Hyderabad

News August 9, 2024

HYD: నాగులపంచమి: ‘పాములను హింసించవద్దు’

image

నాగులపంచమి రోజున పూజల పేరుతో పాములను పట్టుకుని హింసించవద్దని భారతీయ ప్రాణి మిత్ర సంఘ్‌ అధ్యక్షుడు జస్‌రాజ్‌శ్రీ శ్రీమల్, ప్రధాన కార్యదర్శి మహేశ్‌ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పాములను హింసించే వారి సమాచారాన్ని టోల్‌ఫ్రీ నంబర్‌ 18004255364కు తెలియజేస్తే బహుమతి ఇస్తామని ప్రకటించారు. 

News August 9, 2024

HYD: GREAT.. 4 GOVT JOBS సాధించింది!

image

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పాతదొనబండ తండా వాసి భూక్యా మౌనిక ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. పేద కుటుంబానికి చెందిన ఆమె HYD దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ స్థానికంగా ఉండే పిల్లలకు హోమ్ ట్యూషన్లు చెబుతూ ఆమె చదువుకుంది. ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్-4 ఆరో ర్యాంకు, TGPSC ఫలితాల్లో పంచాయతీరాజ్ AEE, 2023లో రైల్వేలో క్యారేజ్ అండ్ వ్యాగన్, లెవల్-3లో కమర్షియల్ కం టికెట్ క్లర్క్ జాబ్స్ సాధించింది.

News August 9, 2024

హైదరాబాద్: సెలవు ఇవ్వాలని డిమాండ్

image

ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌కు రెండవ శనివారం తప్పక సెలవు ఇవ్వాలని TPTLF(తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్) డిమాండ్ చేస్తోంది. నాంపల్లిలో విద్యాశాఖ అడిషనల్ డెరైక్టర్ లింగయ్యకి మెమోరాండం అందజేశారు. రోజు‌కు 8 నుంచి 10 గంటలు పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో DYFI రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, SFI రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేశ్ జునుగారి, నాయకులు సాయి కిరణ్ ఉన్నారు.

News August 9, 2024

హైదరాబాద్: HMDAలో కొత్త జోన్లు

image

HMDAలో కొత్తగా 2 జోన్లు పెంచారు. ఇప్పటివరకు ఘట్‌కేసర్, మేడ్చల్, శంషాబాద్, శంకర్‌పల్లి‌ HMDA పరిధిలో ఉండేవి. ఇకమీదట ఘట్‌కేసర్, శంషాబాద్‌తో పాటు మేడ్చల్-1, మేడ్చల్-2, శంకర్‌పల్లి-1, శంకర్‌పల్లి-2 అని రెండు జోన్లుగా విభజించారు. శంకర్‌పల్లి జోన్-1కు ప్రసాద్ రావు, శంకర్‌పల్లి-2కు మల్లికార్జునరావుకు బాధ్యతలు అప్పగించారు. మేడ్చల్-1కు గోపిక రమ్య, మేడ్చల్-2కు శాలినికి ప్లానింగ్ అధికారిగా నియమించారు.

News August 9, 2024

పరిశ్రమలకు హైదరాబాద్ స్వర్గధామం: డిప్యూటీ సీఎం

image

హైదరాబాదులో పరిశ్రమలు స్థాపనకు ప్రభుత్వ పక్షాన సంపూర్ణ సహకారం అందిస్తామని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్రానెట్ విన్ ఓవెన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, అర్బన్, స్కిల్ డెవలప్మెంట్ అంశాలు చర్చించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పరిశ్రమలకు హైదరాబాద్ స్వర్గధామం అని అన్నారు.

News August 8, 2024

HYD: ప్రతీ ఇంటికి డిజిటల్ డోర్ నంబర్: ఆమ్రపాలి

image

దాదాపు 650 చదరపు కి.మీటర్ల విస్తీర్ణం గల హైదరాబాద్ మహానగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19.43 లక్షల నిర్మాణాలు ఉన్నట్లు కమిషనర్ ఆమ్రపాలి వెల్లడించారు. అందులో 2.7 లక్షల కమర్షియల్‌ గృహాలు ఉన్నాయి. GIS సర్వే పూర్తికాగానే ప్రతి ఇంటికి డిజిటల్ డోర్ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. GIS డిజిటల్ బోర్డ్‌తో ప్రజలు ప్రభుత్వ సేవలను ఇంటినుంచే పొందే వీలు ఉంటుందన్నారు.

News August 8, 2024

ఉస్మానియా మెడికల్ కళాశాలకు ISO గుర్తింపు

image

ఉస్మానియా మెడికల్ కళాశాల ISO-9001-2015 గుర్తింపు దక్కింది. ఆ సంస్థ ప్రతినిధి శివయ్య గుర్తింపు పత్రాన్ని కళాశాల డా.నరేంద్ర కుమార్‌కు అందజేశారు.  తెలంగాణలో రెండోసారి ISO గుర్తింపు తమ కళాశాలకు దక్కడం అభినందనీయం అన్నారు. వైస్ ప్రిన్సిపల్‌లు డా.శంకర్, డా.పద్మావతి, ఏడీ డా.శ్రీధర్ చారి మాజీ వైస్ ప్రిన్సిపల్ డా.టక్యుద్దీన్ ఉన్నారు.

News August 8, 2024

ఈ నెల 14న కాగ్నిజెంట్ విస్తరణకు ముహూర్తం

image

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తన విస్తరణ ప్రణాళికను ఆగస్టు 14న ప్రారంభించనుంది. ఈ మేరకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 5న న్యూజెర్సీలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈవో రవికుమార్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా తమ ప్రణాళిక ఉంటుందని కాగ్నిజెంట్ పేర్కొంది.

News August 8, 2024

దేశంలోనే హైదరాబాద్‌కు 2వ స్థానం

image

రియల్ ఎస్టేట్ రంగంలో‌ రాజధాని‌ దూసుకెళ్తోంది. దేశంలోని అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. అఫర్డబిలిటీ ఇండెక్స్ పేరుతో నైట్ ఫ్రాంక్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. హౌస్ EMI-ఆదాయ నిష్పత్తి ఆధారంగా ఇండియాలోని 8 ప్రధాన నగరాలను ఎంచుకుంది. దీని ప్రకారం 51 శాతం నిష్పత్తితో ముంబై తొలిస్థానంలో ఉంది. 30 శాతంతో హైదరాబాద్‌ 2వ స్థానంలో నిలిచింది.

News August 8, 2024

GIS: హైదరాబాద్‌లో డ్రోన్ సర్వే: కమిషనర్ ఆమ్రపాలి

image

పట్టణ ప్రణాళిక, వనరుల నిర్వహణ మెరుగుపరచడమే GIS సర్వే ప్రధాన లక్ష్యమని కమిషనర్ ఆమ్రపాలి కాట అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆమె సమావేశం అయ్యారు. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(GIS) గురించి వివరించారు. గ్రేటర్‌ మొత్తాన్ని డ్రోన్ ద్వారా సర్వే చేసి రికార్డు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములు, చిన్న పెద్ద రోడ్లు, చెరువులు, సరస్సులు అన్నింటిని, సిటీ మొత్తం మ్యాపింగ్ జరుగుతుందన్నారు.