India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైకాలజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ, ఎంఫిల్ రిహాబిలిటేషన్ సైకాలజీ, పీఎస్వైడీ, ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ తదితర కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు వివరించారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని సూచించారు.
నగరంలో దోమల నివారణపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. నగర వ్యాప్తంగా గుర్తించిన 4,846 కాలనీల్లో నీటి నిల్వ ప్రదేశాలు, చెరువులు, బావులు, కుంటల్లో గాంబియా చేపలు, ఆయిల్ బాల్స్ విడుదల చేస్తున్నారు. మానవ జోక్యం లేని ప్రదేశాలలోనూ స్ప్రేయింగ్ మిషన్ల ద్వారా దోమల పెరుగుదలను అరికడుతున్నార.
ఓయూ దూరవిద్య ద్వారా అందించే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశపరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. దరఖాస్తులను ఆన్లైన్లో వచ్చే నెల 2వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు చెప్పారు. రూ.500 అపరాధ రుసుమతో 5వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. ఈ పరీక్షను వచ్చే నెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఓయూ దూరవిద్య ద్వారా అందించే MCA పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాలపై రివాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఒక్కో పేపర్కు రూ.800 చొప్పున చెల్లించి ఈ నెల 19వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రూ.200 అపరాధ రుసుముతో 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా 3 MMTS సర్వీస్లను నడపనుంది. ఉందానగర్ – హైదరాబాద్, హైదరాబాద్- లింగంపల్లి, లింగంపల్లి- ఉందానగర్ 3 స్పెషల్ ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. స్కూల్, కాలేజీలు, వివిధ విద్యా సంస్థలకు వెళ్లే వారికి ఈ సర్వీస్లు ఉపయోగపడనున్నాయి.
గ్రేటర్ HYD వ్యాప్తంగా మొత్తం 149 వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు, ఒక్కసారిగా వర్షం కురిసిన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం కోసం పకడ్బందీగా చర్యలు చేపట్టినట్లు హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు తెలిపారు. అర్ధరాత్రి సమయంలోనూ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
మత్తుకు బానిసవుతున్న యువత ఆరోగ్యం క్షేనిస్తోంది. జ్ఞాపకశక్తి మందగించడం, కళ్లు ఎరుపెక్కటం, పెదాలు పొడి బారిపోవడం, ఒంటరిగా బతకటం, మానసిక ఒత్తిడిని గమనించటం, ఆకలి తగ్గిపోవడం, అంతకు ముందులా నిద్ర లేకపోవడం, నిద్రకు దూరం అవటం లాంటివి గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని HYD ఎర్రగడ్డ మానసిక వైద్య ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
పెద్దమ్మగుడి కూల్చివేతపై హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు అయ్యింది. అక్రమంగా కూల్చిన ఆలయాన్ని మళ్లీ నిర్మించాలని న్యాయవాది పల్లె వినోద్కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో హైకోర్టులో పెద్దమ్మ గుడి కూల్చివేతపై విచారణ జరగనుంది. గుడి కూల్చివేత కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పిటీషన్లో పేర్కొన్నారు.
ఏటా పెరంబదూర్ నుంచి ఆగస్టు 20 రాజీవ్ గాంధీ జయంతి నాటికి ఢిల్లీకి చేరుకునేలా చేపట్టే రాజీవ్ జ్యోతి యాత్ర ఈ రోజు HYDకు చేరుకుంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచన మేరకు యాత్రకు గాంధీ భవన్లో స్వాగతం పలికారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్రెడ్డి, ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్, ఉపాధ్యక్షుడు కుమార్రావ్, నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్ ఉన్నారు.
సికింద్రాబాద్ కార్ఖానా ట్రాఫిక్ PS పక్కనే మెయిన్ రోడ్డుపై భారీ గుంత ప్రమాదకరంగా మారింది. ఈ గుంత ఏర్పడి ఏడాది దాటిందని, ఇప్పటి వరకు అధికారులు మరమ్మతులు చేయలేదని, ప్రాణాలు పోతేనే స్పందిస్తారా అంటూ వాహనదారులు మండిపడుతున్నారు. బుధవారం రాత్రి ఓ కారు వేగంగా వచ్చి గుంతను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో వెనకాల వచ్చిన బైక్ నడిపే వ్యక్తి కారును ఢీకొట్టి గాయపడ్డాడు. మీ ప్రాంతంలో ఇలాంటి గుంతలు ఉంటే కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.