Hyderabad

News March 2, 2025

SUNDAY: HYDలో మటన్ షాపులవైపే మొగ్గు..!

image

భోజన ప్రియులకు ఆదివారం మాంసం ఉండాల్సిందే. అందుబాటు ధరలో ఉండే చికెన్.. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో కొనడంలేదు. మటన్, ఫిష్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో వీటి ధరలు HYDలో భారీగా పెరిగాయి. జియాగూడ మటన్ మండీలో కిలో రూ.400 ఉండే మటన్ ఇప్పుడు రూ.600, చెంగిచర్లలో రూ.500 ఉండేది కాస్తా పెరిగి రూ.800 చేరింది. స్థానిక మటన్ షాపుల్లో రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. తలకాయ కాళ్లు, బోటీకి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది.

News March 2, 2025

HYD: వాహనం నంబరు కనిపించకుంటే ఇక అంతే..!

image

ట్రాఫిక్ ఉల్లంఘనలపై HYD పోలీసులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 2నెలల్లో ఇప్పటివరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్‌తో ఒకరు మృతి చెందగా.. 21 మందికి గాయాలైనట్లు తెలిపారు. అస్పష్ట నంబరు ప్లేట్, వాహనదారులకు రూ.200 జరిమానాతో పాటు ఛార్జీషీటు దాఖలు చేస్తామన్నారు.

News March 2, 2025

HYD: ఫ్యాన్సీ నంబర్లతో రూ.37లక్షల ఆదాయం

image

HYD మణికొండలోని రవాణా శాఖ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్ల వేలం నిర్వహించారు. వేలంలో భారీ మొత్తంలో ఫ్యాన్సీ నంబర్లు ధర పలికాయి. TG07P9999 నంబర్‌ రూ.9.37 లక్షలు పలుకగా.. TG07P0009 రూ.7.50 లక్షలు పలికింది. ఈ ఒక్కరోజే రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.37 లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు.

News March 2, 2025

HYD: వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

image

అంబర్‌పేట్ గోల్నాక జిందాతిలిస్మాత్ వీధిలో ఓ వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు నిర్వహించారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. అందులో ముగ్గురు ఉగాండా, ఒకరు కెన్యా చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వ్యభిచార గృహం నిర్వాహకుడు లైబీరియా దేశానికి చెందిన వ్యక్తితో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

News March 1, 2025

HYD: ఎల్బీనగర్‌లో ట్రాన్స్‌జెండర్ల పొదుపు సంఘం..!

image

HYDలో ట్రాన్స్‌జెండర్లు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తూ ముందుకు వెళ్తున్నారు. తమ ప్రతిభను చాటి చెబుతూనే పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఇటీవలే ట్రాఫిక్ ఉద్యోగాలకు సైతం వారిని ప్రభుత్వం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. GHMC & MEPMA సహకారంతో, అర్ధనారి ట్రాన్స్‌జెండర్ల పొదుపు సంఘం HYD ఎల్బీనగర్‌లో ఏర్పాటు జరగగా వారందరూ సంతోషం వ్యక్తం చేశారు.

News March 1, 2025

HYD: సెలబ్రిటీలను మోసం చేసిన యువకుడిపై మరో కేసు నమోదు

image

గతంలో జూబ్లీహిల్స్ PS పరిధిలో సెలబ్రిటీలు, సంపన్నులను SustainKart పేరుతో మోసం చేసిన ఘటనలో జైలుకెళ్లి వచ్చిన కాంతి దత్‌పై తాజాగా CCSలో మరో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు తీసుకొని మోసగించినట్లు సౌజన్య అనే మహిళ ఫిర్యాదు చేసింది. తృతీయ జ్యువెలరీ పేరుతో తిప్పల శ్రీజ అనే మహిళను మోసగించిన ఘటనలో కాంతి దత్ గతంలో అరెస్టయ్యాడు. తాజాగా మరో కేసు నమోదు కావడం గమనార్హం.

News March 1, 2025

హైదరాబాద్‌లో రేపటి నుంచి నైట్‌ఔట్!

image

నైట్ ఔట్ కల్చర్ మన హైదరాబాదీలకు కొత్తేమీ కాదు. కానీ, రేపటి నుంచి నగరంలో కొత్త రూల్స్ ఉండబోతున్నాయి. రంజాన్ నెల సందర్భంగా వ్యాపారులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 24 గంటలూ దుకాణాలు ఓపెన్ చేసేందుకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపటి నుంచి మార్చి 31 వరకు ఈ రూల్స్‌ అమల్లో ఉంటాయి. ఇక మిడ్‌నైట్ షాపింగ్‌కు మన చార్మినార్‌‌లోని వ్యాపారులు సిద్ధమవుతున్నారు.

News March 1, 2025

HYD: మార్చి 1.. పెరిగిన టికెట్ ధరలు

image

HYD బహదూర్‌పురాలోని నెహ్రూ జూపార్క్ ఎంట్రీ టికెట్ ధర పెరిగింది. Adults రూ. 100, Children రూ. రూ. 50 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. సఫారీ, ట్రెయిన్ రైడ్, ఫిష్ అక్వేరియం ఎంట్రీ టికెట్ ధరలు కూడా పెరిగాయి. సమ్మర్‌లో టూరిస్టులు అధికంగా జూ పార్క్‌కు వస్తుంటారు. అనుగుణంగా అధికారులు పార్క్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.https://nzptsfd.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
SHARE IT

News March 1, 2025

మాజీ సీఎం కేసీఆర్‌కు పెండ్లి ఆహ్వాన పత్రిక

image

మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ దంపతులకు మాజీ హోం మంత్రి మహమూద్ అలీ శుక్రవారం తన మనవడి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. పెండ్లికి సకుటుంబ సమేతంగా రావాలని కేసిఆర్‌ను ఈ సందర్భంగా ఆయన కోరారు. పెండ్లికి తప్పకుండా వస్తానని మాజీ ముఖ్యమంత్రి తెలిపినట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు.

News March 1, 2025

శివరాంపల్లి భుమ్రుక్ ఉద్దీన్ దౌలా సరస్సును పరిశీలించిన హైడ్రా కమిషనర్ 

image

శివరాంపల్లిలో శుక్రవారం రాత్రి భుమ్రుక్ ఉద్దీన్ దౌలా సరస్సును హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. క్షేత్రస్థాయిలో సరస్సు అభివృద్ధి పనుల పురోగతి వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని సరస్సులను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!