Hyderabad

News August 23, 2025

HYD: క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్‌తో బ్యూటిఫుల్ క్యాంప్!

image

తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేడు సా.5 గంటల నుంచి ఆదివారం ఉ.10 గంటల వరకు రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో నేచర్ క్యాంప్ నిర్వహించనున్నారు. టీం బిల్డింగ్, టెంట్ పిచింగ్, నాక్టర్నల్ వాక్, నైట్ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్, బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారం ఉ.6 నుంచి 9.30 వరకు బర్డ్ వాక్ ఉంటుంది. వివరాలకు 73823 07476కు సంప్రదించండి.

News August 22, 2025

ALERT: ధూల్‌పేట వెళుతున్నారా.. ఇది మీ కోసమే!

image

ధూల్‌పేటలో వినాయక విగ్రహాల కొనుగోళ్ల నేపథ్యంలో ఆగస్టు 23 ఉదయం 7 గంటల నుంచి ఆగస్టు 27 రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ ప్రకటించారు. బోయిగూడ కమాన్ నుంచి గాంధీ విగ్రహం వరకు సాధారణ వాహనాలకు అనుమతి లేదన్నారు. విగ్రహాల కోసం వచ్చే వాహనాలను గాంధీ విగ్రహం, పురానాపూల్ నుంచి అనుమతించి, బోయిగూడ కమాన్ ఎక్స్ రోడ్స్ వైపు మళ్లిస్తామని స్పష్టం చేశారు.
SHARE IT

News August 22, 2025

ఓయూ: సీపీజీఈటీ మొదటి దశ షెడ్యూల్ ఖరారు

image

సీపీజీఈటీ – 2025లో భాగంగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల మొదటి దశ ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ఆప్షన్ల ఎంపికకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 28వ తేదీన వెరిఫికేషన్ వివరాలను వెల్లడిస్తామన్నారు. 28వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని, 30వ తేదీన ఎడిట్ చేసుకోవచ్చన్నారు.

News August 22, 2025

HYD: 7 షేవింగ్ బ్లేడ్‌లను మింగాడు.. కాపాడిన డాక్టర్లు

image

వైద్య చరిత్రలో అరుదైన ఘటన ఇది. సిటీకి చెందిన 37 ఏండ్ల వ్యక్తి ఈనెల 16న మానసిక సమస్యతో 7 షేవింగ్ బ్లేడ్లను మింగాడు. కుటుంబీకులు గాంధీ ఎమర్జెన్సీలో చేర్పించారు. జనరల్ సర్జరీ విభాగంలో డాక్టర్లు పేషంట్‌కు వైద్యపరీక్షలు చేసి, ఆహారం ఇవ్వకుండ, మందులు, ప్లూయిడ్స్ ఇచ్చారు. లక్కీగా జీర్ణాశయంలో ఎలాంటి రక్తగాయాలు కాలేదు. మలద్వారం వెంట 7 బ్లేడ్లు పడిపోవడంతో పేషంట్‌ను డిశ్చార్జీ చేసినట్లు డా.సునీల్ తెలిపారు.

News August 22, 2025

కూకట్‌పల్లి: సహస్ర హత్య.. బాలుడు రాసిన పేపర్ ఇదే!

image

సహస్ర హత్య కేసులో బాలుడికి సంబంధించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఆ ఇంట్లోకి వెళ్లే ముందు ఎలా వెళ్లాలి? ఏం చేయాలి? అనేదానిపై పూర్తిగా పేపర్ పైన రాసుకొని మరీ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పేపర్‌‌లో లాస్ట్‌‌ లైన్ మిషన్ కంప్లీటెడ్‌ అని రాసుకొన్న బాలుడి ఆలోచన విధానం స్థానికులను కలవరానికి గురిచేస్తోంది. పదేళ్ల బాలుడి మైండ్‌సెట్ ఇలా ఉండటం పట్ల అంతా నివ్వెరపోతున్నారు.

News August 22, 2025

కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలికను హత్య చేసిన బాలుడు!

image

కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో బాలిక సహస్ర హత్య కేసు కీలక మలుపు తిరిగింది. 5వ రోజు కేసును ఛేదించిన పోలీసులు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. సహస్ర ఇంటి పక్కనే ఉన్న భవనంలో నివసిస్తున్న 10వ తరగతి విద్యార్థి ఈ హత్య చేసినట్లు గుర్తించారు. దొంగతనానికి వెళ్లిన సమయంలో బాలికను చూసి హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 22, 2025

నిజాం నిరంకుశత్వాన్ని నిలదీశారు షోయబ్ ఉల్లాఖాన్

image

షోయబ్ ఉల్లాఖాన్ 1920 OCT 17న ఖమ్మం జిల్లా సుబ్రవేడులో జన్మించారు. ఆయన HYDలో ఎక్కువ రోజులు గడిపారు. ఓయూలో జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందారు. నగరంలో వెలువడే ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనను వ్యతిరేకిస్తూ వ్యాసాలు రాశారు. నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో 1948 ఆగష్టు 22న రజాకార్లు అతిక్రూరంగా కాల్చిచంపారు. HYDలోనే ఆయన చివరి శ్వాస విడిచారు.

News August 22, 2025

నగర వాసి దాహం తీర్చేందుకు జలమండలి కసరత్తు

image

మహానగరంలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇపుడు మరో 6 రిజర్వాయర్లు నిర్మించనుంది. ఆస్మాన్‌ఘడ్‌లో 2 నిర్మించనుండగా మహేంద్రహిల్స్‌లో ఒకటి, నియో పోలీస్‌లో 3 నిర్మించనుంది. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో 15 రిజర్వాయర్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 297 రిజర్వాయర్లు నగరవాసి దాహాన్ని తీర్చుతున్నాయి.

News August 22, 2025

మిర్యాలగూడ- కాచిగూడ ట్రైన్ 20 MIN లేట్

image

మిర్యాలగూడ- కాచిగూడ సమయాన్ని మారుస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మిర్యాలగూడ ప్యాసింజర్ రైలు (77648)  కాచిగూడ స్టేషన్‌కు గతంలో ఉన్న సమయం కంటే మరో 20 MIN లేట్‌గా వస్తుంది. గతంలో రోజూ 10 గంటలకు వస్తుండగా మారిన సమయం అనంతరం రా.10:20కు వస్తుందని తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు కోరారు.

News August 22, 2025

HYD: వర్షాలతో కాస్త పెరిగిన భూగర్భజలం!

image

HYD వ్యాప్తంగా ఇటీవల కురిసిన విస్తారమైన వర్షాలతో భూగర్భజలం పెరిగినట్లు భూగర్భ జిల్లా శాఖ తెలిపింది. అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా గత రికార్డుతో పోలిస్తే జిల్లాలో 2.71 మీటర్ల వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. RR, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోనూ కాస్త మెరుగుపడ్డట్లుగా తెలిపింది. భూగర్భ జలాలు పెరుగుదలకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించాలని జలమండలి సూచించింది.