India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాచిగూడ నుంచి వాడి, రాయచూరు వెళ్లే ప్యాసింజర్ రైళ్ల నంబర్లను రైల్వే అధికారులు మార్చారు. కాచిగూడ-రాయచూర్ మధ్య నడిచే రైలు ప్రస్తుత నంబర్ 77647- 77648. ఈ ట్రైన్కు 67787- 67788 నంబరు కేటాయించారు. అలాగే కాచిగూడ- వాడి మధ్య నడిచే 57601- 57602 రైలుకు ఇకనుంచి 67785-67786 నంబరు కేటాయించారు. ఈ నెల 25 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ వచ్చి నేటికి 11ఏళ్ల 2 నెలల 20 రోజులైంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఓ పదం వింటూనే ఉన్నాం.. ‘మూసీని అభివృద్ధి చేస్తాం’ అని. ఈ పదం వినీ.. వినీ నగరవాసికి విసుగెత్తిపోయింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇపుడు కాంగ్రెస్ సర్కార్కు ఈ పదం పలకడం అలవాటైపోయింది. మూసీని అభివృద్ధి చేయకుండా.. చేస్తాం, చేస్తాం అని ఇంకెన్నేళ్లు చెబుతారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కోటి ఎకరాలకుపైగా పంటలు సాగు చేస్తున్నారని, పంటలకు సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల వెంకటయ్య ఆరోపించారు. నేడు SVK వద్ద వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా యూరియా పంపించకుండా సగం యూరియానే పంపించి అదే సరిచేయాలని చెప్పడం దుర్మార్గమన్నారు.
HYD వ్యాప్తంగా 10,110 గుంతలు వర్షాలతో ఏర్పడ్డట్లు జీహెచ్ఎంసీ ఇంజినీర్లు గుర్తించారు. మరోవైపు మ్యాన్హోల్ సంబంధించి 296 ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టినట్లుగా GHMC చీఫ్ ఇంజినీర్ సహదేవ రత్నాకర్ వెల్లడించారు. గత 20 రోజులలో గ్రేటర్ వ్యాప్తంగా 7,300 గుంతలను పూడ్చివేసినట్లు పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికీ పలుచోట్ల గుంతలు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 100 మంది ట్రాఫిక్ మార్షల్స్ను ఏర్పాటు చేసిన సీపీ సీవీ ఆనంద్.. త్వరలో వీరి సంఖ్యను 500కు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి కింద పలు కంపెనీలు వీరికి వేతనం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. మహావీర్ ఎస్టేట్స్, అపోలో, యశోద ఆస్పత్రి, ఎల్వీ ప్రసాద్, నిలోఫర్ తదితర సంస్థలు ముందుకు వచ్చినట్లు సమాచారం.
HYD-విజయవాడ మార్గంలో ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మార్గంలో ఈ-గరుడ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ధరపై 26% రాయితీ ప్రకటించింది. ఈ- గరుడ బస్సులు కాలుష్య రహితమైనవని, పర్యావరణహితమైనవని, 100% సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని RTC అధికారులు తెలిపారు. ఈ మార్గంలో TGSRTC 10 ఈ-గరుడ బస్సులను నడుపుతోంది.
గణపతి నవరాత్రుల్లో మండపాలకు నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీనుకోవాలి. https://policeportal.tspolice.gov.in/index.htmలో పర్మిషన్కు అప్లై చేయండి.
☞ విద్యుత్ కనెక్షన్కు డీడీ తీసుకోవాలి
☞ స్వతంత్రంగా కరెంట్ కనెక్షన్ ఇవ్వొద్దు
☞ నిపుణులతో గాలి, వానను తట్టుకునేలా మండపాలు ఏర్పాటు చేసుకోండి
☞ స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోండి
☞ అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే పోలీసులకు సమచారం ఇవ్వండి.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 32 ఎజెండా అంశాలు, 7 టేబుల్ అంశాలకు ఆమోదం లభించింది. ముందుగా రామంతాపూర్ కృష్ణాష్టమి విషాదంలో బాధితులకు మౌనం పాటించి సంతాపం తెలిపారు. వెండింగ్ షాపుల టెండర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, ఎల్ఈడీ లైట్లు, మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించారు. ఈ నిర్ణయాలతో నగరవాసులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
HYD వేదికగా ‘మార్వాడీ గో బ్యాక్’ స్లోగన్స్ చేస్తూ.. నేడు TG బంద్కు OU JAC పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. మరో ఉద్యమం మొదలైందంటూ SMలో పోస్టులు పెడుతున్నారు. ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదానికి INC, BJP దూరంగా ఉన్నాయి. అయితే, ఎన్నో ఏళ్లుగా సిటీలో మార్వాడీలు స్థిరపడ్డారని, కలిసి మెలిసి ఉంటున్న సమయంలో కొత్తగా ఆందోళన ఏంటని కొందరు పెదవి విరిస్తున్నారు. మరి ‘గో బ్యాక్’ నినాదంపై మీ కామెంట్?
మోండా మార్కెట్ PS పరిధిలో జులై 30న జరిగిన ఘటనలో పాట్ మార్కెట్ మార్వాడి వ్యాపారస్తులకు ఎలాంటి సంబంధం లేదని బాధితుడు సాయి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ రోజు తనకు, ఎస్కే జ్యువెల్లర్స్ వ్యాపారుల మధ్యనే వివాదం జరిగిందన్నారు. రోడ్డుపై హారన్ కొట్టడంతో జరిగిన వివాదం SC, ST కేసు వరకు వెళ్లగా, కొందరు తమ మధ్య జరిగిన గొడవను పాట్ మార్కెట్ వ్యాపారుల అందరితో కలిపి ముడి పెట్టారన్నారు.
Sorry, no posts matched your criteria.