Hyderabad

News August 14, 2024

HYD: నెట్ జీరో సిటీ అంటే తెలుసా..?

image

HYD నగర శివారు కందుకూరు ప్రాంతంలో నెట్ జీరో సిటీ ఏర్పాటు చేయనుంది. పరిశ్రమల నుంచి వెలువడే కర్బన, రసాయన సమ్మేళనాల కాలుష్యంతో ప్రజా జీవనంపై ప్రభావం పడకుండా, జాతీయ కాలుష్య ప్రమాణాలను పాటించి, జీరో కార్బన్ ఎమిషన్ సిటీగా ఏర్పాటు చేయనున్నారు. ఈ సిటీలో 33% పచ్చదనం ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. పచ్చదనంతో HYD పరిసరాల్లో ఉష్ణోగ్రత కంటే 2-3 డిగ్రీలు సెంటీగ్రేడ్లు తక్కువగా ఉండనున్నాయి.

News August 13, 2024

HYD: భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఎస్

image

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (HRRR) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. మంగళవారం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతిష్ఠాత్మక RRR ప్రాజెక్టు రాష్ట్రంలో అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకుందని, భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు.

News August 13, 2024

గ్రేటర్ HYDలో ఆ వాహనాలు 15 లక్షలకు పైనే..!

image

గ్రేటర్ HYD పరిధిలో దాదాపుగా 75 లక్షల వాహనాలు ఉన్నట్లుగా అధికారుల లెక్కల్లో తేలింది. రూ.170 కోట్ల లీటర్ల పెట్రోలు, రూ.150 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే..15 ఏళ్లకు పైబడిన వాహనాలు దాదాపుగా 15 లక్షలకు పైగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వాహనాల వల్ల గాలి కాలుష్యం పెరిగి, ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.

News August 13, 2024

HYD: భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఎస్

image

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (HRRR) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. మంగళవారం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతిష్ఠాత్మక RRR ప్రాజెక్టు రాష్ట్రంలో అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకుందని, భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు.

News August 13, 2024

GHMC: ఆ ప్రాంతాల్లో ఫుట్ బాల్ గ్రౌండ్లు

image

GHMC గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ ప్రాంతంలో జేసీ నగర్, వలావర్ నగర్, కాప్రా ఛత్రపతి శివాజీ గ్రౌండ్, శేర్లింగంపల్లి గోపనపల్లి తండా, మియాపూర్ బస్ డిపో వెనుక, కూకట్పల్లి ఎస్ఆర్ నాయక్ నగర్, అల్వాల్, ఖైరతాబాద్ లంగర్ హౌస్, సికింద్రాబాద్ తిరుమలగిరి, ప్రాంతాల్లో ఫుట్ బాల్ మైదానాల కోసం స్థలాలను అధికారులు గుర్తించారు.

News August 13, 2024

HYD: ‘వాహనం ఎంతకు కొన్నా పూర్తి ట్యాక్స్ కట్టాలి’

image

వాహన కొనుగోలులో షోరూమ్‌లు ఇచ్చిన డిస్కౌంట్‌కు కూడా పన్ను చెల్లించాల్సిందేనని, పూర్తి ట్యాక్స్‌ కడితేనే ఆ వాహనం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని ఆర్టీఏ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాహన ధర ఆర్టీఏ డేటాబేస్‌లో ఉంటుందని, డిస్కౌంట్‌ అనేది పన్ను మినహాయింపునకు కాదని కస్టమర్లు గుర్తించాలని సూచించారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనం ఏ ధరకు కొనుగోలు చేసినా పూర్తి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు.

News August 13, 2024

HYD: 2 నెలలుగా వేతనాలు నిల్!

image

రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంసెట్, నీట్, ఐఐటీ సీట్ల కోసం శిక్షణ అందిస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ, సీనియర్ సబ్జెక్టు అసోసియేట్లు 2 నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. వేతనాలు ఇచ్చేవరకు పాఠాలు బోధించబోమంటూ గౌలిదొడ్డి సీఈవో సహా అన్ని కేంద్రాల్లో సబ్జెక్టు అసోసియేట్లు సోమవారం నుంచి ‘చాక్ డౌన్’ చేపట్టారు. ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

News August 13, 2024

నత్తనడకన హెచ్‌ఎండీఏ తరలింపు!

image

హెచ్‌ఎండీఏ తరలింపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆగస్టు మొదటి వారంలోనే నగరంలో పలు చోట్ల ఉన్న హెచ్‌ఎండీఏ విభాగాలన్నింటినీ ఒకే చోటకు తరలించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నెమ్మదిగా సాగుతున్న పనుల మూలంగా కేంద్రీకృతానికి జాప్యం జరగనుంది. పైగా ప్యాలస్‌లో ఇప్పటికీ కొనసాగుతున్న నిర్మాణ పనులతో తరలింపు ప్రక్రియ ఎప్పుడనేది ఇంకా స్పష్టత రావడంలేదు.

News August 13, 2024

HYD: త్వరలో భూమిలోపల నుంచి మెట్రో

image

శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం.. పలు ప్రత్యేకతల సమాహారం. ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో మెట్రో తొలి దశలో నిర్మించినవన్నీ ఆకాశ (ఎలివేటెడ్) మార్గాలే. విమానాశ్రయ కారిడార్‌‌లో ఆకాశమార్గంతో పాటు తొలిసారిగా భూమిపై కొంత, భూగర్భంలో మరి కొంత దూరం నిర్మించేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)లో పొందుపర్చారు.

News August 13, 2024

HYD: హైకోర్టుకు మెడికల్ అడ్మిషన్ల స్థానిక వివాదం

image

రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు స్థానికత వివాదం మళ్లీ హైకోర్టుకు చేరింది. మెడికల్ నిబంధనలను సవరిస్తూ రూల్స్ 3A చేర్చి ప్రభుత్వం గత నెల 19న జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆరాధే వాదనలు విని, ప్రతివాదులైన వైద్యఆరోగ్యశాఖ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 14కు వాయిదా వేశారు.