Hyderabad

News August 20, 2024

HYD: లాయర్‌ సంతోష్‌పై చట్టప్రకారమే వ్యవహరించారు: సీపీ 

image

బోరబండలో న్యాయవాది సంతోష్‌ను పోలీసులు వేధింపులకు గురిచేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని సీపీ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 16న బోరబండలో న్యాయవాది నివాసం వద్ద, ఠాణాలో పోలీసులు చట్టప్రకారమే వ్యవహరించారన్నారు. బోరబండ, మధురానగర్ ప్రాంతాల్లో రౌడీల చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించటానికి పోలీసులు చట్టప్రకారమే ప్రవర్తిస్తున్నారన్నారు.

News August 20, 2024

HYD: ఆస్పత్రుల్లో తీరనున్న క్యూలైన్ కష్టాలు

image

ఓపీ చీటి కోసం రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద లైన్‌లో గంటలకొద్ది నిలబడతాం. ఉస్మానియా, గాంధీ, ఎంఎన్‌జే, నిలోఫర్ వంటి ఆసుపత్రుల్లో 2 నిమిషాల్లోనే ఓపీ చీటి పొందే అవకాశం అందుబాటులోకి వచ్చిందని డాక్టర్ రాజేంద్రనాధ్ అన్నారు. ‘అభా’ యాప్‌తో క్యూలైన్ కష్టాలు తీరనున్నాయి. ఓపీ కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అభా యాప్‌లో వివరాలు నమోదు చేస్తే ఓపీ చీటీ వస్తుంది. దీన్ని డాక్టర్లకు చూపించి సేవలు పొందొచ్చు.

News August 20, 2024

HYD: జేఎన్టీయూహెచ్‌లో బీ-ఫార్మసీ కోర్సు

image

జేఎన్టీయూహెచ్‌లో ఈ ఏడాది(2024-25) నుంచే బీ-ఫార్మసీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ఫార్మసీ విభాగం హెచ్వోడీ డాక్టర్ ఎస్.శోభారాణి తెలిపారు. ఈ కోర్సులో మొత్తం 60 సీట్లు ఉన్నాయని.. ఇప్పటికే వీటి భర్తీకి సంబంధించి కౌన్సెలింగ్ అధికారులకు వివరాలు పంపినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఎం-ఫార్మసీలో 4 కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కో కోర్సులో 15సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

News August 20, 2024

HYD: ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్) విధానంతో వయోజనులు, గృహిణులు కనీస విద్యార్హతలైన పదో తరగతి, ఇంటర్ సాధించేందుకు ఈ విధానం ఎంతో సహకరిస్తుంది. ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అంతర్జాల కేంద్రాల ద్వారా, మీ సేవా కేంద్రాల ద్వారా ప్రవేశాలను నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబరు 10వ తేదీ వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News August 20, 2024

HYD: ఒకే నెలలో 22.6 లక్షల మంది ప్రయాణం..!

image

HYD నగర శివారులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జులైలో 22.6 లక్షల మంది ప్రయాణించారు. గత ఏడాది కంటే 13% ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది విదేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుందని పేర్కొన్నారు. భారీగా ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, నూతన వసతులను కల్పించడం పై అధికారులు ఫోకస్ పెట్టారు.

News August 20, 2024

HYD: ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి: ఆమ్రపాలి

image

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌ రెడ్డిలతో కలిసి కమిషనర్‌ ఆమ్రపాలి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 25 అర్జీలు రాగా, టెలిఫోన్‌ ద్వారా 4 అర్జీలను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.

News August 19, 2024

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొండా సురేఖకు వారు ధన్యవాదాలు తెలిపారు. సోదర, సోదరీమణుల ప్రతి రూపమైన వేడుక రాఖీ పౌర్ణమి అని పేర్కొన్నారు.

News August 19, 2024

భట్టి విక్రమార్కకు రాఖీ కట్టిన మహిళా కమిషన్ చైర్మన్

image

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మహిళ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావు, ఇతర మహిళా కాంగ్రెస్ నాయకురాలు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇది ఇందిరమ్మ రాజ్యంలో మహిళల సంక్షేమ ధ్యేయంగా మహిళలను చూసుకుంటుందని తెలిపారు. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

News August 19, 2024

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మాజీ కార్పొరేటర్

image

సీఎం రేవంత్ రెడ్డికి రాంనగర్ మాజీ కార్పొరేటర్ ఆర్ కల్పనా యాదవ్ సోమవారం రాఖీ కట్టి తన సోదర భావాన్ని ఆయనతో పంచుకున్నారు. ఆడబిడ్డలకు అండగా ఉండే సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మాజీ కార్పొరేటర్ కల్పనా యాదవ్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలందరూ సీఎంకు అండగా నిలవాలని కోరారు.

News August 19, 2024

గాంధీ మెడికల్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్

image

గాంధీ మెడికల్ కాలేజీ గర్ల్స్​, బాయ్స్​ స్టూడెంట్స్‌తో పాటు రెసిడెంట్​ డాక్టర్ల కొత్త హాస్టల్​ భవనాలకు ప్రభుత్వం రూ.79.50 కోట్లు మంజూరు చేసినట్లు గాంధీ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొ.ఇందిర తెలిపారు. ఈనెల 24న గాంధీ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మాణ పనులకు హెల్త్​ మినిస్టర్​ దామోదర రాజ నర్సింహా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. TGMSIDC ఇంజినీరింగ్​ అధికారులతో కలసి ప్రిన్సిపల్​ స్థల పరిశీలన చేశారు.