Hyderabad

News February 27, 2025

మహా నగరంలో.. మహా శివరాత్రి ఎఫెక్ట్

image

ట్రాఫిక్ జామ్‌లతో నిండిపోయే మహానగరపు రోడ్లు ఇవాళ కాస్త ఖాళీగా కనిపించాయి. మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో జాగరణలో గడిపారు. ఈ ఎఫెక్ట్‌తో ఉదయం లేట్‌గా రోడ్లపైకి వస్తుండటంతో 11 తర్వాత వాహనాలు పెరిగాయి. JNTU, మియాపూర్, బాచుపల్లి, మాదాపూర్, సికింద్రాబాద్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ABIDS, DSNR వంటి బిజీరోడ్లపై ఇప్పుడిప్పుడే హారన్‌మోతలు పెరిగాయి. మీప్రాంతంలో రద్దీగా ఉందా? కామెంట్ చేయండి.

News February 27, 2025

మన HYD కోసం పీఎం మోదీ వద్దకు సీఎం రేవంత్!

image

ప్రధాని మోదీ భేటీలో HYD అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలను పీఎం ముందుంచారు. ✔️నగరంలో మెట్రో రైల్ ఫేజ్‌-IIకు అనుమ‌తించాలి.✔️ మూసీ పునరుజ్జీవం కోసం కేంద్రం సాయం చేయాలి.✔️ తెలంగాణలో ఒక డ్రైపోర్టు నిర్మించాలి. ✔️ RRR ప్రాజెక్టుకు అనుమతులు, ఆమోదం ఇవ్వాలి.✔️ మూసీ, గోదావరి అనుసంధానం కోసం రూ.2,000 కోట్లు కావాలి.

News February 27, 2025

HYD: శివయ్యా.. కడుపు నింపావయ్యా..!

image

నిన్న మహా శివరాత్రిని పురస్కరించుకుని HYD శివనామస్మరణతో తరించింది. త్రేతాయుగంలో వానర సేన హనుమ, శ్రీ రాముడు ప్రతిష్ఠించిన కీసరలోని శివలింగం వద్ద అద్భుతం జరిగింది. భోళాశంకరుడికి భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని తిన్న వానరాలు.. వాటి కడుపునింపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ శివయ్యను మొక్కుతున్నట్లు ఉన్న ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వాటి సేనాని, ఆరాధ్య దైవం ప్రతిష్ఠించిన లింగం వద్ద సందడి చేశాయి.

News February 27, 2025

HYD: అయ్యో ఎంత పనిచేశారు సారూ..!

image

పండగపూట లంగర్‌హౌస్ చెరువులో <<15590306>>తండ్రీ కొడుకులు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. వారు చనిపోవడానికి ముందు జరిగిన పరిణామాలు స్థానికులు చెబుతుంటే కలవరపెడుతున్నాయి. కొడుకును భుజాన ఎత్తుకుని మునిగిపోతూ అధికారులు, సిబ్బందిని రక్షించమని వేడుకున్నా.. వారు స్పందించకుండా సాయం కావాలని స్థానిక నాయకులకు ఫోన్ చేసి అడిగారని ప్రత్యక్షసాక్షులు వాపోయారు. వారు సాయం అందించుంటే ఇద్దరూ బతికుండేవారని బాధిత కుటుంబం రోదించింది.

News February 27, 2025

HYD: ఉపాధ్యాయుడి వేధింపులు.. రిమాండ్

image

ప్రేమపేరుతో వేధిస్తున్న ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. నాదర్‌గుల్‌లోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బాలికను ప్రేమపేరుతో వేధిస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు ఆదిభట్ల PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు.

News February 27, 2025

HYD: ఆ రోజులూ మళ్లీరావు..!

image

శివరాత్రికి శివుడిని ఎంత ఇష్టంగా కొలుస్తారో.. అంతే ఇష్టంగా జాగరణలో చేస్తారు. HYDలో అనేక చోట్ల యువత కోసం రాత్రంతా క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లు ఏర్పాట్లు చేశారు. పెద్దలు స్వామి వారిని.. సంకీర్తనలు, భజనతో స్మరించుకుంటూ జాగరణ పూర్తి చేశారు. కానీ గతంలో మన ఊళ్లల్లో వేసే పద్య, పౌరాణిక, జానపద నాటకాలకు పెద్ద ఫ్యాన్ బేస్ ఉండేది. చిన్నతనంలో పదాలు అర్థం కాకపోయినా చూస్తూ కూర్చునేవాళ్లం. మీరెలా జాగరణ చేశారు.

News February 27, 2025

HYD: మానసికంగా ఒత్తిడి ఉందా..? కాల్ చేయండి!

image

HYD, MDCL, RR జిల్లావాసులు ఒత్తిడికి గురవడం, మానసికంగా ఆవేదన చెందడం వంటి సమస్యలను ఎదుర్కొంటే టెలీ మానస్ హెల్ప్‌లైన్ 14416కు కాల్ చేయాలని ఉప్పల్ పీహెచ్సీ డాక్టర్ సౌందర్యలత తెలిపారు. నిష్ణాతులైన వైద్యులు సలహాలు సూచనలు అందజేస్తారు. మీ పిల్లల ప్రవర్తనలో ఏవైనా మానసిక తేడాలు గుర్తించినా కాల్ చేయొచ్చన్నారు. మానసిక సంబంధిత అంశాలన్నింటికి పరిష్కారం ఉంటుందని, ఈ విషయాన్ని అందరికీ తెలపాలని కోరారు.

#SHARE IT.

News February 26, 2025

కీసరలో రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ములు మృతి

image

కీసర PS పరిధిలోని యాదగిరిపల్లిలో ORR సర్వీస్ రోడ్‌ మీద ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాలు.. గూడూరు చంద్రశేఖర్ (32), మత్స్యగిరి (27) అన్నదమ్ములు. శ్రీను అనే మరో వ్యక్తితో బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ORR సర్వీస్ రోడ్‌లో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. చంద్రశేఖర్ అక్కడిక్కడే చనిపోయాడు. మత్స్యగిరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, మార్చి 20న మత్స్యగిరి వివాహం జరగాల్సి ఉంది.

News February 26, 2025

HYDలో ప్రసిద్ధ శివాలయాలు ఇవే..!

image

మన జిల్లాలో ప్రసిద్ధ శివాలయాలు. 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యరాజు 6వ విక్రమాదిత్యుడు శంకర్‌పల్లిలో మరకత లింగాన్ని ప్రతిష్ఠించారని శాసనం చెబుతోంది. జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన వైద్యనాథుడిని పోలి..ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. త్రేతాయుగంలో 101 లింగాలను కాశీ నుంచి ఆంజనేయుడు తీసుకురాగా..రాముడు కీసరలో ప్రతిష్ఠించారు. షాద్నగర్ సమీపంలోని రాయకల్‌లో శ్రీరాముడు లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి.

News February 25, 2025

HYD: జూ పార్క్‌లో టికెట్ ధరలు పెంపు

image

HYD బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంట్రీ టికెట్ ధర పెంచినట్లు క్యూరేటర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. చిన్నారులకు రూ. 50, పెద్దలకు రూ. 100 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. పార్క్ లోపల సఫారీ, ట్రెయిన్ రైడ్, ఫిష్ ఆక్వేరియం వెళ్లే ధరలు కూడా పెరిగాయి. మార్చి 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని క్యూరేటర్ స్పష్టం చేశారు.

error: Content is protected !!