Hyderabad

News August 30, 2024

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచాలి: CM

image

మ‌త సామ‌ర‌స్యానికి, ప్ర‌శాంత‌త‌కు పేరుగాంచిన HYD బ్రాండ్ ఇమేజ్‌ను మ‌రింత పెంచేలా గ‌ణేశ్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ ఉండాల‌ని CM రేవంత్ రెడ్డి అన్నారు. వినాయకచవితి వేడుకలపై సెక్రటేరియట్‌లో ఆయన స‌మీక్ష నిర్వహించారు. ఉత్స‌వ క‌మిటీలు, మండప నిర్వాహ‌కులు, ప్ర‌భుత్వ అధికారులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌ని CM సూచించారు. పోలీస్ పర్మిషన్ తీసుకునేవారు కరెంట్ కనెక్షన్ కోసం ఎటువంటి డీడీ కట్టనవసరం లేదన్నారు.
SHARE IT

News August 29, 2024

ఎంబీఏ పరీక్షా జవాబు పత్రాల నకలు పొందేందుకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షల జవాబు పత్రాల నకలు పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంబీఏ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామన్నారు. జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపర్‌కు రూ.1,000 చొప్పున చెల్లించి వచ్చేనెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News August 29, 2024

HYD: అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు

image

చెరువు గర్భంలో, ఎఫ్టీఎల్ , బఫర్ జోన్లలో భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం క్షమించరాని నేరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో మాట్లాడారు. అక్రమ నిర్మాణాలకు తోడ్పాటు అందించిన అధికారులు, కింది స్థాయి ఉద్యోగులను గుర్తించే ప్రక్రియను హైడ్రా మొదలు పెట్టిందని వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేటు నిర్ణయించి మరీ వసూళ్లు చేశారనే ఆరోపణలు ఉన్న అధికారులపై చర్యలు ఉంటాయన్నారు.

News August 29, 2024

నెల రోజులుగా గాంధీ చీఫ్ డైటీషియన్ పోస్టు ఖాళీ

image

గాంధీ ఆస్పత్రిలో గత నెల రోజులకు పైగా చీఫ్ డైటీషియన్ పోస్టు ఖాళీగా ఉంది. పేషంట్లు, డ్యూటీ డాక్టర్లకు రోజూ ఫుడ్ అందించే డైట్ క్యాంటీన్‌లో చీఫ్ డైటీషియన్ పోస్ట్ ఖాళీ అవ్వడంతో పర్యవేక్షణలో లోపాలు ఉంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి డైటిక్స్‌లో డైటీషియన్, చీఫ్ డైటీషియన్ 2 పోస్టులు ఉండాల్సి ఉంది. కానీ, చాలా కాలంగా డైటీషియన్ పోస్ట్ ఖాళీ ఉండగా గత నెల చీఫ్ డైటీషియన్ బదిలీపై వెళ్లిపోయారు.

News August 29, 2024

మాదాపూర్: దుర్గం చెరువులోని 204 భవనాలకు నోటీసులు

image

హైడ్రా కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల GHMC అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో బిక్కుబిక్కుమంటున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో CM సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నాయి. ఎఫ్టీఎల్‌లో ఉన్న ఇంటిపై ఎఫ్ అని మార్కింగ్ కూడా చేశారు.

News August 29, 2024

HYD: సుందరీకరణ మాటున చెరువుల ఆక్రమణలు

image

గ్రేటర్ పరిధిలో చెరువులను సుందరీకరణ పేరుతో సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత ముసుగులో అక్రమాలకు తెరతీశాయి. శేరిలింగంపల్లి, గండిపేట్ మండలాల్లో చెరువులను సంరక్షిస్తామని కొన్ని రియల్ సంస్థలు జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకొని బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్‌లను ఆక్రమించుకుంటున్నాయి. స్థానికంగా నిర్మించిన బహుళ అంతస్తుల నిర్మాణ వ్యర్ధాలను చెరువులో కలుపుతున్నాయి.

News August 29, 2024

HYD: విమానం అత్యవసర ల్యాండింగ్.. దక్కని ప్రాణాలు

image

విమానంలో ఓ ప్రయాణికురాలిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. సిబ్బంది తెలిపిన వివరాలు.. కేరళకు చెందిన సోషమ్మ(89) బుధవారం కొచ్చి నుంచి ఓ విమాన సర్వీస్‌లో అమెరికాకు బయలుదేదారు. ప్రయాణంలో సోషమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్.. శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సోషమ్మను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News August 29, 2024

రాచకొండలో 19 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ

image

రాచకొండలో 19 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న ఆరుగురు ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్ కల్పించారు. ఉప్పల్ డీఐగా రామలింగారెడ్డిని, పహడీ షరీఫ్ డీఐగా దేవేందర్, మాడ్గుల సీఐగా జగదీష్, ఎల్బీనగర్ సీఐగా వినోద్ కుమార్, తదితరులకు పోస్టింగ్ ఇచ్చారు.

News August 29, 2024

HYD: ఓయూలో రూ.23 లక్షల ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌

image

ఓయూలో ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఎంబీఏ, టెక్నాలజీ మేనేజ్‌మెంట్ విద్యార్థులు 17 మందికి HDFC బ్యాంక్ కొలువులు ఇచ్చింది. రూ.8 లక్షల నుంచి రూ.23 లక్షల మధ్య వార్షిక వేతనంతో ఈ నియామకాలు జరిగాయి. MBA కళాశాలలో నాలుగో సెమిస్టర్ చదువుతున్న 120 మంది విద్యార్థుల్లో 109 మందికి వేర్వేరు కంపెనీలు నియామక పత్రాలు అందించనున్నాయి.

News August 29, 2024

ఓయూ పీజీ పరీక్షలు 19కి వాయిదా

image

ఓయూ పరిధిలో జరగనున్న పీజీ రెగ్యులర్ కోర్సుల పరీక్షలు వచ్చేనెల 19కి వాయిదా వేశారు. మొదట ప్రకటించిన సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కావాల్సిన పీజీ కోర్సుల 2, 4వ సెమిస్టర్ పరీక్షలను యుజిసి నెట్, టిఎస్ సెట్ పరీక్షల కారణంగా వాయిదా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్ సైట్లో చూడవచ్చన్నారు.