India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిషేధం అని అధికారులు విడుదల చేసిన సర్క్యూలర్పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల ABVP బంద్కు పిలుపునివ్వగా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు SFI, AISF, PDSU, PDSU(V)AIDSO, PSU సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఓయూ విద్యార్థుల గొంతులు నొక్కే అప్రజాస్వామిక సర్క్యూలర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
మరో రెండు రోజుల్లో HYDలో సిక్సర్ల మోత, అభిమానుల కేరింత మొదలవ్వనుంది. ఈనెల 23న ఉప్పల్లో మ్యాచ్ జరగనుంది.
MARCH 23 SRH vs RR
MARCH 27 SRH vs LSG
APRIL 6 SRH vs GT
APRIL 12 SRH vs PK
APRIL 23 SRH vs MI
MAY 5 SRH vs DC
MAY 10 SRH vs KKR
MAY 20 Qualifier 1
MAY 21 Eliminator
#SHARE IT
మూడు దశాబ్దాల పాటు ఎస్సీ వర్గీకరణపై తాము చేపట్టిన పోరాట ఫలితమే వర్గీకరణకు చట్ట రూపం దాల్చిందని పద్మశ్రీ మందకృష్ణ మాది అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన క్లబ్లో మాట్లాడుతూ.. వర్గీకరణ చట్ట రూపం దాల్చడంతో నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సభలు, విజయోత్సవం నిర్వహిస్తామన్నారు. చట్టం మా చేతిలో పెట్టి ఉద్యోగాలన్నీ వారికి దోచి పెట్టారన్నారు.
మంగళ్హాట్లోని చమన్దర్గా వద్ద దుకాణంలో మాంసపు వ్యర్థాలను నిల్వ చేస్తున్న మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తిని టాస్క్ఫోర్స్, సౌత్వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.8 లక్షల విలువైన 12 టన్నుల బరువుగల పాయా, తల, మెదడు, కిడ్నీ, మేక, గొర్రెల లివర్, ఇతర పశువుల మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. నిందితుడు ఈ వ్యర్థాలను ఎవరెవరికి అమ్ముతున్నారనేది విచారణ తర్వాత చెబుతామని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నకిలీ MLA స్టిక్కర్ వేసుకొని సంచరిస్తున్నారు. తాజాగా మంత్రి సీతక్క పేరుతో ఉన్న నకిలీ స్టిక్కర్ వాహనం (TG 09 HT R 1991)THARపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులకు బుధవారం ఫిర్యాదు అందింది. మంత్రి పీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కార్ సీజ్ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ముకుంద జువెలర్స్ కూకట్పల్లి బ్రాంచ్ 2వ వార్షికోత్సవం, కొత్తపేట బ్రాంచ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సంస్థ ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. రెండు సంవత్సరాల్లోనే 6 బ్రాంచులు స్థాపించడం సంతోషంగా ఉందని, కస్టమర్ల నమ్మకమే తమ సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. సేల్స్ పెంచిన ఉద్యోగులకు కార్లు, బైకులు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు బహుమతిగా అందజేశారు.
దిల్సుఖ్నగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నాగమణిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డెకాయ్ ఆపరేషన్ చేసి నిందితురాలిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘హలో నాగమణి’ అంటూ వాట్సాప్లో విటుల వలే మెసేజ్ చేయడంతో ఆమె దిల్సుఖ్నగర్కు అమ్మాయిని తీసుకొచ్చింది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమీర్పేట వాసి నాగమణి సినిమా అవకాశం అంటూ యువతులను వ్యభిచారంలోకి దింపుతున్నట్లు తేల్చారు.
రాష్ట్ర బడ్జెట్లో హుస్సేన్సాగర్కు న్యాయం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. దుర్గంధభరితమైన నీటితో టూరిస్టులు ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది. పొల్యూషన్ పెరిగి నీరు గ్రీన్ కలర్లోకి మారుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ సుందరీకరణ బాగున్నా మురికి కూపంపై ఎవరూ దృష్టి పెట్టడంలేదు. ఇకనైనా నీటి ప్రక్షాళనకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బడ్జెట్లో HYDకు ఇంకెం కావాలి..మీ కామెంట్?
HYDకు ముప్పు ముంచుకొస్తోంది. ఈ వేసవిలో నీటి కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్నాయి. ORR వరకు 948 చ.కిమీ మేర ఏకంగా 921 చ. కిమీ మేర భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు జలమండలి నివేదికలో వెల్లడైంది. ప్రతిరోజు దాదాపు 11 వేల ట్యాంకర్లను నగరవాసులు బుక్ చేసుకుంటున్నారు. IT కారిడార్, కూకట్పల్లి, మాదాపూర్, శేరిలింగంపల్లి వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) కోసం ప్రభుత్వం 1974లో 2300 ఎకరాలు కేటాయించింది. అయితే వర్సిటీ ఏర్పాటైన 50 ఏళ్లలో వివిధ అవసరాల కోసం 500 ఎకరాలను వెనక్కుతీసుకున్నారు. ఆ తరువాత ఆ భూముల జోలికి రాలేదు. ఇపుడు మరోసారి ప్రభుత్వం HCU వద్ద 400 ఎకరాల లాగేసే ప్రయత్నం చేస్తోంది. అలా చేస్తే ఇక హెచ్సీయూ వద్ద మిగిలేది కేవలం 1400 ఎకరాలే.
Sorry, no posts matched your criteria.