India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
KPHB PS పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక భర్త రామకృష్ణను భార్య రమ్యకృష్ణ గొంతు కోసి.. అనంతరం తానూ గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై విస్తృత చర్చ జరిపేందుకు ప్రభుత్వం ఈ సెషన్ ఏర్పాటు చేసింది. 3 రోజుల పాటు సభ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉ.10:30 గంటలకు ఉప్పల్ మాజీ MLA దివంగత బండారు రాజిరెడ్డి, జూబ్లీహిల్స్ MLA దివంగత మాగంటి గోపీనాథ్లకు సంతాపం తెలపనున్నట్లు శాసనసభ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అనంతరం సభా కార్యక్రమాలు ప్రారంభమవనున్నాయి.
HYDలో గుర్తించిన డిఫెన్స్ భూములకు సంబంధించిన నివేదికలను వారంలోగా అందించాలని HYD కలెక్టర్ హరిచందన అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో డిఫెన్స్ భూములపై ఆమె సమీక్షించారు. ఈ భూముల్లో నిరుపేదలు నివాసముంటున్నందున ప్రభుత్వం 2002లో జారీచేసిన ఉత్తర్వుల మేరకు నివేదికలు ఇవ్వాలని, దీనిపై నివేదిక అనంతరం ల్యాండ్ వాల్యూయేషన్ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.
విశ్వనగరంగా ఖ్యాతి గడిస్తున్న క్రమంలో HYD ఎన్నో అద్భుతాలకు నిలయమైంది. ఇదో మినీ ఇండియా. ఒక్కసారి నగరానికి వస్తే జ్ఞాపకంగా కాదు.. అందమైన అనుభూతిగా మారుతుందని ఎందరో ఖితాబిచ్చారు. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం, పరిచయాలు, పురాతనకట్టడాలు, స్ట్రీట్ఫుడ్, షాపింగ్ సెంటర్స్, మెట్రో ఈ ప్రాంతాన్ని మరిచిపోనివ్వవు. ‘HYD’ పదం వినగానే ఒక్కొక్కరికి ఒక్కోటి గుర్తొస్తుంది. మరి మీకేం గుర్తొస్తుందో కామెంట్ చేయండి.
వాతావరణంలో వచ్చిన మార్పులతో విషజ్వరాలు నగర ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. వైరస్, దోమకాటుతో జలుబు, దగ్గు, డెంగ్యూ, టైఫాయిడ్ వణికిస్తున్నాయి. బస్తీ దవఖానా నుంచి ఏరియా జిల్లా ఆస్పత్రి వరకు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. గాంధీ, నిమ్స్ ఇతర ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రుల్లో గత 2 నెలలతో పోల్చితే ఆగస్టులో విషజ్వరాల బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వైద్యాధికారులు తెలిపారు. జాగ్రత్తలు పాటించండి.
మహాగణపతి నిమజ్జన ఘట్టంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శాంతి భద్రతల విభాగం అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ ఆదేశించారు. ముఖ్యంగా ఖైరతాబాద్ మహా గణపతి క్రేన్ వద్దకు వచ్చే సమయంలో తొక్కిసలాటలు జరగకుండా చూడాలన్నారు. అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్లో పర్యటించారు.
LKG, UKG క్లాసులు ప్రైవేట్ స్కూళ్లల్లోనే కాదు సర్కారు బడుల్లోనూ స్టార్ట్ కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి యూకేజీ నిర్వహించాలని నిర్ణయించింది. మహానగర వ్యాప్తంగా ఎంపిక చేసిన 114 స్కూళ్లల్లో ఈ అడ్మిషన్లు ఇస్తారు. గ్రేటర్ పరిధిలో 25, మేడ్చల్ పరిధిలో 24, రంగారెడ్డి పరిధిలో 65 పాఠశాలలను ఎంపిక చేశారు. దీనిపై మీ కామెంట్?
రాష్ట్రంలోనే ఘనత వహించిన గాంధీ ఆస్పత్రిలో గత 24 గంటలుగా నీరు లేక అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి గాంధీ పంప్ హౌస్లోని పంపుసెట్లు మోరాయించడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. అటు తాగునీటికి ఇటు కాలకృత్యాలకు నీరు లేక ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్లోని పేషెంట్లు వారి సహాయకులు, నర్సింగ్ సిబ్బంది నరకయాతన అనుభవించారు. పలు ఆపరేషన్లు నిలిచిపోయాయి. కాసేపటి క్రితం నీటి సరఫరాను పునరుద్ధరించారు.
జిల్లాలో గుర్తించిన డిఫెన్స్ ల్యాండ్స్కు సంబంధించిన నివేదికలను వారంలో అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్వాన్ MLA కౌసర్ మోహియుద్దీన్,
నాంపల్లి MLA మాజీద్ హుస్సేన్, MLC మీర్జా రహమత్ బేగ్తో కలసి ఆసిఫ్నగర్, గోల్కొండ, నాంపల్లి, షేక్పేట్లో గుర్తించిన డిఫెన్స్ భూములపై సమీక్షించారు.
వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు సందడి నెలకొంది. భక్తులు తమ నివాసాలు, వీధుల్లో ప్రతిష్ఠించిన చిన్న విగ్రహాలను చెరువుల వద్దకు తీసుకొస్తున్నారు. ట్యాంక్బండ్, సరూర్నగర్ చెరువు, మీర్పేట మంత్రాల చెరువు, సఫీల్గూడ మినీ ట్యాంక్బండ్ వద్ద కోలాహలం నెలకొంది. గుండె నిండా భక్తితో మళ్లీ రావయ్య గణపయ్య అంటూ సాగనంపుతున్నారు. గంగ ఒడికి గణపయ్య చేరుతోన్న సమయంలో భక్తుల భావోద్వేగం కంట తడి తెప్పిస్తోంది.
Sorry, no posts matched your criteria.