. లోపాలను సరిదిద్దకుండానే ఎలా ఉత్తర్వులు జారీ చేశారని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

News August 30, 2025

జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు బీజేపీ యత్నం

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో విజయం సాధించాలని బీజేపీ వ్యూహం పన్నుతోంది. రాష్ట్ర అద్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు ఐదుగురి సభ్యులతో మానిటరింగ్‌ కమిటీని ప్రకటించారు. ఎమ్మెల్యే పాయల్‌ శంకర్, ఎంపీ రఘునందన్‌రావు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరావు, HYD సెంట్రల్‌ జిల్లా మాజీ ప్రెసిడెంట్‌ గౌతమ్‌రావును నియమించారు. బూత్ కమిటీ నాయకులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నారు.

News August 30, 2025

KPHB: భర్త గొంతు కోసి.. భార్య ఆత్మహత్యాయత్నం

image

KPHB PS పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక భర్త రామకృష్ణను భార్య రమ్యకృష్ణ గొంతు కోసి.. అనంతరం తానూ గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 30, 2025

దివంగత నేతలకు సంతాపం తెలపనున్న రాష్ట్ర శాసనసభ

image

నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై విస్తృత చర్చ జరిపేందుకు ప్రభుత్వం ఈ సెషన్ ఏర్పాటు చేసింది. 3 రోజుల పాటు సభ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉ.10:30 గంటలకు ఉప్పల్ మాజీ MLA దివంగత బండారు రాజిరెడ్డి, జూబ్లీహిల్స్ MLA దివంగత మాగంటి గోపీనాథ్‌లకు సంతాపం తెలపనున్నట్లు శాసనసభ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అనంతరం సభా కార్యక్రమాలు ప్రారంభమవనున్నాయి.

News August 30, 2025

డిఫెన్స్ భూములపై నివేదికలను అందించాలి: HYD కలెక్టర్

image

HYDలో గుర్తించిన డిఫెన్స్ భూములకు సంబంధించిన నివేదికలను వారంలోగా అందించాలని HYD కలెక్టర్ హరిచందన అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో డిఫెన్స్ భూములపై ఆమె సమీక్షించారు. ఈ భూముల్లో నిరుపేదలు నివాసముంటున్నందున ప్రభుత్వం 2002లో జారీచేసిన ఉత్తర్వుల మేరకు నివేదికలు ఇవ్వాలని, దీనిపై నివేదిక అనంతరం ల్యాండ్ వాల్యూయేషన్ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.