India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వినాయక చవితి అంటేనే పూజలు.. వ్రతాలు..నిమజ్జన కార్యక్రమాలుంటాయి. వీధులు, చెరువుల వద్ద పూజా వస్తువులు, పూలు, ప్రసాదాలు పడేస్తారు. దీంతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు జీహెచ్ఎంసీ 25 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దింపింది. వీరంతా మూడు షిఫ్టుల్లో విధినిర్వహణలో పాల్గొంటారు. ముఖ్యంగా 29 నుంచి నిమజ్జన వేడుకలు జరుగనుండటంతో చెరువుల వద్ద క్లీనింగ్ కార్యక్రమాలు చేపడతారు.
మహేందర్ రెడ్డి పథకం ప్రకారమే <<17503036>>భార్య స్వాతి<<>>ని హత్య చేశాడని మల్కాజిగిరి డీసీపీ తెలిపారు. మేడిపల్లిలో భార్య హత్య కేసు వివరాలను డీసీపీ వెల్లడించారు. శవాన్ని మాయం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడని, విడతల వారీగా భార్య శరీర భాగాలు బయటకు తీసుకెళ్లి పారేశాడన్నారు. పోలీసులు వెళ్లి చూసేసరికి కేవలం మొండెం మాత్రమే మిగిలిందని, మొండానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
నగరంలో అత్యధికంగా జలమండలి నీటి ట్యాంకర్లను బుక్ చేసిన మొదటి 10 మంది వినియోగదారులను గుర్తించారు. అసలు అన్ని నీటి ట్యాంకర్లు వారు ఎందుకు బుక్ చేసుకుంటున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. గతేడాది అత్యధికంగా 674 వాటర్ ట్యాంకర్లను బుక్ చేసిన సాహితీ ఎంకే రెసిడెన్సీని(ప్రగతినగర్) అధికారులు సందర్శించారు. వారికి ఎండీ అశోక్ రెడ్డి తగు సూచనలు ఇచ్చారు. భూగర్భజలాలు పెంపొందించే చర్యలు తీసుకోవాలని సూచించారు.
వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతికి ఘన స్వాగతం చెప్పేందుకు నగర భక్తులు సిద్ధమయ్యారు. ఈ సంవత్సరం 69 అడుగుల గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. సోమవారం నేత్రోనిలం(కంటిపాప అమర్చడం) అనంతరం ఏకదంతుడికి స్వాగత కార్యక్రమలు ప్రారంభమవుతాయి. సాయంత్రం గణపతి ఆగమన్ నిర్వహించేందుకు ఖైరతాబాద్ యూత్ అసోసియేషన్ సిద్ధంగా ఉంది. 11 రోజుల పాటు మహాగణపతికి నగరవాసులను కనువిందు చేయనున్నాడు.
ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి రేపు పర్యటించనుడంతో వర్సిటీలో నెలకొన్న పలు సమస్యలను సిబ్బంది గుర్తు చేసుకుంటున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రొఫెసర్లను నియమించాలి. ఉర్దూ శాఖలో ఉన్నది కేవలం నలుగురు అధ్యాపకులు మాత్రమే. అలాగే ఫిలాసఫి, సైకాలజీకి ఇద్దరేసి అధ్యాపకులున్నారు. మొత్తంగా 1000 టీచింగ్, 2400 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వినాయక చవితి నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నడుంబిగించింది. గ్రేటర్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయనుంది. 3.24 లక్షల విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మట్టి విగ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం గురించి విద్యార్థులతోపాటు ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వివరించింది. వీరికి మద్దతుగా మనం కూడా మట్టి వినాయకుడినే ప్రతిష్టిద్దాం
నాయకులు మోసం చేసినా కార్యకర్తలు గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా అరాచకాలతోనే HYDలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందన్నారు. తెలంగాణకు గుండెకాయగా కేసీఆర్ HYDను మార్చారని, దుర్గంచెరువు FTLలో సీఎం అన్న తిరుపతిరెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అని ప్రశ్నించారు.
హైదరాబాద్ మెట్రో రైలుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త మెట్రో లైన్ వేసేందుకు ఎల్ అండ్ టీ సంస్థకు పెద్దగా ఆసక్తి ఉన్నట్లులేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం మరో కంపెనీకి ఈ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోందన్నారు. ఫేజ్-1లోని ఫలక్నుమా-అఫ్జల్ గంజ్ రూట్ ఇంకాపూర్తి కాలేదని.. ఈ పనులు పూర్తి అయిన తరువాతే కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారు.
దేశంలోనే ప్రఖ్యాత విద్యాసంస్థ ఉస్మానియా విశ్వవిద్యాలయం ముఖ్యమంత్రి హామీల కోసం ఎదురుచూస్తోంది. దాదాపు 20ఏళ్ల తరువాత రేపు ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియాకు రేవంత్ రెడ్డి వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం సదస్సలో మాట్లాడనున్నారు. దీంతో సీఎం ప్రసంగం కోసం విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఎదురు చూస్తున్నారు. ఉస్మానియాకు సీఎం వరాలేమైనా ప్రకటిస్తాడేమోనని ఆశగా ఉన్నారు.
గణేశ్ విగ్రహాల నిమజ్జనాలకు GHMC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న విగ్రహాలను నిమజ్జనాలు చేసేందుకు ప్రత్యేక కొలనులతో పాటు ప్రీ ఫ్యాబ్రిక్ ట్రెడ్ కొలనులు, తాత్కాలికంగా నిర్మించే కొలనులను దీనికి వినియోగించనున్నారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్లో 13, చార్మినార్లో 9, ఖైరతాబాద్లో 13, శేరిలింగంపల్లిలో 15, కూకట్పల్లిలో 12, సికింద్రాబాద్లో 12 ఏర్పాటు చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.