India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నాయకులు తదితరులు ఉన్నారు.
బాచుపల్లి PS పరిధిలో దారుణ ఘటన జరిగింది. పోలీసుల వివరాలిలా.. PS సమీపంలోని హనుమాన్ ఆలయం దగ్గరలోని ఓఇంట్లో 8 (M), 3 ఏళ్ల చిన్నారులను తల్లి లక్ష్మీ సంపులో పడవేసి, తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు పిల్లలు మృతి చెందినట్లు గుర్తించి, లక్ష్మీని గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఈ దారుణానికిగల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రజాభవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి సీతక్క నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆధునిక భారత శిల్పిగా అభివర్ణించారు. అధికార వికేంద్రీకరణ, ఐటీ, టెలిఫోన్ విప్లవాలకు ఆయన పునాదులు వేశారని మంత్రి పేర్కొన్నారు.
రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ వ్యవసాయ, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో, వనపర్తిలోని కొండా లక్ష్మణ్ ఉద్యాన యూనివర్సిటీలో అనుబంధ డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు ఆగస్టు 23 వరకు మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కౌన్సిలింగ్ పూర్తి వివరాలు వెబ్సైట్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
రామంతపూర్, అంబర్పేట్ విద్యుత్ ప్రమాదాలతో విద్యుత్శాఖ చేపట్టిన చర్యలతో నగర వ్యాప్తంగా కేబుల్ వైర్లు ఎక్కికక్కడ కట్ అవుతున్నాయి. దీంతో వైర్ల ద్వారా నడిచే ప్రసారాలు నిలిచిపోయాయి. అత్యవసరం ఉన్నవారి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు మేడ్చల్ వాసి కర్కి రమేశ్ తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాక కేబుల్ వైర్ల తొలగింపు చేపట్టాలని కోరారు. సిబ్బంది వాహనాల్లో భారీగా తొలగించిన కేబుల్ వైర్లను తరలిస్తున్నారు.
వినాయక విగ్రహాల తరలింపులో ప్రమాదం జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వీటిని తప్పకుండా పాలించాలని సూచించారు.
☞ విగ్రహాల ఎత్తును బట్టి రూట్ను ఎంచుకోవాలి.
☞ విద్యుత్లైన్ల నుంచి కనీసం 2 అడుగుల దూరం పాటించాలి.
☞ క్రేన్లు, ట్రక్కులు, మెటల్ విగ్రహాల తరలింపులో అప్రమత్తత.
☞ మండపాలకు కరెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
☞ మండపాల్లో కరెంట్ పనులు చేసేటప్పుడు పరిసరాలను పరిశీలించాలి.
HYDలో <<17459238>>24Hrs బస్సులు<<>> నడపాలని పలువురు కోరడంతో ఉదయం Way2News వార్త పబ్లిష్ చేసింది. దీనికి మెజార్టీ ప్రజలు సానుకూలంగా స్పందించారు. లాస్ లేకుండా కొన్ని రూట్లలో నడపొచ్చని, ఉ.4 నుంచి రాత్రి ఒంటి గంటవరకు, మధ్యతరగతి ప్రజలకు ఆర్టీసీ సేవలు అవసరమని, పటాన్చెరు- సికింద్రాబాద్ నైట్ టైమ్ బస్సులు కావాలని, కనీసం గంటకో బస్ అయినా.. అంటూ కామెంట్లు వచ్చాయి. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలని పలువురు కోరారు.
త్వరలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ప్రతీ డివిజన్లో సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలోని కీలక నేతలు తమకే టికెట్ అన్నట్లు ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి రేసులో అంజన్ కుమార్ యాదవ్, ఆజారుద్దీన్, నవీన్యాదవ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు నేతలు ఢిల్లీ పెద్దలను కలిస్తున్నారు.
ప్రపంచదేశాల ప్రజలు జీవిస్తున్న మహానగరంలో 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తార్నాక, హబ్సిగూడ, ఎల్బీనగర్, కోఠి, పంజాగుట్ట, అమీర్పేట్, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో అర్ధరాత్రి విధులు ముగించే మహిళలకి ఇబ్బంది అవుతుందని తెలిపారు. ప్రైవేటు ట్రావెల్స్ దీనిని అదునుగా చేసుకుని డబ్బులు దోచేస్తున్నాయని ఆరోపించారు. నైట్షిఫ్ట్ బస్సులు నడపాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
గణేశ్ ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం HYD జూబ్లీహిల్స్ పరిధిలోని MCRHRDలో గణేశ్ ఉత్సవాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పారు. ఎక్కడా సమస్యలు రాకుండా చూస్తామన్నారు. పోలీస్ బందోబస్తు ఉంటుందని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.