Hyderabad

News February 23, 2025

BREAKING: మైనర్లపై పెట్రో దాడి.. గాయాలు

image

పేట్ బషీరాబాద్ PS పరిధిలో దారుణం జరిగింది. జై రామ్ నగర్‌లోని నిర్మాణుష్య ప్రాంతంలో ఆడుకునేందుకు ఐదుగురు మైనర్లు (ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు బాలికలు) వెళ్లారు. ఇద్దరు అమ్మాయిలపై జరిగిన పెట్రోల్ దాడిలో ఒక బాలిక(10)కు తీవ్ర గాయలు, మరో బాలిక(9)కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మైనర్‌లకు పెట్రోల్ డబ్బా, అగ్గిపెట్టే ఎక్కడి నుంచి వచ్చాయన్నది మిస్టరీగా మిగిలింది.

News February 23, 2025

HYD: రెండో భర్త వేధింపులు తాళలేక వివాహిత సూసైడ్

image

భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన వారాసిగూడ పీఎస్​ పరిధిలో శనివారం జరిగింది. ఓల్డ్​ అల్వాల్​‌కు చెందిన శీరిష (28)కు 2019లో సరూర్​ నగర్​‌కు చెందిన పవన్​‌తో వివాహమైంది. అనారోగ్యంతో భర్త పవన్​ 2020లో చనిపోయాడు. 2024లో శీరిషను వారాసిగూడకు చెందిన యాకుబ్​ రెడ్డికి ఇచ్చి రెండో వివాహం చేశారు. మద్యానికి బానిసైన భర్త తరచుగా భార్య శీరిషను హింసించేవాడు. దీంతో శీరిష సూసైడ్ చేసుకుంది.

News February 22, 2025

HYD: ఫాల్కన్ కంపెనీ స్కాం.. రూ.1700 కోట్లు

image

ఫాల్కన్‌ స్కాంపై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా రూ.1,700 కోట్లు ఫాల్కన్‌ కంపెనీ వసూలు చేసింది. ఒక్క హైదరాబాద్‌లోనే రూ.850 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. కాగా, ఈ డబ్బును విదేశాలకు మళ్లించినట్లు తెలిపారు. ఈసీఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు.

News February 22, 2025

HYD: చందానగర్‌లో దారుణ హత్య

image

చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. గోపినగర్‌కు చెందిన ఫక్రుద్దీన్,‌ నజీర్ స్నేహితులు. రాత్రి 8 గంటల సమయంలో మాట్లాడే పని ఉందని స్నేహితులు గోపిచెరువు వద్దకు నజీర్‌ను తీసుకెళ్లారు. అక్కడ గొడవ జరగింది. ఫక్రుద్దీన్ దాడిలో నజీర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 22, 2025

ఇబ్రహీంపట్నం: ఈ నెల 24న బడుల్లో వంట బంద్

image

రంగారెడ్డిలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ బంద్‌కు పిలుపునిచ్చింది. గురువారం CITU ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం MEOకు మెమోరాండం అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.10 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న తెలిపారు. కానీ, ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 24న బడుల్లో ‘వంట బంద్’ చేసి చలో కలెక్టరేట్‌లో పాల్గొంటామన్నారు.

News February 22, 2025

కీసరగుట్ట జాతర.. 2,000 మందితో బందోబస్తు!

image

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల కోసం కట్టుదిట్టంగా భద్రతను చేపడుతున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు CP పేర్కొన్నారు. ఆలయం వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.

News February 22, 2025

HYD: బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహుల పార్టీలు: అద్దంకి

image

బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహుల పార్టీలు అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు సంబంధించి దేశంలో ఇంత పెద్ద ఎత్తున విప్లవం వస్తున్న క్రమంలో.. ఎందుకు బీజేపీ బీసీలకు రిజర్వేషన్ల గురించి ఆలోచించదని ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్లు సాధించడమే రాహుల్ గాంధీ జీవిత లక్ష్యమని వివరించారు.

News February 21, 2025

వివిధ కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ

image

ఓయూలోని వివిధ సైకాలజీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ, ఎంఫిల్ ఇన్ రిహబిలిటేషన్ సైకాలజీ కోర్సుల మొదటి సెమిస్టర్, పీఎస్వై క్లినికల్ సైకాలజీ మొదటి సంవత్సరం, ప్రొఫెషనల్ డిప్లమా ఇన్ క్లినికల్ సైకాలజీ రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 7వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. రూ. 200 అపరాధ రుసుముతో 12వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు.

News February 21, 2025

కీసర గుట్ట జాతర.. CM రేవంత్ రెడ్డికి ఆహ్వానం

image

మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసర గుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 24 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రావాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్‌ఛార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్ ఆధ్వర్యంలో CM రేవంత్ రెడ్డిని శుక్రవారం ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు. కాగా ఇప్పటికే గుడి వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

News February 21, 2025

శుక్రవారం: HYDలో మళ్లీ తగ్గిన చికెన్ ధరలు

image

HYDలో చికెన్ ధరలు మళ్లీ తగ్గాయి. గురువారం KG స్కిన్‌లెస్ రూ.186, విత్ స్కిన్ రూ.164 చొప్పున అమ్మకాలు జరిపారు. నేడు ఏకంగా KG మీద రూ.15 నుంచి రూ.18 వరకు తగ్గించారు. శుక్రవారం KG స్కిన్ లెస్ రూ.168, KG విత్ స్కిన్ రూ.148గా ధర నిర్ణయించారు. కొన్ని హోల్ సేల్ దుకాణాల్లో రూ. 160కే అమ్మకాలు జరుపుతున్నారు. రిటైల్ షాపుల్లో మాత్రం ధరలు యథావిధిగా ఉంటున్నాయి. మీ ఏరియాలో KG చికెన్ ఎంత?