India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ప్రస్తుతం చిరుజల్లులు పడుతున్నాయి. రాజధాని రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. నేడు, రేపు భారీ వర్ష సూచనతో అధికారులు అప్రమత్తమయ్యారు. తడి రోడ్ల మీద వాహనాలను నెమ్మదిగా నడపాలని ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎదైనా అత్యవసరమైతే 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
SHARE IT
హైదరాబాద్లో మిలద్-ఉన్-నబి ఉత్సవాలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 16వ తేదీకి బదులుగా అదే నెల 19వ తేదీన జరుగనున్నాయి. ఈ మేరకు మిలాద్ వేడుకల నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి వేడుకలను దృష్టిలో ఉంచుకుని మిలాద్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గణేష్ చతుర్థి, మిలాద్-ఉన్-నబీ పండగలు కలిసి వచ్చినందున వాటి ఏర్పాట్లపై సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
విద్యుత్ స్తంభాల నుంచి అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను TGSPCDL మేనేజింగ్ డైరెక్టర్ ముష్రఫ్ ఫరూఖీ శుక్రవారం ఆదేశించారు. తొలగించనివారిపై చర్యలు తీసుకుంటామని, ఆదేశాలు పాటించకుంటే తామే స్వయంగా కేబుళ్లు తొలగిస్తామని విద్యుత్ శాఖాధిపతి తెలిపారు.
HYD నగర ప్రజలకు తాగునీరు అందించే గండిపేట ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ పరిరక్షణ బాధ్యతలను కూడా జలమండలి నుంచి హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నట్లు CS శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్లో హైడ్రా పరిధిలో ప్రస్తుతం 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వాటిని మరింత పెంచి, బలోపేతం చేస్తామన్నారు. కలెక్టర్లు, సీపీ, ఇతర శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో పలు అంశాల గురించి వివరించారు.
విపత్తుల నియంత్రణపై పదేళ్లుగా ప్రణాళిక లేకపోవడంపై మంత్రి పొంగులేటి విస్మయం వ్యక్తం చేశారు. గురువారం 9 విభాగాల అధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే 2నెలల్లో హైదరాబాద్, గోదావరి పరివాహక జిల్లాల్లో వరదలు సంభవించే అవకాశం ఉన్నందున జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయాలన్నారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అందరికీ ఒకే రూల్ ఉండాలని MLA హరీశ్ రావు అన్నారు. HYDలోని HYDRA ఆఫీస్ బుద్ధ భవన్ నాలా కింద ఉందని,కమిషనర్ రంగనాథ్ ముందు దానిని కూలగొట్టాలని అన్నారు.నెక్లెస్ రోడ్డులోని ప్రైవేట్, కమర్షియల్ షాపులు, తదితర వాణిజ్య భవనాలు హుస్సేన్ సాగర్ FTLపరిధిలో ఉన్నాయని వాటిని కూలగొడతారా అని ప్రశ్నించారు. కొందరివి డైరెక్ట్గా కూలగొట్టి, మరికొందరికి నోటీసులిచ్చి టైం ఇస్తున్నారని ఆరోపించారు.
చనిపోతూ ఐదుగురికి LIFE ఇచ్చాడు ఓ యువకుడు. MBNR హన్వాడ వాసి చెన్నయ్య(35) ఈ నెల 26న యాక్సిడెంట్లో గాయపడగా HYD ఉస్మానియాలో చేర్చారు. వైద్యం అందించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. తండ్రి గోపాల్, కుటుంబ సభ్యులను ఒప్పించి అతడి కాలేయం, 2 కిడ్నీలు (జీవన్దాన్) సేకరించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అమర్చారు. దీంతో ఐదుగురి ప్రాణాలు నిలబెట్టాడని జీవన్దాన్ ఇన్ఛార్జ్ స్వర్ణలత తెలిపారు.
వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారి కోసం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి, ఇంటర్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు పొందే అభ్యర్థులు జిల్లా పరిధి స్టడీ సెంటర్లను సంప్రదించాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం జిల్లా కో-ఆర్డినేటర్ను ఫోన్ నంబర్ 8008403516లో సంప్రదించాలని కోరారు.
హైదరాబాద్ వాసులే కాకుండా రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసే వినాయకచవితి సమీపిస్తోంది. నవరాత్రులకు మరో వారం రోజులే సమయం ఉండడంతో బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి వారు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గురువారం Aagman-2024ను నిర్వహించారు. ధూల్పేట నుంచి మధ్యాహ్నం బయల్దేరిన భారీ గణనాథుడు సాయంత్రానికి బాలాపూర్లోని మండపం వద్దకు చేరుకున్నాడు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ఘన స్వాగతం పలికారు.
➤HYDలో పర్మిషన్ కోసం ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
➤మీ సేవలో చలాన్ కట్టాలి. (రూ. 145+100)
➤ఐదుగురు ఆర్గనైజర్ల ‘ఆధార్’ అవసరం.
➤మండపం చుట్టుపక్కల ఓనర్ల నుంచి NOC జతచేసి సంబంధిత PSలో సమర్పిస్తే అనుమతి పొందవచ్చు.
➤పర్మిషన్ తీసుకుంటే కరెంట్ FREE అని CM రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు.
SHARE IT
Sorry, no posts matched your criteria.