India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూసైడ్ అటెంప్ట్కు పాల్పడిన కానిస్టేబుల్ తూము కిరణ్బాబు(40) ఈరోజు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కిరణ్ 2017లో మీర్చౌక్ PSలో పనిచేస్తూ సస్పెండ్ అయ్యాడు. తిరిగి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఈనెల4న పెట్రోల్ పోసుకొని సూసైడ్కు యత్నించాడు. 60% కాలిన గాయాలతో గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. తమను ఆదుకోవాలని భార్య, ఇద్దరు కూతుళ్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
HYD చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చర్లపల్లి నుంచి నాగారం వెళ్లే రోడ్డుపై వస్తున్న కారు, బుల్లెట్ బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బుల్లెట్పై ఉన్న బాలుడు(17) మృతిచెందాడు. అతివేగమే ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణికుల సౌలభ్యం కోసం క్యాబ్ పికప్ పాయింట్ను మార్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన ప్రయాణికుల వాకింగ్ దూరాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యాబ్ పికప్ పాయింట్ గతంలో C పార్కింగ్లో ఉండగా ప్రస్తుతం H పార్కింగ్కు మార్చారు. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని ఎయిర్పోర్ట్ అధికారులు పేర్కొన్నారు.
హ్యాష్ ఆయిల్ ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు ఈరోజు పట్టుకున్నారు. బోయిన్పల్లి ICRISAT ఫేజ్-2 గేట్ వద్ద డ్రగ్స్ పెడ్లర్లు సాహూ సోను, బందారి రవితేజను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.8.95 లక్షల విలువైన 1,770 గ్రాముల హ్యాష్ ఆయిల్తోపాటు ఒక మొబైల్ ఫోన్ను సీజ్ చేశారు. ఇద్దరిపై NDPS కింద పూర్వ క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఏపీ నుంచి హ్యాష్ ఆయిల్ తెప్పించి చిన్నప్యాకెట్లుగా ముఠా అమ్ముతోందని గుర్తించారు.
నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఈరోజు HYDలోని డీజీపీ ఆఫీస్లో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐజీ ఎం.రమేశ్ ఆధ్వర్యంలో అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ప్రజారోగ్యం, భద్రత, యువత భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు తదితర అంశాలపై ఐజీ వివరించారు. అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, అమలు చర్యలను బలోపేతం చేయాలని సూచించారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలక శాఖ అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇక అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా ఎప్పటికప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలను మీడియాలో వచ్చేలా చూడాలని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ ఉద్యోగులకు రేపు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఉద్యోగులకు రేపు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పించాలని ఐటీ కంపెనీలను సైబరాబాద్ పోలీసులు కోరారు. దీంతో ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ సూచించారు. వీలైనంత వరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. SHARE IT
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్ వి.నారాయణన్కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ప్రకటించింది. ఈనెల 19న జరగనున్న ఓయూ 84వ స్నాతకోత్సవంలో ఓయూ కులపతి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ (డాక్టరేట్ ఆఫ్ సైన్స్) అందించనున్నట్లు ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం తెలిపారు. ఇస్రో ఛైర్మన్కు డాక్టరేట్ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.
HYDలో భారీ వర్షాలు కురుస్తున్న వేళ కలుషిత నీరు, సీవరేజి సమస్యలపై జలమండలి ప్రత్యేక దృష్టి పెట్టింది. వర్షాల నేపథ్యంలో సీవరేజి ఓవర్ఫ్లో సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా గుర్తించిన 141 నీరు నిలిచే హాట్ స్పాట్లను పర్యవేక్షించాలని, మ్యాన్హోళ్లు ఉప్పొంగితే వెంటనే పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు.
ఆపరేషన్ ముస్కాన్ అంటే ఏంటో తెలుసా..? బడికి వెళ్లే వయసులో పరిశ్రమల్లో కార్మికులుగా మారిన వారిని గుర్తించడమే ఈ ఆపరేషన్ ముస్కాన్. పలు చోట్ల యాచకులుగా, కార్మికులుగా రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో కాలం వెల్లదీస్తున్న వారిని, చిన్నారులను గుర్తించి, ఈ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో ద్వారా చేరదీస్తున్నారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఈ జులైలోనే 3,853 మందిని రక్షించినట్లుగా పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.