India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. వేలమంది నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. గత ఏడు నెలల్లో దాదాపు 98 లక్షల మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిచారు. అంటే రోజుకు 44 వేల మంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారన్న మాట. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కోటికి చేరుకోవడానికి పెద్ద సమయమేం పట్టదు.
మన నగరానికి ప్రపంచ వ్యాప్త నగరాల సౌకర్యాల జాబితాలో ఉన్న స్థానం 109. అదే జాతీయ స్థాయిలో అయితే మూడవ స్థానం. దేశంలో మొదటి రెండు స్థానాలు ఢిల్లీ, ముంబయి దక్కించుకున్నాయి. ఉద్యోగ, ఉపాధి, ప్రజారవాణా, వైద్యం తదితర రంగాల్లో ఉన్న సౌకర్యాలను చూసి ఐఎండీ అనే అంతర్జాతీయ సంస్థ ఈ ర్యాంకులు ఇచ్చింది.
చంద్రాయణగుట్ట, సైదాబాద్, మలక్పేట, సంతోష్ నగర్ పరిధిలోని వివిధ వినాయక మండపాల వద్ద 1,135 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బంది 345 మంది, 2 ప్లాటూన్ల సిబ్బంది 40 మందితోపాటు సిటీకి చెందిన 750 మంది ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూస్తున్నారు. ఇక శోభాయాత్ర సందర్భంగా మరికొంతమంది భద్రత కోసం వస్తారు.
చర్లపల్లి జైలులో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులను జైళ్లశాఖ సస్పెండ్ చేసింది. గత ఆదివారం రిమాండ్ ఖైదీ శంత్ కమర్కు పెయింటింగ్ పనులు అప్పగించారు. అతడు పెయింటింగ్ వేస్తున్నట్లు నటించి గోడదూకి పరారయ్యాడు. సీరియస్గా పరిగణించిన ఉన్నతాధికారులు వార్డెన్ భరత్తో పాటు అసిస్టెంట్ డిప్యూటీ జైలర్లు సుబ్బరాజు, వసంత్ కుమార్లను సస్పెండ్ చేశారు. విచిత్రమేమంటే అదేరోజు అతడు పోలీసులకు చిక్కాడు.
సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమం ఈనెల 30న రవీంద్రభారతిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ సంస్మరణ సభకు తెలుగు రాష్ట్రాల సీఎం చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిని ఆహ్వానించామని ఆయన పేర్కొన్నారు.
సెప్టెంబర్ 22 నుంచి వారం రోజుల పాటు (28 వరకు) ఓపెన్ 10, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు కూడా అక్టోబర్ 6- 13 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓపన్ స్కూల్ సొసైటీ (TOSS) డైరెక్టర్ శ్రీహరి తెలిపారు. విద్యార్థులు ఈ విషయం గమనించి పరీక్షలకు హాజరు కావాలని కోరారు.
KPHBలోని అడ్డగుట్ట సొసైటీలో ఏకదంత మిత్రమండలి ఆధ్వర్యంలో 4 ఏళ్లుగా వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది అయోధ్యలోని బలరాముడి తరహాలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరిని ఆకట్టుకున్నారు. సంస్కృతి సంప్రదాయాలు ప్రజలందరికీ తెలిసేలా ఇక్కడ నిత్యం కార్యక్రమాలు చేపడుతున్నారు.
HYD శివారు శంకర్పల్లిలోని చందిప్ప గ్రామంలో గల 11వ శతాబ్దపు శ్రీరాముడు ప్రతిష్ఠించిన పురాతన బ్రహ్మసూత్ర మరకత శివలింగంపై శుక్రవారం ఉదయం సూర్య కిరణాలు పడ్డాయి. ఆలయ అర్చకుడు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. శివలింగంపై సూర్య కిరణాలు పడటం చాలా అరుదని ఆలయ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.
రోడ్ల ఆక్రమణలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా ప్రయత్నాలను హై కోర్టు జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి కొనియాడారు. రాంనగర్ క్రాస్రోడ్స్ వద్ద రోడ్ల ఆక్రమణలపై దాఖలైన PIL విచారణ సందర్భంగా ప్రజా రోడ్లు, పార్కులను కాపాడటంలో హైడ్రా చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అధికారులు, ప్రజల ఉమ్మడి బాధ్యతని పేర్కొన్నారు.
ఇవాళ ఉదయం సైకిల్పై పనికి వెళ్లే ఇద్దరికి ఓ బైకిస్ట్ ఇలా లిఫ్ట్ ఇచ్చాడు. అబిడ్స్లో ఓ చోట పనిచేయడానికి మలక్పేట్ పరిసర ప్రాంతాల నుంచి వారిద్దరు నిత్యం సైకిల్పై వెళ్తుంటారు. కాగా ఓ బైకర్ ఇలా లిఫ్ట్ ఇవ్వడంతో 20-25నిమిషాల సైకిల్ జర్నీ 10MINలో పూర్తైందని చెబుతున్నారు. ఇలాంటి సహసాలు చేస్తే ఇతర ప్రయాణికులకూ ప్రమాదమని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్.
Sorry, no posts matched your criteria.