India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ అభివృద్ధి, ప్రజా పాలన, తెలంగాణ ప్రభుత్వానికి సలహా ఇచ్చే కమిటీలో ప్రొ.కంచె ఐలయ్యకు చోటు కల్పించారు. కమిటీలో యూజీసీ మాజీ ఛైర్మన్ సుఖ్ దేవ్ తొరట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ. భూక్యా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్లానింగ్, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన పనిచేయనుంది.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సిరిపురం యాదయ్య ఆత్మ బలిదానం చేసుకొని నేటికి 15ఏళ్లు అయ్యింది. 2010లో ఇదే రోజున RR జిల్లా నాగారం ప్రాంతానికి చెందిన యాదయ్య ఓ అనాథ. 19 ఏళ్ల వయస్సులో ఓ హోటల్లో పనిచేసుకుంటూ చదువుకునే రోజుల్లో తెలంగాణ కోసం అమరుడయ్యాడని చంచల్గూడ ఎస్పీ శివకుమార్ అన్నారు. తెలంగాణ ఫలాలు అనుభవిస్తున్నవారిలో ఎంత మందికి గుర్తున్నాడో..? మన యాదయ్య. జై తెలంగాణ!జై జై తెలంగాణ..! అంటూ ట్వీట్ చేశారు.
గాంధీ హాస్పిటల్ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. అలాంటి ఆసుపత్రిముందునెలకొల్పిన గాంధీవిగ్రహానికి రిపబ్లిక్ డే సందర్భంగా వేసిన పూలమాల, గద్దే చుట్టూ అలంకరించినపూలు వాడిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. నిత్యం వేలమందివచ్చే ఈ చారిత్రక దవాఖానా ప్రధానగేట్ ముందే పరిస్థితి ఇలా ఉంటే.. ఇతర ఆసుపత్రుల పరిస్థితిని అర్థంచేసుకోవచ్చని అక్కడి స్థానికులు అంటున్నారు.
తెలంగాణ ట్రాన్స్జెండర్, హిజ్రా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బాగ్లింగంపల్లిలో శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. టీపీఏస్కే రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అత్యంత వివక్షకు గురైన ట్రాన్స్జెండర్స్కు బడ్జెట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపించాయని వెంటనే మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి వీడదీసి ప్రత్యేకంగా ట్రాన్సెజెండర్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ భవన్లో బుధవారం KCR అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ కీలక నేతలు రాకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాలేదు. ఉప్పల్ MLA లక్ష్మారెడ్డి తన వదిన దశదినకర్మ నేపథ్యంలో హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాల సమాచారం. కాగా.. మిగతా ఎమ్మెల్యేలు గైర్హాజరుకు గల కారణాలు తెలియాల్సింది ఉంది.
KPHB PS పరిధిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పెళ్లి జరిగిన సంవత్సరం నుంచి వరకట్నం కోసం భర్త వేణుగోపాల్ వేధిస్తూ ఉండేవాడని మృతురాలు దీపిక తల్లిదండ్రులు ఆరోపించారు. వీరికి 13 నెలల బాలుడు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీన ఆమె సోదరుడు దీపిక ఇంటికి రాగా ఇంట్లో ఉరివేసుకుని కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ కరెంట్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తున్నట్లు TGSPDCL తెలిపింది. గ్రేటర్ పరిధిలో ఫిబ్రవరి 16న 60.06 మిలియన్ యూనిట్ల కరెంటు వినియోగించగా, అదే 18వ తేదీన డిమాండ్ కాస్త 70 యూనిట్లకు చేరింది. రాబోయే కొద్ది రోజుల్లో కరెంటు డిమాండ్ భారీ స్థాయిలో పెరగనున్న నేపథ్యంలో అధికారులు ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్నారు.
HYDలో బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా. దామోదర వెల్లడించారు. దీంతో చికెన్ మార్కెట్ ఊపిరిపీల్చుకుంది. KG రూ. 140కి పడిపోయిన ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. KG స్కిన్లెస్ రూ. 186, విత్ స్కిన్ రూ. 164గా ధరలు నిర్ణయించారు. కోళ్ల నుంచి మనుషులకు సోకిన కేసులు ఎక్కడా నమోదు కాలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు.
గచ్చిబౌలిలో పోలీసులు రైడ్స్ నిర్వహించారు. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్నవారిని అరెస్టు చేశారు. గచ్చిబౌలి PS పరిధిలో శ్రీరాంనగర్ కాలనీలో స్టైలిష్ బ్యూటీ స్పా నిర్వహిస్తున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, గచ్చిబౌలి పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకుడు సత్యనారాయణ, విటులు శ్రీకాంత్, గోవిందరావు, అప్పారావులను అరెస్ట్ చేశారు.
తెలంగాణలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎన్జీఓస్ అధ్యక్షుడు ఎం.జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల హెల్త్కార్డ్స్, పీఆర్సీ, పెండింగ్ డీఏ సమస్యలు పరిష్కరించాలన్నారు.
Sorry, no posts matched your criteria.