Hyderabad

News August 20, 2025

సికింద్రాబాద్: గాంధీ ఆసుపత్రికి ఓ స్పెషల్ ఆఫీసర్: హెల్త్ మినిస్టర్

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి, అడ్మినిస్ట్రేషన్ పరంగా లోపాల నివారణకు గాను స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ తెలిపారు. వైద్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఓపీ బ్లాక్, ఐవీఎఫ్ సెంటర్ తదితర విభాగాలను పరిశీలించారు. పలువురు పేషంట్లతో మాట్లాడారు. సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు రూ.5 కోట్లు కేటాయిస్తామని తెలిపారు.

News August 19, 2025

HYD: వరుసగా వర్షాలు.. నగరంలో మురుగు పరుగులు

image

వరుసగా వర్షాలు కురుస్తుండడంతో గ్రేటర్ HYDలో మురుగు పరుగులు పెడుతోంది. దీంతో పాదచారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుత్బుల్లాపూర్‌లోని పద్మానగర్, మాదన్నపేట, బాలానగర్‌లోని రాజీవ్ గాంధీనగర్, గచ్చిబౌలిలోని ఓఆర్ఆర్ ఎక్స్ రోడ్, కొండాపూర్‌లోని కేఎంఆర్ ఎస్టేట్ వద్ద, బేగంపేటలోని వసంతనగర్, పాటిగడ్డ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలతో స్థానికులు సతమతమవుతున్నారు.

News August 19, 2025

HYD: మార్వాడీలను గో బ్యాక్ అనడం ఎందుకు..?: VH

image

రిలయన్స్, డీ మార్ట్ లాంటి బడా కంపెనీల్లో అన్ని వస్తువులు దొరుకుతున్నప్పుడు.. మార్వాడీలను గో బ్యాక్ అనడం ఎందుకని మాజీ ఎంపీ హనుమంత్‌రావు అన్నారు. మంగళవారం HYD గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తున్నారు.. ఈ విధమైన నినాదాలతో అభివృద్ధి కుంటు పడుతుంది.. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. ఇది సరైన పద్ధతి కాదు’ అని అన్నారు.

News August 19, 2025

HYD: ‘హజ్ యాత్రికులకు గమనిక.. రేపటిలోపు డబ్బు చెల్లించాలి’

image

హజ్-2026 యాత్రికులకు HYDలో హజ్ కమిటీ కీలక సూచనలు చేసింది. హజ్ యాత్రకు ఎంపికైన వారు ఈనెల 20లోపు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం చెల్లించాలని సూచించింది. అలాగే డబ్బు చెల్లించిన రసీదు, మెడికల్ రిపోర్టులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను ఈనెల 25లోపు ఇవ్వాలని హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ గులామ్ అఫ్జల్ బియాబని తెలిపారు. హజ్ యాత్రికులు సాధ్యమైనంత త్వరగా ఫీజు చెల్లించాలని కోరారు.

News August 19, 2025

HYD: లిబర్టీ వద్ద గంజయితో దొరికారు..!

image

HYD ట్యాంక్ బండ్ పరిధి లిబర్టీ T జంక్షన్ దగ్గర సురజ్ ట్రావెల్స్ ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని దోమలగూడ పోలీసులు పట్టుకుని తనిఖీ చేశారు. వారిని గంజాయి పెడ్లర్లుగా గుర్తించి, అరెస్ట్ చేశారు. వారి నుంచి 18 కిలోల గంజాయి, 2 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన కోమల్ సోమినాథ్ పవార్(23), సాహిల్ మహేశ్ సలున్కే(18) అరెస్టవగా విజయవాడకు చెందిన మరో నిందితుడు బాబు పరారయ్యాడు.

News August 19, 2025

సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే రికార్డు

image

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో మహిళలు రికార్డ్ సాధించారు. జోన్‌లోని 5 కీలకమైన వాణిజ్య, ఆపరేటింగ్, ఫైనాన్స్, సెక్యూరిటీ, వైద్య విభాగాలను మహిళా అధికారులు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్స్ మేనేజర్‌గా కె.పద్మజ, భద్రత విభాగానికి అరోమాసింగ్ ఠాకూర్, ప్రధాన ఆర్థిక సలహాదారుగా హేమ సునీత, వాణిజ్యానికి కమర్షియల్ మేనేజర్‌గా ఇతి పాండే, ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్‌గా నిర్మల నరసింహన్ ఉన్నారు.

News August 19, 2025

HYD: అక్రమ సరోగసి కేసు.. మూడు సెంటర్లకు నోటీసులు

image

అక్రమ సరోగసి కేసును HYD పేట్ బషీరాబాద్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇందుకు సంబంధించి మూడు సెంటర్లను నోటీసులు జారీ చేశారు. మాదాపూర్‌లోని హెగ్డే హాస్పిటల్, కొండాపూర్‌లోని శ్రీ ఫెర్టిలిటి సెంటర్, సోమాజిగూడలోని ఫెర్టి కేర్‌కు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ సరోగసి వ్యవహారంలో ఈ మూడు ఆస్పత్రులు కీలకంగా వ్యవహరించారని పోలీసులు భావిస్తున్నారు.

News August 19, 2025

యాదగిరిగుట్ట ఆలయానికి నాలుగు ISO సర్టిఫికెట్లు

image

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ISO 9001, ISO 22000తో సహా మొత్తం నాలుగు సర్టిఫికేషన్ పురస్కారాలు లభించాయి. దేశంలోనే ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన తొలి ఆలయంగా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినందుకు, ప్రసాదాల తయారీలో అత్యున్నత ప్రమాణాలు పాటించినందుకు ఈ అవార్డులు వచ్చాయి. ఈ సర్టిఫికెట్లను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క సమక్షంలో ఆలయ అధికారులకు ఈరోజు HYDలో అందజేశారు.

News August 19, 2025

HYD: KBR పార్క్ వద్ద పనులు పర్యవేక్షించిన మంత్రి

image

HYD KBR పార్క్ వ‌ద్ద నిలిచిన వ‌ర‌ద నీటిని హైడ్రా తొల‌గించింది. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, GHMC మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి ఈ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. ఈ స‌మ‌స్య‌ను కౌన్సిల్‌లో పెట్టి పైపులైన్ల ఏర్పాటు ప‌నుల‌ను మంజూరు చేయిస్తామని మంత్రి, మేయర్ అధికారుల‌కు చెప్పారు. అప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ నీరు నిల‌వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారుల‌కు సూచించారు.

News August 19, 2025

HYD: డాక్టరేట్ పట్టా పొందిన ఎమ్మెల్సీ దయాకర్

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం 84వ స్నాతకోత్సవం ఈరోజు ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓయూ ఛాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణ్, వీసీ కుమార్ మొగులం చేతుల మీదుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన మాట్లాడుతూ.. గౌరవ డాక్టరేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.