Hyderabad

News August 16, 2024

HYD: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు టెండర్ల ఆహ్వానం

image

గ్రేటర్ HYDలో వివిధ కాలనీల్లో లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సదుపాయాలు కల్పించకపోవడంతో వారు వాటిలో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో వాటిని సమకూర్చేందుకు GHMC సిద్ధమైంది. ప్రస్తుతం శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు నియోజకవర్గాల్లో కొత్తవి ఏర్పాటు చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు టెండర్లు పూర్తి చేసి పరికరాలను సమకూర్చుకొని అమర్చనుంది.

News August 16, 2024

HYD: బీఆర్ఎస్‌లో చేరిన NSUI నాయకులు

image

రంగారెడ్డి జిల్లా NSUI ఉపాధ్యక్షుడు అభిశేఖ్ బీఆర్ఎస్‌లో చేరారు. గురువారం రాజేంద్రనగర్, చేవెళ్ల, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుంచి పలువురు NSUI నాయకులు అభిశేఖ్ ఆధ్వర్యంలో కారెక్కారు. రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో యువనాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ‘ఇక మార్పు మొదలైంది.. వలసలు పెరుగుతాయి’ అంటూ కార్తీక్‌ రెడ్డి పేర్కొన్నారు.

News August 16, 2024

రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ముఖ్యమంత్రి

image

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంప్రదాయం ప్రకారం రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్ దంపతులతో కలిసి సీఎం అతిథులను మర్యాదపూర్వకంగా పలకరించారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్, శాసనసభ స్పీకర్, పలువురు మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.

News August 15, 2024

హైదరాబాద్: అమానుష ఘటన

image

శంషాబాద్‌లో మైనర్ బాలికపై కృష్ణారెడ్డి అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. బాలిక గర్భవతి కావడంతో కొత్తూరులోని ఓ క్లినిక్‌లో 5 నెలల గర్భాన్ని తొలగించుకున్నారు. పసిగుడ్డును బజారున పడేశారు. అబార్షన్ చేసిన వైద్యుడు రంజిత్ పరారీలో ఉన్నాడు. రోడ్డు మీద పడేసిన శిశువు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రంజిత్‌పై కేసు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

News August 15, 2024

HYD: దేశ విశిష్టతపై అవగాహన కల్పించాలి

image

పిల్లలకు బాల్యం నుంచే దేశ విశిష్టత పట్ల అవగాహన కల్పించాలని రాచకొండ సీపీ ఐపీఎస్‌ సుధీర్ బాబు ఐపీఎస్ సూచించారు. రాచకొండ కమిషనరేట్‌, నేరేడ్‌మెట్‌లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు.

News August 15, 2024

తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగనిరతిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

News August 15, 2024

సచివాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎస్

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జాతీయ జెండాను ఎగురవేశారు. సచివాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగనిరతిని కొనియాడారు.

News August 15, 2024

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్

image

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబోయే ఈ వర్సిటీ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించిన విషయం విదితమే. ఈ క్రమంలో గవర్నర్ సంబంధిత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు.

News August 15, 2024

HYD: రాయితీ కోసం వాటర్ బోర్డు ఎదురుచూపు

image

గ్రేటర్ HYD సహా ఔటర్ ప్రాంతాల్లో నీటి సరఫరా చేస్తున్న వాటర్ బోర్డుకు కరెంటు బిల్లు గుదిబండగా మారింది. పంపింగ్ ద్వారా పెద్ద ఎత్తున నీటిని వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో రూ.105 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు నెలకు బిల్లులు వస్తున్నాయి. అయితే వాటర్ బోర్డు మెట్రో రైలు ప్రాజెక్టు తరహాలో రాయితీ ఇచ్చి, యూనిట్‌కు రూ.3.95 వసూలు చార్జీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

News August 15, 2024

HYDలో 23 ప్రాంతాల్లో మరుగుదొడ్లు

image

గ్రేటర్ HYD పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణానికి 23 ప్రదేశాల్లో అనుమతులు వచ్చినట్లు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. పనులు చేపట్టేందుకు జోనల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు గ్రేటర్ వ్యాప్తంగా కుక్కల బెడద, కుక్క కాటుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు.