Hyderabad

News August 28, 2025

HYD: నిమజ్జనోత్సవ భద్రతకు 30 వేల మంది పోలీసులు

image

మహానగరంలో వైభవంగా జరిగే గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రై కమిషనరేట్ల కమిషనర్లు అందుకు తగ్గ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. శోభాయాత్ర జరిగే సెప్టెంబర్ 6న 30,000 మంది పోలీసులను రంగంలోకి దించనున్నారు. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలని ఇప్పటికే కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News August 28, 2025

HYD: BEd అభ్యర్థులకు గమనిక.. ఇదే లాస్ట్ ఛాన్స్

image

BEdలో చేరాలనుకునే అభ్యర్థులకు ప్రభుత్వం చిట్ట చివరి అవకాశం కల్పిస్తోంది. రేపటి నుంచి (29వ తేదీ)నుంచి సెప్టెంబర్ 2 వరకు ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. రేపటినుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ పేమెంట్ చేయడంతోపాటు అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని సూచించారు. ఎంపికైన వారి వివరాలు 11న వెల్లడిస్తామన్నారు.

News August 28, 2025

KCR కీలక నిర్ణయం.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరం?

image

వచ్చేనెల 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి BRS కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అటు NDA అభ్యర్థికి గానీ, ఇండీ కూటమి అభ్యర్థికి గానీ ఓటు వేయకూడదని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ సీనియర్ నేత వినోద్ కుమార్ తెలిపారు.

News August 28, 2025

HYD: నవంబర్ 26 వరకు స్టార్టింగ్ స్టేషన్ల మార్పు

image

అభివృద్ధి పనుల్లో భాగంగా సికింద్రాబాద్ నుంచి నడిపే పలు రైళ్ల స్టేషన్లు నవంబర్ 26 వరకు ఇతర స్టేషన్లకు మార్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సిద్దిపేట రూట్‌లో వెళ్లే ట్రైన్ మల్కాజిగిరి నుంచి, పుణె రూట్‌లో నడిచే ట్రైన్లు నాంపల్లి నుంచి నడుస్తాయి. అలాగే దర్బంగ, సిల్చార్, అగర్తల, యశ్వంత్‌పుర, రాక్సాల్ స్టేషన్లకు వెళ్లే రైళ్లు చర్లపల్లి నుంచి నడుస్తాయని సీపీఆర్‌వో తెలిపారు.

News August 28, 2025

HYD నడిబొడ్డున బుల్లెట్ల వర్షానికి 25 ఏళ్లు

image

ప్రజాపోరాటం, దమనకాండకు చిహ్నంగా నిలిచిన బషీర్‌బాగ్‌ రక్తపాతానికి నేటికి 25 ఏళ్లు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలకు నాటి చంద్రబాబు సర్కార్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం అది. అదే 2000 AUG 28న ‘చలో అసెంబ్లీ’ నినాదం. నిరసనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయగా.. రాళ్ల వర్షంతో వారంతా తిరగబడ్డారు. పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టగా.. రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డి ప్రాణాలు విడిచారు.

News August 28, 2025

హైదరాబాద్‌లో 1.40 లక్షల గణనాథుడి ప్రతిమలు

image

మహానగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బస్తీ, కాలనీ, గల్లీ తేడా లేకుండా నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు. నగర వ్యాప్తంగా 1.40 లక్షల విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు అధికారుల అంచనా. నిమజ్జనం జరిగే వరకు ప్రత్యేక కార్యక్రమాలు, అన్నదానాలు ఏర్పాటు చేసి నవరాత్రులను ఘనంగా జరుపుకోనున్నారు. శుక్రవారం నుంచి నిమజ్జనాల హడావుడి షురూ అవుతుంది.

News August 28, 2025

భారీ వర్షాలు: HYD- ఆదిలాబాద్ వయా కరీంనగర్ రూట్ మ్యాప్

image

భారీ వర్షాలతో NH- 44 నాగ్‌పూర్ హైవే దెబ్బతింది. ప్రజల భద్రత కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డైవర్షన్ అమలు చేశారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న లారీలు మెడ్చల్ చెక్‌పోస్ట్ సిద్ధిపేట- కరీంనగర్ – కోరుట్ల – మెట్‌పల్లి- ఆర్మూర్- ఆదిలాబాద్ వెళ్లాలని సూచించారు. కార్లు తూప్రాన్- సిద్ధిపేట- జగిత్యాల- కోరుట్ల- మెట్‌పల్లి- ఆర్మూర్- ఆదిలాబాద్ వైపు వెళ్లాలన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని తెలిపారు.

News August 28, 2025

HYD: గుర్తుంచుకోండి.. ఈ శనివారమే కౌన్సెలింగ్

image

రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ శనివారం 30న మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. NRI కోటాలో అగ్రి ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ(బీటెక్), బీఎస్సీ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో సీట్లు మిగిలిపోవడంతో ఈ స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఉ.10 గంటలకు హాజరుకావాలని రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు. వివరాలకు pjtau.edu.in చూడాలన్నారు.

News August 28, 2025

జూబ్లీహిల్స్‌తో పాటు అక్కడా ఉపఎన్నికలు?

image

జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎప్పుడనేది ఇంకా స్పష్టత లేదు. రాజస్థాన్, పంజాబ్, యూపీ, మిజోరం రాష్ట్రాల్లోనూ కొన్ని ఎమ్మెల్యే స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు జూబ్లీహిల్స్‌లోనూ బై ఎలక్షన్స్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అక్టోబరులో EC ఎన్నికల తేదీలు ప్రకటించి నవంబర్‌లో ఎలక్షన్స్ నిర్వహించవచ్చని తెలుస్తోంది.

News August 28, 2025

జూబ్లీహిల్స్‌లో జనహిత పాదయాత్ర వాయిదా!

image

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన పలు కార్యక్రమాలు వాయిదా పడనున్నట్లు సమాచారం. నకిరేకల్‌లో నేడు జరగాల్సిన జనహిత పాదయాత్రతో పాటు, 29న అచ్చంపేటలో, 30న జూబ్లీహిల్స్‌లో జరగాల్సిన సభలు కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. వర్షాల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.